శివారు కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు...ఎస్.రవీంద్ర బాబు,కమిషనర్...

శివారు కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు

ఎస్.రవీంద్ర బాబు,కమిషనర్

VS9TV న్యూస్,కర్నూలు కార్పోరేషన్ :

నగరంలోని శివారు ప్రాంతాల కాలనీల్లో మౌలిక వసతులను కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని నగరపాలక కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు తెలిపారు.గురువారం ఆయన పెద్దపాడు రోడ్డులోని బోసిరెడ్డి కాలనీ,పోలీస్ కాలనీ ప్రాంతాల్లో పర్యటించారు.ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ రెండోవ పటాలం అసిస్టెంట్ కమాండెంట్ మహబూబ్ బాషాతో కలిసి కాలనీల్లో నెలకొన్న సమస్యలపై చర్చించారు. రహదారులు,మురుగు కాలువలు,తాగునీటి సమస్య పరిష్కరించాలని పోలీస్ అధికారులు కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. సానుకూలంగా స్పందించిన కమిషనర్, పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...  నగరంలో మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నామని,అత్యవసర పనులకు ప్రాధాన్యత ఇస్తూ ఒక్కొక్కటిగా సమస్యలను పరిష్కరిస్తున్నామని తెలిపారు.కాగా అంతకన్నా ముందు ఆయన ఎస్‌బిఐ ఎంప్లాయిస్ కాలనీ,అశోక్ నగర్ ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు.

Comments