కార్పొరేషన్ శానిటరీ ఇన్స్పెక్టర్'పై ఏసీబీ మెరుపు దాడి...లంచం తీసుకుంటూ దొరికిపోయిన శానిటరీ ఇన్స్పెక్టర్ రాజేంద్ర ప్రసాద్....
కార్పొరేషన్ శానిటరీ ఇన్స్పెక్టర్'పై ఏసీబీ మెరుపు దాడి లంచం తీసుకుంటూ దొరికిపోయిన శానిటరీ ఇన్స్పెక్టర్ రాజేంద్ర ప్రసాద్ VS9TV న్యూస్,కాకినాడ : అవినీతి అధికారుల అరాచకానికి అడ్డుకట్ట వేస్తూ కా కినాడ ఏసీబీ అధికారులు భారీ స్కెచ్ వేశారు. కాకి నాడ కార్పొరేషన్ శానిటేషన్ విభాగంలో 10వ సర్కిల్ శానిటరీ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న రాజేంద్ర ప్రసాద్ను ఏసీబీ డీఎస్పీ కిషోర్ బృందం రెడ్ హ్యాండె డ్గా పట్టుకుంది.ట్రేడ్ లైసెన్స్ మంజూరు విషయంలో ఒక వస్త్ర వ్యాపారి,రెస్టారెంట్ యజమానిని రాజేంద్ర ప్ర సాద్ తీవ్రంగా వేధించడమే కాకుండా పెద్ద మొత్తంలో లంచం డిమాండు చేసినట్లు తేలింది.వివరాలు ఇలా ఉన్నాయి...బాధిత వ్యాపారులు తమ ట్రేడ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోగా,రాజేంద్ర ప్రసాద్ వారిని కా ర్యాలయం చుట్టూ తిప్పించుకుంటూ వేధించడమే కాకుండా డబ్బులిస్తేనే ఫైలు ముందుకు కదులుతుం దని బెదిరించాడు.ఇన్స్పెక్టర్ ఆగడాలను భరించలేక బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.ప క్కా ప్రణాళికతో రంగంలోకి దిగిన ఏసీబీ డీఎస్పీ కిషో ర్ బృందం,మంగళ వారం సాయంత్రం బాధితుల నుం డి రాజేంద్రప్రసాద్ లంచం తీసుకుంటుండగా మెరు పు ద...