విద్యార్థినిగా మారి ఆకతాయిలకు చెక్ పెట్టిన మహి ళా ఎస్సై...విద్యార్థినుల భద్రత కోసం వినూత్న చ ర్యలు...పోలీసులపై ప్రజల్లో పెరిగిన నమ్మకం...

విద్యార్థినిగా మారి ఆకతాయిలకు చెక్ పెట్టిన మహిళా ఎస్సై
విద్యార్థినుల భద్రత కోసం వినూత్న చర్యలు 
పోలీసులపై ప్రజల్లో పెరిగిన నమ్మకం
VS9TV న్యూస్ భూపాలపల్లి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విద్యార్థినుల భద్రత కోసం పోలీసులు తీసుకున్న వినూత్న చర్య ప్రజల్లో విశేషంగా చర్చనీయాంశమైంది.టేకుమట్ల మహిళా ఎస్సై అమూల్య,విద్యార్థిని వేషధారణలో పరీక్షా కేంద్రం వద్ద ప్రత్యక్షమై ఆకతాయిల ఆటకు చెక్ పెట్టారు.పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థినులను వేధిస్తు న్నారనే సమాచారం అందుకున్న వెంటనే,పరిస్థితిని స్వయంగా తెలుసుకుని చర్యలు తీసుకోవాలని ఆమె నిర్ణయించారు.ఖాకీ యూనిఫాం వదిలి,సాధారణ విద్యార్థి నిలా ఎరుపు రంగు డ్రెస్సులో చేతిలో పుస్త కాలు పట్టుకుని పరీక్షా కేంద్రానికి వెళ్లారు.విద్యార్థి నుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించిన పోలీసు లు,పరీక్షా కేంద్రాల వద్ద పర్యవేక్షణను మరింత కట్టుది ట్టం చేశారు.ఈ చర్యతో అక్కడి పరిసరాల్లో శాంతి నెలకొనడంతో పాటు,విద్యార్థినులు ధైర్యంగా పరీక్ష లకు హాజరయ్యే పరిస్థితి ఏర్పడింది.మహిళల భద్ర తకు పోలీసులు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో ఈ ఘటన మరోసారి స్పష్టం చేసింది.అవ సరమైతే ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రజల రక్షణ కోసం పోలీ సులు ముందుండి పనిచేస్తారని మహిళా ఎస్సై అమూల్య చర్య ద్వారా స్పష్టమైంది.స్థానికులు ఆమె ధైర్యాన్ని,సమయస్ఫూర్తిని అభినందిస్తూ,ఇటువంటి చర్యలు సమాజంలో భద్రతను పెంపొందించడంలో కీలకంగా ఉంటాయని పేర్కొన్నారు.ఈ సంఘటన ఆకతాయిలకు గట్టి హెచ్చరికగా నిలిచిందని,ఇకపై ఇలాంటి వేధింపులకు పాల్పడితే కఠినచర్యలు త ప్పవని పోలీసులు హెచ్చరించారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....