మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....
మాదకద్రవ్యాల సమాచారమిద్దాం
పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన
మాదకద్రవ్యాల బారిన పడకుండా యువత ను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా వ్యవహరించి,ఈగల్ (ఎలైట్ యాం టీ-నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్) కు సహకారం అందించాలని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు పిలుపునిచ్చారు.క్షే త్రస్థాయిలో రాత్రింబవళ్లు ప్రజల మధ్య విధు లు నిర్వహించే పారిశుద్ధ్య కార్మికులు అప్రమ త్తంగా ఉండాలని,ఎక్కడైనా డ్రగ్స్,గంజాయి వంటి మాదకద్రవ్యాల వినియోగం, విక్రయం, సరఫరా లేదా రవాణా జరుగుతున్నట్లు గమ నిస్తే వెంటనే ఈగల్ టోల్ఫ్రీ నంబర్ 1972కు సమాచారం అందించాలని సూచించారు.సో మవారం 5వ శానిటేషన్ డివిజన్ కార్యాల యం వద్ద ఈగల్ టీం ఆధ్వర్యంలో మాదకద్ర వ్యాల నిర్మూలనపై పారిశుద్ధ్య కార్మికులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా కమిషనర్ చల్లా ఓబులేసు మా ట్లాడుతూ...మాదకద్రవ్యాలు యువత భవి ష్యత్తును నాశనం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.సమాజాన్ని ఈ ముప్పు నుంచి కాపాడేందుకు ప్రతి పౌరుడు బాధ్యతాయు తంగా వ్యవహరించాలని కోరారు.అనుమానా స్పద కార్యకలాపాలు,మాదకద్రవ్యాల విక్రయా లు లేదా వినియోగం పై సమాచారం అందించ డం ద్వారానేరాల నియంత్రణకు తోడ్పడవచ్చ న్నారు.పారిశుద్ధ్య కార్మికులు నగరంలోని ప్రతి ప్రాంతంలో తిరుగుతూ విధులు నిర్వహి స్తుం డటంతో,వారి సహకారం మాదకద్రవ్యాల ని ర్మూలనలో కీలకంగా ఉంటుందని తెలిపారు. అనంతరం ఈగల్ బృందం సభ్యులు మాదకద్ర వ్యాల వల్ల కలిగే దుష్పరిణామాలు,యువత పై వాటి ప్రభావం, అనుమానాస్పద కార్యక లాపాలను ఎలా గుర్తించాలి,సమాచారం ఎలా అందించాలి అనే అంశాలపై అవగాహన క ల్పించారు.ఈ కార్యక్రమంలో ఈగల్ ఎస్ఐ సు జన్,టీం సభ్యులు ఎలిషా,మాసుంవలి,శానిటే షన్ ఇన్స్పెక్టర్ అనిల్,పారిశుద్ధ్య సిబ్బంది,త దితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment