Posts

Showing posts from October, 2025

వీరబ్రహ్మేంద్రస్వామి,జగన్మాత ఈశ్వరి మహాదేవిని దర్శించుకున్న విశ్వబ్రాహ్మణ అభివృద్ధి మరియు సంక్షేమ కార్పొరేషన్ చైర్ పర్సన్ కే.పార్వతమ్మ...

Image
వీరబ్రహ్మేంద్రస్వామి,జగన్మాత ఈశ్వరి మహాదేవిని దర్శించుకున్న విశ్వబ్రాహ్మణ అభివృద్ధి మరియు సంక్షేమ కార్పొరేషన్  చైర్ పర్సన్ కే.పార్వతమ్మ VS9TV న్యూస్,కర్నూలు ప్రతినిధి : కడప జిల్లా,కందిమల్లయపల్లి జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మ ఠంలో వీరబ్రహ్మేంద్ర స్వామివారిని,శ్రీ జగన్మాత ఈశ్వరి మహాదేవి అమ్మవారిని శుక్రవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ అభివృద్ధి మరియు సంక్షేమ కార్పొరేషన్ చైర్ పర్సన్ కే.పార్వతమ్మ,కడప జిల్లా కార్పొరేషన్ డైరెక్టర్ వడ్ల శ్రీనివాస్ ఆచారిలు దర్శించుకొని ప్ర త్యేక పూజలు నిర్వహించారు.అనంతరం ఇటీవల అధిక వర్షాలకు స్వామివారు నివసిం చిన గృహం పడిపోయిన విషయం విదితమే.ఆ నివాస గృహాన్ని అధికారులు,స్వామి వా రి కుటుంబ సభ్యులు,గ్రామ పెద్దలతో కలిసి సందర్శించారు.ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ స్వామి వారు నివసించిన గృహంను గతంలో ఉన్నట్లుగానే పునరుద్ధరణ చే యాలని,భక్తుల మనోభావాలకు అనుగుణంగా నిర్మించాలని,స్వామి వారు వాడిన పరిక రాలను ఒక మ్యూజియంగా ఏర్పాటు చేసి అందులో ఉంచాలన్నారు.వీరబ్రహ్మేంద్రస్వామి మఠం,జగన్మాత ఈశ్వరి మహాదేవి మఠం పరిసర ప్రాంతాలను గొ...

అధునాతన ట్రాఫిక్ నియంత్రణ బారికేడ్స్ ను ప్రారంభం...ప్రజలు ట్రాఫిక్ రూల్స్ పాటించి పోలీసులకు సహకరించాలి...విక్రాంత్ పాటిల్,కర్నూలు జిల్లా ఎస్పీ...

Image
అధునాతన ట్రాఫిక్ నియంత్రణ బారికేడ్స్ ను ప్రారంభం ప్రజలు ట్రాఫిక్ రూల్స్ పాటించి పోలీసులకు సహకరించాలి విక్రాంత్ పాటిల్,కర్నూలు జిల్లా ఎస్పీ VS9TV న్యూస్,కర్నూలు క్రైం : ట్రాఫిక్ క్రమబద్దీకరణకు,రహదారి భద్రత నిబంధనలపై పకడ్బందీ చర్యలు తీసుకుంటు న్నామని ప్రజలు ట్రాఫిక్ రూల్స్ పాటించి పోలీసులకు సహకరించాలని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు.శుక్రవారం కర్నూలు ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ని ర్వహించిన అధునాతన ట్రాఫిక్ నియంత్రణ బారికేడ్ పరికరాలను కర్నూలు స్థానిక కొం డారెడ్డి బురుజు వద్ద కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ప్రారంభించారు.ఈ సంధర్బం గా విలేకరులతో జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ...కర్నూలు ట్రాఫిక్ పోలీసు లు వినూత్నమైన కార్యక్రమం చేపట్టారన్నారు. ప్రజలకు,విద్యార్దులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకు న్నామన్నారు.విద్యార్దులు ట్రాఫిక్ ఉల్లంఘనలు చేయకుండా అవగాహన కల్పించేందుకు ఒక ట్రాఫిక్ నమూనాను ఏర్పాటు చేశామన్నారు.జాతీయ రహాదారులలో రోడ్డు ప్రమా దాల బారిన పడకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు.ఈ నమూనాను కర్నూలు కొండారె...

అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం... కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించిన కర్నూలు పోలీసులు...

Image
అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించిన కర్నూలు పోలీసులు VS9TV న్యూస్,కర్నూలు క్రైం : విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరులకు నివాళులర్పిం చడం జరిగిం దని,పోలీసు అమరవీరుల త్యాగాలను మరవలేనివని అడిషనల్ ఎస్పీలు హుస్సేన్ పీరా, కృష్ణమోహన్ అన్నారు.జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు శుక్రవారం రాత్రి క ర్నూలు పట్టణంలో పోలీసు అమరవీరులను స్మరిస్తూ కర్నూలు పోలీసులు కొవ్వొత్తుల ర్యా లీ కార్యక్రమం చేపట్టారు.పోలీసు అమరవీరులను స్మరిస్తూ పోలీసు కార్యాలయంలోని పోలీసు అమరవీరుల స్ధూపం వద్ద కొవ్వొత్తులను ఉంచి పోలీసు అమరవీరులకు నివాళు లర్పించారు.జిల్లా పోలీసు కార్యాలయం-కర్నూలు కొండారెడ్డి బురుజు నుండి పెద్ద మా ర్కెట్ రోడ్డులో ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు పోలీసు బ్యాండ్‌ మధ్య పోలీసు అధికా రులు సిబ్బంది,కొవ్వొత్తుల ర్యాలీ కొనసాగిందారు.ఈ సందర్బంగా అడిషనల్ ఎస్పీ హుస్సే న్ పీరా మాట్లాడుతూ...అమరులైన పోలీసు త్యాగాలను మనమందరం గుర్తు చేసుకుం టూ కొవ్వొత్తుల ర్యాలీని చేపట్టడం జరిగిందన్నారు.పోలీసుల అమరవీరుల వారోత్సవాల సందర్భంగా ఈనెల 21 నుండి 31 వరకు జిల్లా వ్యాప్తంగా అన...

వీధి కుక్కల కేసులో చీఫ్ సెక్రటరీలు ఫిజికల్ గా హాజరుకావాల్సిందే...

Image
వీధి కుక్కల కేసులో చీఫ్ సెక్రటరీలు ఫిజికల్ గా  హాజరు కావాల్సిందే VS9RV న్యూస్, హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా నెలకొన్న కుక్కల బెడదపై సుప్రీంకోర్టు మరోసారి సీరియస్ అయింది.ఇటీ వల కుక్కల సమస్యపై సుప్రీం ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అంతర్జాతీయంగా భా రతదేశ గౌరవం డ్యామేజ్ అవుతున్నా మేలుకోరా? అంటూ వ్యాఖ్యానించింది.తాజాగా ఇదే అంశంపై న్యాయ స్థానం...చీఫ్ సెక్రటరీ లకు కీలక ఆదేశాలు జారీ చేసింది.చీఫ్ సెక్ర టరీలు సోమవారం ధర్మాసనం ముందు ఫిజికల్‌ గా హాజరు కావాల్సిందేనని సూచించిం ది.ఒకవేళ వ్యక్తిగతంగా హాజరుకాకపోతే తగిన చర్యలు తీసుకుంటామని జస్టిస్ విక్రమ్ నాథ్, సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం  హెచ్చరించింది.వీధి కుక్కల కేసు విచార ణకు తెలంగాణ,ఢిల్లీ,పశ్చిమ బెంగాల్ మినహా ఇతర రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాల చీఫ్ సెక్రటరీ‌లు ఎందుకు హాజరు కావడం లేదని సుప్రీంకోర్టు సీరియస్ అయింది.ఈ సందర్భం గా రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాల చీఫ్ సెక్రటరీలు ఫిజికల్‌గా హాజరు కావాల్సిందేనం టూ నోటీసులు జారీ చేసింది.అయితే వర్చువల్‌గా కోర్టు ముందు హాజరయ్యేందుకు అను మతి ఇవ్వాలంటూ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా క...

ఈ నెల 27 నుండి నవంబర్,2వ తేదీ వరకు విజిలెన్స్ అవగాహనా కార్యక్రమాలు...

Image
ఈ నెల 27 నుండి నవంబర్,2వ తేదీ వరకు  విజిలెన్స్ అవగాహనా కార్యక్రమాలు అవతార్ సింగ్,ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా  కర్నూలు డివిజనల్ కార్యాలయం డివిజనల్ మేనేజర్ VS9TV న్యూస్,కర్నూలు క్రైం : సర్దార్ వల్లభభాయ్ పటేల్ 150వ జయంతి ప్రేరణతో,ఆయన నిజాయితీ, దేశభక్తి స్ఫూర్తి తో,ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కర్నూలు డివిజనల్ కార్యాలయం ఆధ్వర్యంలో శుక్ర వారం విజిలెన్స్ అవేర్‌నెస్ వాక్‌థాన్ కార్యక్రమం   నిర్వహించారు.ఈ సందర్బంగా డివిజ నల్ మేనేజర్ అవతార్ సింగ్ మాట్లాడుతూ ఈ నెల 27 నుండి నవంబర్,2వ తేదీ వరకు విజిలెన్స్ అవగాహనా కార్యక్రమాలు జరుపుతున్నట్లు చెప్పారు.సత్యనిష్ఠే నిజమైన దేశభ క్తి అని పేర్కొన్నారు.నిజమైన విజిలెన్స్ వ్యక్తి అంతర్గత అవగాహనతో ప్రారంభమై సమా జానికి వ్యాపించాల్సినదని వివరించారు.విజిలెన్స్ అనేది వ్యక్తి,కుటుంబం,సమాజం,ప్ర కృతి అనే నాలుగు స్థాయిలను కలిపే అఖండ శృంఖలం అన్నారు.వ్యక్తి స్థాయిలో విజి లె న్స్ తగ్గితే నైతిక విలువలు బలహీనమవుతాయి.కుటుంబ స్థాయిలో అవినీతి సహజమ వుతుంది.సమాజ స్థాయిలో అవినీతి సాధారణమై పారదర్శకత తగ్గుతుంది.చివరికి ప్రకృ తి స్థాయిలో వనరుల దుర్విని...

ఓ పద్ధతి ప్రకారం సాంకేతికతను సక్రమంగా వినియోగించాం...సీఎం చంద్రబాబు...

Image
ఓ పద్ధతి ప్రకారం సాంకేతికతను సక్రమంగా వినియోగించాం సీఎం చంద్రబాబు VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి : ప్రతి కుటుంబాన్ని,ఇంటినీ జియోట్యాగింగ్ చేయగలిగాం.తుపాను వల్ల మారుతున్న పరి ణామాలకు తగ్గట్లుగా నిర్ణయాలు మార్చుకున్నాం.గతంలో పింఛన్ ఇచ్చేందుకు 2.65 లక్ష ల మంది వాలంటీర్లను పెట్టారు.ప్రస్తుతం 1.60లక్షల మందితోనే మూడు గంటల్లో పింఛ న్ల పంపిణీ చేస్తున్నాం.గతంలో విద్యుత్ సరఫరా ఆగితే...10 గంటల వరకు వచ్చేది కా దు-ప్రస్తుతం విద్యుత్ సరఫరా ఆగినా...మూడు గంటల్లోనే పునరుద్ధరణ జరిగింది. అంద రూ నిబద్ధతతో పనిచేశారు.చాలా సంతోషంగా ఉంది.కూలిన చెట్లను వర్షాలు పడుతు న్నా కూడా తొలగించారు.కూలిన చెట్లను ఎప్పటికప్పుడు తొలగించి ఇబ్బందులు లేకుం డా చేశారు.గతంలో చెట్లు కూలితే...తొలగించేందుకు వారం పట్టేది.

ఏకపక్షంగా క్రిమినల్ కేసుల్లో న్యాయవా దులకు సమన్లు జారీ చేయకుండా చూసుకోవాలి...సుప్రీం కోర్ట్ ఆదేశాలు...

Image
ఏకపక్షంగా క్రిమినల్ కేసుల్లో న్యాయవాదులకు సమన్లు  జారీ చేయకుండా చూసుకోవాలి సుప్రీం కోర్ట్ ఆదేశాలు VS9TV న్యూస్,హైదరాబాద్ : నిందితులకు న్యాయవాదులు ఇచ్చిన చట్టపరమైన సలహాను పరిగణనలోకి తీసుకోకుండా దర్యాప్తు సంస్థలు ఏకపక్షంగా క్రిమినల్ కేసుల్లో న్యాయవాదులకు సమన్లు జారీ చేయ కుండా చూసుకోవాలని సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీచేసింది.దర్యాప్తు సంస్థలు నిందితులకు ప్రాతినిధ్యం వహిస్తున్న న్యాయవా దులను ఏకపక్షంగా సమన్లు జారీ చేయ డంపై కోర్టు తీసుకున్న సుమోటో కేసులో భారత ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్,జ స్టిస్ కె.వినోద్ చంద్రన్,జస్టిస్ ఎన్.వి.అంజరియాలతో కూడిన ధర్మాసనం ఈ నిర్ణయం తీ సుకుంది.

త్వరలో టాటా టూ వీలర్లు...దేశీయ ఆటో రంగ దిగ్గజం టాటా మోటర్స్‌...

Image
త్వరలో టాటా టూవీలర్లు దేశీయ ఆటో రంగ దిగ్గజం టాటా మోటర్స్‌ VS9TV న్యూస్,హైదరాబాద్ : ద్విచక్ర వాహనాల తయారీలోకి రాబోతున్నదని,సంప్రదాయ బైకులతోపాటు విద్యుత్తు ఆ ధారిత (ఈవీ) టూవీలర్లను మార్కెట్‌కు పరిచయం చేయబోతున్నదన్న వార్తలు బుధవా రం పలు సోషల్‌ మీడియా వేదికల్లో హల్‌చల్‌ చేశాయి.ఇప్పటికే భారీ,మధ్యశ్రేణి,తేలిక పాటి వాణిజ్య వాహనాలు,ప్యాసింజర్‌ కార్ల తయారీలో దూసుకుపోతున్న టాటా మోట ర్స్‌...ఇక టూవీలర్‌ సెగ్మెంట్‌లోకి ప్రవేశించబో తున్నట్లు,ఈ క్రమంలోనే ముందుగా 110 సీసీ,125సీసీ బైకులను అందుబా టులోకి తేనుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. 110సీసీ బైక్‌ ధర రూ.45,999గా,125సీసీ బైక్‌ ధర రూ.55,999గా ఉండొచ్చన్న అం చనాలూ వినిపిస్తుండటం గమనార్హం.ఇవి లీటర్‌ పెట్రోల్‌కు 90కిలోమీటర్ల మైలేజీ ఇస్తా యనీ అంటున్నారు.అలాగే సింగిల్‌ చార్జింగ్‌పై 280 కిలోమీటర్లు ప్రయాణించే లా టాటా బ్రాండ్‌ ఎలక్ట్రిక్‌ టూవీలర్లూ వస్తాయని చెప్తుండటం విశేషం.అయితే వీటి ధర కేవలం రూ. 85,000గానే ఉండొచ్చని ఆయా వెబ్‌సైట్లు పేర్కొంటున్నాయి.కాగా హీరో మోటో కార్ప్‌, హోండా మోటర్‌సైకిల్‌,బజాజ్‌, టీవీఎస్‌లకు పోటీగా వచ్చే ఏడాది ఇవి దేశీయ మార్...

తెలంగాణ మంత్రిగా మహమ్మద్ అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం...

Image
తెలంగాణ మంత్రిగా మహమ్మద్ అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం VS9TV న్యూస్, హైదరాబాద్ : మాజీ క్రికెటర్, సీనియర్ కాంగ్రెస్ నేత మహమ్మద్ అజారుద్దీన్ శుక్రవారం తెలంగాణ మం త్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.12:15 గంటలకు ఆయనతో రాజభవన్లో తెలంగాణ గవర్నర్ జిస్ట్ దేవ్ వర్మ ప్రమాణం చేయించారు. కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితోపాటు ఇతర మంత్రులు హాజరయ్యారు.అయితే అజారుద్దీన్‌కు మంత్రి పదవి కేటా యించడంపై విపక్షాలు తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం చేశాయి.ఇది ఎన్నికల కోడ్ ని బంధన ఉల్లంఘన కిందకే వస్తుందని తెలిపారు.ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చే శారు.దీనికి సంబంధించి అధికారులు గురువారంనాడే అన్ని ఏర్పాట్లు చేశారు.రాజ్ భవ న్ దర్బార్ హాల్‌ను ప్రోటోకాల్ అధికారులు పరిశీలించారు.మంత్రి ప్రమాణ స్వీకారానికి సీటింగ్,తదితర అంశాలపై అధికారులు ఏర్పాట్లు చేశారు.

ఖమ్మం జిల్లాలో సిపిఎం నేత దారుణ హత్య...

Image
ఖమ్మం జిల్లాలో సిపిఎం నేత దారుణ హత్య VS9TV న్యూస్, ఖమ్మం జిల్లా : ఖమ్మం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది.మధిర శాసనసభ నియోజకవర్గం చిం తకాని మండలం పాతర్లపాడు గ్రామంలో శుక్రవారం ఉదయం సిపిఎం సీనియర్ నేత సా మినేని రామారావును అత్యంత పాశవికంగా గుర్తుతెలియని దుండగులు హత్య చేశారు. వివరాల్లోకి వెళ్తే...సామినేని రామారావు రోజూ మాదిరిగానే శుక్రవారం మార్నింగ్ వాక్ కు వెళ్లారు.ఆ సమ యంలో మార్గమధ్యంలో ఆయన్ను అడ్డగించిన దుండగులు,పదునైన ఆయుధంతో గొంతుకోసి హతమార్చారు.రక్తపు మడుగులో పడివున్న ఆయన్ను గమనిం చిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు.పరిసరాలను పరిశీలించి, సాక్ష్యాధారాలను సేకరించే పనిలో పడ్డారు.హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.ఈ హత్య వెనుక రాజకీయ లేదా వ్యక్తిగత కక్షలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో దర్యా ప్తు ప్రారంభించారు.ఈ ఘటనతో పాతర్ల పాడు గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొం ది.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మావోయిస్టుల ఫండింగ్ గుట్టురట్టు...రూ.400 కోట్ల నిధులు,400కిలోల బంగారం...

Image
మావోయిస్టుల ఫండింగ్ గుట్టురట్టు రూ.400 కోట్ల నిధులు,400కిలోల బంగారం ఆపరేషన్ కగార్‌తో లొంగుబాట పడుతున్న మావోయిస్టులు వందల కోట్ల పార్టీ ఫండ్‌ను బంగారంగా మార్చినట్లు అనుమానం డొల్ల కంపెనీలు,బినామీ ఖాతాలతో నిధుల మళ్లింపు లొంగిపోయిన మావోల ద్వారా డబ్బు  ఆచూకీపై నిఘా వర్గాల ఆరా ప్రాణభయంతోనే లొంగుబాటు ఆర్థిక ఇబ్బందులతో కాదంటున్న పోలీసులు VS9TV న్యూస్,హైదరాబాద్ : భద్రతా బలగాలు చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’ దెబ్బకు మావోయిస్టు పార్టీ ఉక్కిరిబిక్కిరి అ వుతోంది.అగ్రనేతల నుంచి సాధారణ దళ సభ్యుల వరకు పెద్ద సంఖ్యలో లొంగుబాట ప డుతుండటంతో వారి భారీ ఆర్థిక సామ్రాజ్యం గుట్టు మెల్లగా వీడుతోంది.మావోయిస్టులు వివిధ మార్గాల్లో వసూలు చేసిన వందల కోట్ల రూపాయల నగదును బంగారంగా మార్చే శారని,భారీగా బంగారు నిల్వలు దాచిపెట్టారని నిఘా వర్గాలు బలంగా అనుమానిస్తు న్నాయి.జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) విచారణలో అనేక విస్తుపోయే విషయాలు వె లుగులోకి వచ్చాయి.ఝార్ఖండ్,ఛత్తీస్‌గఢ్‌,తెలంగాణ,ఏపీ సహా పలు రాష్ట్రాల్లోని కాంట్రాక్ట ర్లు,వ్యాపారుల నుంచి సేకరించిన నిధులను మావోయిస్టులు రెండు మార్గాల్లో మళ్లిస్తున్న ట్లు అధికారులు...

20క్వింటాళ్ళు పిడిఎస్ బియ్యం పట్టివేత...

Image
20క్వింటాళ్ళు పిడిఎస్ బియ్యం పట్టివేత VS9TV న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,కరకగూడెం,మండలంలో అక్రమంగా 20క్వింటాళ్ళు రేషన్ బి య్యాన్ని రవాణా చేస్తుండగా సివిల్ సప్లై అధికారి శివకుమార్,ఎస్సై నాగేశ్వరరావు పట్టు కున్నారు.ఈ సందర్భంగా సివిల్ సప్లై అధికారి మాట్లాడుతూ...కరకగూడెం మండలం లో ని చిరుమల గ్రామంలో 20కింటల రేషన్ బియ్యం పౌల్ట్రీ ఫారానికి రవాణా చేస్తున్నారని సమాచారం తెలవడంతో ఆ ప్రాంతానికి చేరుకొని ట్రాక్టర్లు ఉన్న రేషన్ బియ్యాన్ని సీజ్ చేశామని అన్నారు.రవాణా చేస్తున్న వారిపై కూడా కేసు నమోదు చేశామని తెలిపారు.

తుఫాన్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్...

Image
తుఫాన్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో  సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ VS9TV న్యూస్, హైదరాబాద్ : తెలంగాణలో ధాన్యం సేకరణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు.ప్రతి ఒక్కరూ ఫీల్డ్ లో ఉండవలసిందే రిపోర్టు ఇవ్వకుండా ని ర్లక్ష్యం వహిస్తే అధికారులపై తక్షణం చర్యలు తీసుకోవాలి అంటూ ఆదేశాలు జారీ చేశా రు.మొంథా తుఫాన్‌ నేపథ్యంలో సీఎం రేవంత్‌ రెడ్డి గురువుగారు ఆయా జిల్లాల కలెక్టర్ల తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 16జిల్లాలపై తుఫాను ప్రభావం ఉంటుందని వా తావరణ శాఖ హెచ్చరించింది.ఈ క్రమంలో ముందస్తు చర్యలు తీసుకున్నప్పటికీ ఇది వరి కోతల కాలం...అనుకోని ఉపద్రవం రైతులకు ఆవేదన మిగులుస్తోందన్నారు.అధికారులు అ ప్రమత్తంగా ఉండాలని సూచించారు.అందరి సెలవులు రద్దు చేసి క్షేత్రస్థాయిలో పర్య టించేలా చూడాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు.ఈదురు గాలులతో విద్యుత్ అంతరా యం కలగగుండా విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రో డ్లపై బ్రిడ్జిలు,లో లెవల్ కాజ్ వేల వద్ద, దెబ్బతిన్న రోడ్ల వద్ద ట్రాఫిక్ ను డైవర్ట్ చేయాలన్నా రు.ప్రజలు అవసరమైతే తప్ప రోడ్లపైకి రాక...

హరీశ్ రావును పరామర్శించిన కవిత...

Image
హరీశ్ రావును పరామర్శించిన కవిత VS9TV న్యూస్,హైదరాబాద్ : బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ మృతి నేప థ్యంలో పలువురు నేతలు కుటుంబ సభ్యులను పరామర్శించడానికి ప్రముఖులు హాజర య్యారు. ఈ క్రమంలో తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు,ఎమ్మెల్సీ కవిత తన భర్త అని ల్‌తో కలిసి హరీశ్‌రావు నివాసానికి వెళ్లారు.వారు ముందుగా సత్యనారాయణ చిత్రప టానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం హరీశ్‌రావు కుటుంబ సభ్యు లను ఓదార్చారు.కుటుంబ బాధలో భాగస్వామ్యం అవుతూ,ధైర్యంగా ఉండాలని కవిత అ భ్యర్థించినట్లు సమాచారం.ఈ సందర్శన పూర్తిగా వ్యక్తిగతంగా జరిగినప్పటికీ,రాజకీ య వర్గాల్లో ఇది పెద్ద చర్చకు దారి తీసింది.గత కొంతకాలంగా హరీశ్‌రావు,కవిత మధ్య రాజకీయ విభేదాలు స్పష్టంగా కనబడుతున్నాయి.ముఖ్యంగా కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అక్రమాల విషయంలో కవిత హరీశ్‌రావుపై తీవ్రవ్యాఖ్యలు చేసిన సంగతి తెలి సిందే.ఆ సమయంలో ఇరువురి మధ్య మాటల యుద్ధం చెలరేగి,బీఆర్‌ఎస్‌ అంతర్గతం గా కూడా కలకలం రేపింది.ఈ నేపథ్యంలో కవిత తాజా పరామర్శ రాజకీయ వర్గాల్లో మళ్లీ కొత్త ఊహాగానాలకు తావిచ్చింది.పార్టీ లోపల ఉన్న వ...

ఏపీ రైతులను నిండా ముంచిన మొంథా తుఫాన్...రూ.5,265కోట్లు నష్టం... చంద్రబాబు,రాష్ట్ర ముఖ్యమంత్రి...

Image
ఏపీ రైతులను నిండా ముంచిన మొంథా తుఫాన్ రూ.5, 265కోట్లు నష్టం చంద్రబాబు,రాష్ట్ర ముఖ్యమంత్రి VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి : మొంథా తుపాను ఏపీలో విధ్వంసం సృష్టించింది.భారీగానే నష్టం మిగిల్చింది.మొంథా తు ఫా ను మిగిల్చిన నష్టంపై ఏపీ సర్కార్ ప్రాథమిక అంచనా వేసింది.ప్రాథమిక నష్టం అంచ నా దాదాపు రూ.5, 265 కోట్లుగా తేల్చామని సీఎం చంద్రబాబు తెలిపారు.ఆర్ అండ్ బీకి రూ.2,079 కోట్ల నష్టం జరిగిందన్నారు. ఆక్వా రంగంలో రూ.1,270కోట్ల నష్టం వాటి ల్లిందన్నారు.ఇక వ్యవసాయ రంగంలో రూ.829కోట్లు,మున్సిపల్ శాఖలో 109 కోట్లు, సెరికల్చర్ రంగంలో రూ.65 కోట్ల నష్టం జరిగిందన్నారు.హార్టికల్చర్ రంగంలో రూ.39 కో ట్ల నష్టం జరగ్గా...పశుసంవర్ధక శాఖలో రూ.71 లక్షల నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచ నా వేసింది ప్రభుత్వం.తుపాను వల్ల 120పశువులు చనిపోయాయి.కాగా,తుపాను వల్ల మనుషులు ఎవరూ చనిపోలేదని వెల్లడించారు.టెక్నాలజీ సాయంతో తుపాను నష్టాన్ని తగ్గించామని సీఎం చంద్రబాబు చెప్పారు. శాటిలైట్ ఇమేజ్ ల ద్వారా తుపాను పరిస్థితి ని అంచనా వేశామన్నారు. మొంథా తుఫాన్ బీభత్సాన్ని ముందుగానే అంచనా వేసి నష్ట నివారణ చేయగలిగామన్నారు.రాష్ట్ర స్థాయి...

అర్థరాత్రి యువకుడిపై కత్తులతో దాడి.. హత్య...

Image
అర్థరాత్రి యువకుడిపై కత్తులతో దాడి.. హత్య VS9TV న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్ ఘౌస్‌నగర్‌లో బుధవారం అర్ధరాత్రి HKGN పాన్‌షాప్ యజమాని మొహ్సి న్ (35) ను గుర్తు తెలియని నలుగురు దుండగులు కత్తులతో దాడి చేసి హత్య చేశారు. సమాచారం అందుకున్న బండ్లగూడ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రా రంభించారు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.వ్యక్తిగత విభే దాలు,వ్యాపార వివాదం లేదా పాత కక్షల నేపథ్యంలో ఈ హత్య జరిగి ఉండవచ్చని పోలీ సులు భావిస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో నవ వధువు మృతి...

Image
రోడ్డు ప్రమాదంలో నవ వధువు మృతి VS9TV న్యూస్,నల్గొండ : తెలంగాణ,నల్గొండ జిల్లా,చాంలేడు గ్రామానికి చెందిన చిలువేరు నవీన్,దామెర గ్రామాని కి చెందిన అనూష (22) ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.వివాహం జరిగిన 14రోజులకే బు ధవారం సాయంత్రం ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా గుర్రంపోడు సమీపంలో మరో వా హనాన్ని ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది.ఈ ఘటనలో అనూష వంతెనపై నుంచి వా గులో పడి మృతి చెందగా,నవీన్ తలకు తీవ్రగాయాలై అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు.ఈ ఘటనతో గ్రామంలో విషాదాఛాయలు అలుముకున్నాయి.

పోలీసు క్రీడాకారిణిని అభినందించిన... కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్...

Image
పోలీసు క్రీడాకారిణిని అభినందించిన కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ VS9TV న్యూస్,కర్నూలు క్రైం : జాతీయ పోలీసు జూడో క్లస్టర్ ఆటల పోటీల్లో వెండి,కాంస్యం పథకాలు సాధించిన క ర్నూలు ఆర్ముడు రిజర్వుడు ఆర్ ఎస్సై పి.కల్పనను బుధవారం జిల్లా పోలీసు కార్యాల యంలో జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ అభినందించారు.2025 అక్టోబర్,8వ తేదీ నుండి అక్టోబర్,16 వరకు జమ్మూ & కాశ్మీర్ రాష్ట్రంలో జరిగిన 10వ జాతీయ పోలీసు జూడో క్లస్టర్ ఆటల పోటీల్లో ఆంద్రప్రదేశ్ తరపున కర్నూలు జిల్లా పోలీసుశాఖ నుండి ఆర్ ఎస్సై కల్పన పాల్గొన్నారు.పెన్కాక్ సిలాట్ లో ఒక వెండి పతకం,కరాటేలో కాంస్య పతకం ఆర్ ఎస్సై కల్పన సాధించారు. భవిష్యత్తులో మరిన్ని పథకాలు సాధించాలని,జిల్లా పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆకాంక్షించారు.ఈ కా ర్యక్రమంలో ఆర్ ఐ జావేద్ ఉన్నారు.

ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడం సిగ్గుచేటు...SFI...

Image
ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడం సిగ్గుచేటు ఆదోని ప్రభుత్వ మెడికల్ కళాశాలను  ప్రభుత్వ ఆధీనంలోనే నిర్మించాలి VS9TV న్యూస్,కర్నూలు ఎడ్యుకేషన్ : ప్రభుత్వ వైద్య విద్య చదవాలనుకునే విద్యార్ధుల ఆశలను కూటమి ప్రభుత్వం చిద్రం చేస్తుం దని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసన్నకుమార్ విమర్శించారు.బుధవారం కర్నూ లు నగరంలో సుందరయ్య భవన్ లో ఏర్పాటుచేసిన ముఖ్య నాయకులు సమావేశంలో వారు మాట్లాడుతూ ఆదోని ప్రభుత్వ మెడికల్ కళాశాలకు ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గ మని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా భవిష్యత్తులో అందరూ కలిసికట్టు గా పోరాటం చేస్తామని చెప్పారు.ప్రభుత్వం గ్రామీణులకు మెరుగైన వైద్య సేవలను అం దించాలన్న ఉద్దేశంతో ఆదోని ప్రభుత్వ వైద్య కళాశాలలను ఏర్పాటు చేసిందన్నారు.కూ టమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కళాశాల పనులను నిలిపివేసి పీపీపీ(పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ ) పద్ధతిలో కొనసాగించడానికి క్యాబినెట్ తీర్మానం చేయడం అన్యాయం అ న్నారు.ప్రైవేటీకరణతో పేదలకు వైద్యం అందే పరిస్థితి ఉండదని ప్రభుత్వమే వైద్య కళాశా లను నడపాలని డిమాండ్ చేశారు.పీపీపీ విదానాన్ని రద్దు చేయాలని...

స్టేడియం రోడ్డులో ఈట్ స్ట్రీట్ ఏర్పాటుకు లక్కీ డ్రా...39 స్టాల్స్ వ్యాపారులకు కేటాయింపు...

Image
స్టేడియం రోడ్డులో ఈట్ స్ట్రీట్ ఏర్పాటుకు లక్కీ డ్రా 39 స్టాల్స్ వ్యాపారులకు కేటాయింపు 60 స్టాల్స్ ఏర్పాటుకు ప్రణాళిక 700 అడుగుల వెడల్పు రహదారిపై నిర్వహణ  VS9TV న్యూస్,కర్నూలు కార్పోరేషన్ : కర్నూలు నగరంలోని స్టేడియం రోడ్డులో ప్రజల సౌకర్యార్థం ఈట్ స్ట్రీట్ ఏర్పాటు చేయను న్నట్లు నగరపాలక కమిషనర్ పి.విశ్వనాథ్ తెలిపారు.దీనికి సంబంధించి స్థానిక ఎస్బిఐ ఎంప్లాయిస్ కాలనీలోని నగరపాలక సంస్థ సమావేశ భవనంలో బుధవారం లక్కి డ్రా ని ర్వహించారు.60షాపుల నిర్వహణకు ప్రణాళికలో రూపొందించారు.అందులో 39షా పులను లక్కీ డ్రా ద్వారా కేటాయించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ...నగర అభివృద్ధిలో భాగంగా ప్రజల విహారానికి,చిన్న వ్యాపారులకు ఉపాధి అవకాశాల కల్పనకు ఈట్ స్ట్రీట్ కీలకంగా నిలుస్తుందని చెప్పారు.700అడుగుల వెడల్పు రహదారిపై ఈట్ స్ట్రీ ట్‌ను ఏర్పాటు చేస్తూ,ఒక్కో స్టాల్‌ను 120 అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటుచేయనున్నట్లు వి వరించారు.వ్యాపారులకు పారదర్శకంగా షాపులు కేటాయించేందుకు ఈ విధానాన్ని అ నుసరించినట్లు తెలిపారు.ఈట్ స్ట్రీట్ పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందితే నగర సౌందర్యం మరింత పెరుగుతుందని,పౌరులు మరియు పర...

కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ప్రభు త్వం సుముఖం...నగరపాలక అధికారుల సమీక్షలో మంత్రి టీజీ భరత్...

Image
నగరాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుదాం కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ప్రభుత్వం సుముఖం  బి,సి క్యాంపుల్లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసేలా సిఎంతో చర్చలు  స్మార్ట్ సిటీ పనులకు సైతం వినియోగం మెడికల్ కాలేజీ షాపులపై కోర్టు తీర్పు అమలు నగరపాలక అధికారుల సమీక్షలో మంత్రి టీజీ భరత్ VS9TV న్యూస్,కర్నూలు కార్పోరేషన్ : కర్నూలు నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తూ,అగ్రగామిగా నిలుపుతామని రాష్ట్ర పరిశ్ర మలు,వాణిజ్యం,ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు.బుధవారం స్థానిక ఎ స్బిఐ ఎంప్లాయిస్ కాలనీలోని నగరపాలక సంస్థ సమావేశ భవనంలో కమిషనర్ పి.విశ్వ నాథ్‌తో కలిసి అన్ని విభాగాల అధికారులు,అమినిటీస్ కార్యదర్శులు,కాంట్రాక్టర్లతో సమా వేశం నిర్వహించారు.ముందుగా నగరంలో రూ.12.62కోట్లతో జరుగుతున్న 62 అభి వృద్ధి పనులపై కాంట్రాక్టర్ల వారీగా సమీక్ష నిర్వహించారు.జాప్యం జరుగుతున్న పనులపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు.ఆలస్యం చేసే కాంట్రాక్టర్లపై చట్టపరమైన చర్యలు తీసు కోవాలని ఆదేశించారు.ఈ సందర్భంగా మంత్రి భరత్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క ర్నూలుపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ, ప్రగతిలో ముఖ్య...

బాబా వేషంలో సర్కారీ టీచర్... భయాందోళనలో విద్యార్థులు...

Image
బాబా వేషంలో సర్కారీ టీచర్ భయాందోళనలో  విద్యార్థులు  VS9TV న్యూస్, మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా,కురవి మండలం,రాజోల్ గ్రామ ప్రభుత్వ హైస్కూల్‌లో విధులు ని ర్వహిస్తున్న ఒక ఉపాధ్యాయుడు తన విధుల్లో ఉండే సమయంలో బాబా మాదిరిగా చం డి మాలలు,విభూతి,కమండలం,పొడవు గడ్డం,కాషాయపు వస్త్రాలు ధరించి స్కూల్‌కు రావడం స్థానికుల్లో తీవ్ర చర్చకు దారి తీస్తుంది. ఉపాధ్యాయుడు ప్రతిరోజూ స్కూల్‌కు అదే వేషధారణతో హాజరవుతూ,తరగతుల్లో భయం,అయోమయం కలిగిస్తున్నట్లు విద్యార్థు లు,తల్లి తండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.కొందరు పిల్లలు భయంతో పాఠశాలకు రాకుండా పోతున్నారంటూ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.వివరాలు ఇలా ఉన్నాయి... ఉ పాధ్యాయుడు కురవి మండలం, గుండ్రాతి మడుగు స్టేషన్ గ్రామానికి చెందినవారు.అక్క డ ఆయన స్వయంగా “కామాఖ్య దేవి శక్తి పీఠం” పేరుతో దేవాలయం నిర్మించి,“దే శంలో రెండవ కామాఖ్య శక్తి పీఠం” అంటూ ప్రచారం చేసుకుంటున్నాడు. తనను “శ్రీశ్రీ సిద్ధయోగి శివశక్తీ ప్రతాప్‌నాథ్ స్వామీజీ” అని పిలిపించుకుంటూ,మొబైల్ నంబర్‌తో క లిపి రాజకీయ విజయం,ఆరోగ్యం,వివాహం,సంతానం వంటి సమస్యలకు పరిష్కారమని ప్రచారం చేస్తున్నట...

మోంధా తుఫాను నేపథ్యంలో విద్యుత్ శాఖ అప్రమత్తం...జిల్లా స్థాయిలో,డివిజన్ల స్థాయిలో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు...

Image
మోంధా తుఫాను నేపథ్యంలో విద్యుత్ శాఖ అప్రమత్తం జిల్లా స్థాయిలో,డివిజన్ల స్థాయిలో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు VS9TV న్యూస్,కర్నూలు కలెక్టరేట్ : మోంధా తుఫాను నేపథ్యంలో విద్యుత్ అధికారులు అప్రమత్తంగా వుండాలని కర్నూలు జి ల్లా సూపరింటెండింగ్ ఇంజనీర్ ఆర్ ప్రదీప్ కుమార్ ప్రకటనలో తెలిపారు.అలాగే చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎపిఎస్పిడిసిఎల్ తిరుపతి వారి ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా పరిధి లోని కర్నూలు టౌస్,ఆదోని మరియు ఎమ్మిగనూరు డివిజన్ ల పరిధిలో తుఫాను కారణం గా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిన సందర్భాల్లో విద్యుత్ పునరుద్ధరణ పనుల ప ర్యవేక్షణకు డివిజన్స్ స్థాయిల్లో కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.తుఫా ను ప్రభావిత ప్రాంతాల్లో సరఫరా పునరుద్ధరణ పనులను వేగవంతం చేయడం కోసం అధికారులు / సిబ్బందితో కూడిన ప్రత్యేక బృందాలు అందుబాటులో వుండాలన్నారు.వ ర్షం కురుస్తున్న సందర్భాల్లో జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేయడం ఏమనగా వర్షాల వలన కలిగే విద్యుత్ ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండుటకు క్రింది సూచనలను పాటించాలని జిల్లా విద్యుత్ శాఖ అధి కారి ఆర్.ప్రదీప్ కుమార్ విజ్ఞప్తి చేశారు. భద్రత నియమాలు : 1.వర్షాలు,గాలులు ఎక్క...

పోలీసు అమరవీరుల వారోత్సవాలు...పోలీసు సిబ్బంది సంక్షేమమే ముఖ్యం...విక్రాంత్ పాటిల్,కర్నూలు జిల్లా ఎస్పీ...

Image
పోలీసు అమరవీరుల వారోత్సవాలు పోలీసు సిబ్బంది సంక్షేమమే ముఖ్యం విక్రాంత్ పాటిల్,కర్నూలు జిల్లా ఎస్పీ VS9TV న్యూస్,కర్నూలు క్రైం : కర్నూలు జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ లో ఉచిత మెగా వైద్య శిబిరం,రక్తదాన శిబిరంను కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మంగళవారం ప్రారంభించారు.ఈ సందర్బంగా జి ల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ అమరవీరుల త్యాగాలను,సేవలను ప్రజలకు,స మాజానికి తెలియజేయాలని అన్నారు.పోలీసు సిబ్బంది సంక్షేమమే ముఖ్యమని,ప్రతి ఒ క్క పోలీసు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.కర్నూలు కొత్తబస్తాండు దగ్గర ఉన్న జెమ్ కేర్ కామినేని హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంపు, కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించినట్లు పేర్కొ న్నారు.ఈ శిబిరంలో 182మంది పోలీసు సిబ్బంది,పోలీసు కుటుంబాల వారు వైద్య పరీ క్షలు చేయించుకున్నారు.వారికి డాక్టర్లు తగిన సూచనలు,సలహాలు తెలియజేశారు.ఆ రోగ్య సమస్యలుంటే ప్రాథమిక దశలోనే గుర్తించి వైద్య పరీక్షలు చేయించుకుని జాగ్రత్త లు తీసుకోవాలన్నారు.పోలీసు అధికారులు,సిబ్బంది ఆరోగ్యంగా ఉంటే వారు తమ విధు లను బాగా నిర్వహించవచ...

శక్తులు కలిగిన కలశం...ఘరానా మోసం...బాధితుడికి రూ.15లక్షలు టోకరా...

Image
శక్తులు కలిగిన కలశం...ఘరానా మోసం బాధితుడికి రూ.15లక్షలు టోకరా పెట్టబోయిన కేటుగాళ్ళు పోలీసుల రాకతో సీన్ రివర్స్ కటకటాల్లోకి నిందితులు VS9TV న్యూస్,పల్నాడు : పల్నాడు జిల్లా,దుర్గి పోలీస్ స్టేషన్ పరిధిలో శక్తిలు కలిగిన కలశం ఉంది...ఆ శక్తితో కో ట్లకి కోట్లు డబ్బులు వస్తాయని నమ్మ బలికి బెల్లంకొండ మండలానికి చెందిన 9మంది కే టుగాళ్ళు గ్రూప్ గా ఏర్పడి.... సాడి వెంకటరెడ్డి అనే అతనికి రూ.15లక్షలకు విక్రయించారు.తరువాత శక్తిలు లేవని గ్ర హించి డబ్బులు అడిగే క్రమంలో అతని మీద దాడికి పాల్పడ్డారు ఈ ముఠా.బాధితుడు స దరు పోలీసు వారిని ఆశ్రయించగా...పోలీసులు విచారించి వారి మీద కేసు నమోదు చే సి కోర్టు రిమాండ్ కి తరలించారు.టెక్నాలజీ పెరుగుతున్న రోజుల్లో ఇలాంటి బూటకపు వదంతులు,మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దు అని పోలీసులు హెచ్చరించారు.

క్రిప్టో కరెన్సీకి మోసానికి ప్రభుత్వ డాక్టర్ శ్రీనివాస్ ఆత్మహత్య...

Image
క్రిప్టో కరెన్సీకి మోసానికి ప్రభుత్వ డాక్టర్ శ్రీనివాస్ ఆత్మహత్య స్నేహితులను నమ్మి ఫండ్ లో పెట్టుబడి పెట్టి  మోసపోయినట్లు భార్య ఆవేదన  VS9TV న్యూస్,కరీంనగర్ : కరీంనగర్ నగారంలో క్రిప్టో కరెన్సీ మోసానికి ప్రభుత్వ వైద్యులు బలయ్యారు.ప్రతిమ ఆసు పత్రిలో అనస్తీషియా (మత్తు ) వైద్యుడిగా పనిచేస్తున్న డాక్టర్ ఎంపటి శ్రీనివాస్ మత్తు ఇం జక్షన్ తీసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన జరిగింది...వివరాలు ఇలా ఉన్నాయి... మంకమ్మతోటకు చెందిన శ్రీనివాస్ గతంలో చొప్పదండి మెడికల్ ఆఫీసర్ గా పని చేశాడు.శ్రీనివాస్ భార్య విప్లవశ్రీ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యురాలుగా విధులు నిర్వహిస్తు న్నారు.తరచూ బ్యాంక్ అధికారులు ఇంటికి రావడంతో తట్టుకోలేక ఆత్మహత్య చేసుకు న్నాడని భార్య విప్లవశ్రీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.స్నేహితులతో కలిసి మెటా ఫండ్ లో డబ్బులు పెట్టాడని,కరుణాకర్,కిరణ్, గణేష్ అనే స్నేహితులకు కోట్లలో డబ్బులు ఇచ్చా డని భార్య ఆరోపించారు.తీసు కున్న రుణం చెల్లించకపోవడంతో బ్యాంక్ ఉద్యోగుల వే ధింపులు,స్నేహితులు డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు బందు వులు తెలిపారు.పలురకాల బిజినెస్ లలో గణేష్,కి...

అమెరికా విమానంలో భారత విద్యార్థి వీరంగం...ఇద్దరు టీనేజర్లపై మెటల్ ఫోర్క్‌తో దాడి...

Image
అమెరికా విమానంలో భారత విద్యార్థి వీరంగం ఇద్దరు టీనేజర్లపై మెటల్ ఫోర్క్‌తో దాడి VS9TV న్యూస్,హైదరాబాద్ : అమెరికాలో ఓ భారతీయ విద్యార్థి విమానంలో వీరంగం సృష్టించాడు.వీసా స్టేటస్ కోల్పో యాడన్న కారణంతో విచక్షణారహితంగా ప్రవర్తిస్తూ తోటి ప్రయాణికులపై దాడికి పాల్ప డ్డాడు.చికాగో నుంచి జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌కు వెళ్తున్న విమానంలో ఈ ఘటన చోటుచే సుకుంది.దీంతో విమానాన్ని అత్యవసరంగా బోస్టన్‌కు మళ్లించి,నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే...ప్రణీత్ కుమార్ ఉసిరిపల్లి (28) అనే భారత విద్యార్థి విమానంలో భోజనం సరఫరా చేసిన తర్వాత ఒక్కసారిగా హింసాత్మకంగా ప్రవర్తిం చా డు.తన చేతిలో ఉన్న మెటల్ ఫోర్క్‌తో 17ఏళ్ల బాలుడి భుజంపై,మరో 17ఏళ్ల బాలుడి తల వెనుక భాగంలో పొడిచాడు.అంతేకాకుండా ఓ మహిళను చెంపదెబ్బ కొట్టి,విమాన సిబ్బందిపై కూడా దాడికి యత్నించినట్లు బోస్టన్‌లోని ఫెడరల్ ప్రాసిక్యూటర్ లియా ఫోలీ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.విమాన సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకునేం దుకు ప్రయత్నించగా,ప్రణీత్ తన వేళ్లతో తుపాకీ ఆకారాన్ని చేసి,దాన్ని నోట్లో పెట్టుకుని కాల్చుకున్నట్లుగా అభినయించాడని ప్ర...

మొంథా ఎఫెక్ట్...సముద్రంలో చిక్కుకున్న 600మందిని కాపాడిన అధికారులు...

Image
మొంథా ఎఫెక్ట్... సముద్రంలో చిక్కుకున్న 600మందిని కాపాడిన అధికారులు VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి : ‘మొంథా’ తుపాను ప్రభావంతో ఒడిశా తీరంలో సముద్రంలో చిక్కుకుపోయిన ఆంధ్రప్ర దేశ్‌కు చెందిన సుమారు 600మంది మత్స్యకారులను స్థానిక అధికారులు సురక్షితంగా కాపాడారు.భారీ వర్షాల కారణంగా ముందుకు కదల లేకపోయిన 60ట్రాలర్లను ఒడిశా యం త్రాంగం గోపాల్‌పుర్‌ ఓడరేవుకు తరలించింది.వివరాల్లోకి వెళితే...మొంథా తుపా ను కారణంగా ఒడిశాలోని గంజాం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.ఈ నే పథ్యంలో చేపల వేటకు వెళ్లిన ఏపీకి చెందిన మత్స్యకారులు ఛత్రపురం సమీపంలోని అ ర్జిపల్లి వద్ద సముద్రంలో చిక్కుకుపోయారు.విషయం తెలుసుకున్న జిల్లా యంత్రాంగం వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టింది.మొత్తం 60ట్రాలర్లను గోపాల్‌పుర్‌ ఓడరేవులో లంగర్లు వేసేందుకు ఏర్పాట్లు చేసింది.ఈ వివరాలను మత్స్యశాఖ ఉపసం చాలకులు సంగ్రామ్ కర్‌ విలేకరులకు వెల్లడించారు.మొత్తం 600మందినీ సురక్షితంగా ఒ డ్డుకు చేర్చామని,వారికి అవసరమైన ఆహారం,తాగునీరు,ఔషధాలు అందించామని ఆయ న తెలిపారు.తుపాను ప్రభావం పూర్తిగా తగ్గే వరకు మత్స్యకారులకు అన్ని విధాలా అండ ...

ఇద్దరి అంగీకారంతో జరిగిన లైంగిక క్రియ నేరం కాదు...కర్ణాటక హైకోర్టు...

Image
ఇద్దరి అంగీకారంతో జరిగిన లైంగిక క్రియ నేరం కాదు కర్ణాటక హైకోర్టు VA9TV న్యూస్,కర్ణాటక : కర్ణాటక హైకోర్టు తాజాగా ఓ సంచలన తీర్పు ఇచ్చింది.పరస్పర సమ్మతితో జరిగే లైంగిక క్రియ నేరం కాదని కర్ణాటక హైకోర్టు వ్యాఖ్యానించింది.డేటింగ్ యాప్ లో పరిచయమైన యువకుడు తనను ఓయో రూమ్ కు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడని ఒక మహిళ ఇటీవల ఫిర్యాదు చేసింది.ఈ ఫిర్యా దుపై విచారణ జరిపిన న్యాయమూర్తి,ఇద్దరి అంగీ కారంతో జరిగిన లైంగికక్రియ నేరం కాదని స్పష్టం చేస్తూ నిందితుడిపై దాఖలైన ఎఫ్ ఐ ఆర్ రద్దు చేయాలని ఆదేశించింది.

కోడి పుంజుకు నాలుగు కాళ్లు...

Image
కోడి పుంజుకు నాలుగు కాళ్లు VS9TV న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం : తెలంగాణ,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం,నారంవారి గూడెం గ్రా మంలో ప్రసాద్ అనే వ్యక్తి పెంచుతున్న నాలుగు కాళ్లతో ఉన్న కోడి పుంజును చూసేందు కు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి జనం భారీగా తరలివస్తున్నారు.ఈ పుంజువింత ఆకృ తిని చూసి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు.సంక్రాంతి పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో పందెం రాయుళ్లు ఈ పుంజును చూసి దాని సామర్థ్యంపై చర్చించుకుంటున్నారు.కొంద రు దీనిని బ్రహ్మంగారి జోస్యంతో పోలుస్తుండగా,మరికొందరు దీనిని వింతగా అభివర్ణి స్తున్నారు.

మొంథా తుపాను అలజడి...కాకినాడ పోర్టులో 10వ నెంబరు ప్రమాద హెచ్చరిక జారీ...

Image
మొంథా తుపాను అలజడి కాకినాడ పోర్టులో 10వ నెంబరు ప్రమాద హెచ్చరిక జారీ ఏపీ తీరం వైపు వేగంగా దూసుకొస్తున్న మోంత తుఫాను నాలుగు రాష్ట్రాల్లో 25 ఎన్డీఆర్ఎఫ్ బృందాల మోహరింపు ప్రజలకు సహాయం చేయాలని పార్టీ శ్రేణులకు  సీఎం చంద్రబాబు పిలుపు కాకినాడకు 270 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన తుఫాను తమిళనాడులోనూ అప్రమత్తత,చెన్నైలో డిప్యూటీ సీఎం సమీక్ష VS9TV న్యూస్,కాకినాడ : బంగాళాఖాతంలో ఏర్పడిన 'మొంథా' తుపాను ఆంధ్రప్రదేశ్ తీరానికి మరింత చేరు వైం ది.ఈ నేపథ్యంలో కాకినాడ పోర్టులో అత్యంత తీవ్రమైన హెచ్చరిక అయిన 10వ నంబర్ ప్రమాద సిగ్నల్‌ను అధికారులు జారీ చేశారు.తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చ ర్యల కోసం జాతీయ విపత్తు స్పందన దళం (NDRF) పూర్తిస్థాయిలో సన్నద్ధమైంది. మొత్తం 25బృందాలను ఏపీ,తెలంగాణ,ఒడిశా,తమిళనాడు రాష్ట్రాలకు తరలించారు.ఎ న్డీఆర్ఎఫ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ నరేందర్ సింగ్ బుందేలా నేడు మీడియాతో మాట్లాడుతూ తుపానును ఎదుర్కొనేందుకు తమ దళాలు సిద్ధంగా ఉన్నాయని స్పష్టం చేశారు.కొన్ని రో జుల క్రితమే కేబినెట్ సెక్రటరీ స్వయంగా సమీక్ష సమావేశం నిర్వహించి,నష్టాన్ని తగ్గిం చేందుకు తీసుకోవాల్సిన చర్యల...

మద్యం సేవించి వాహనాలు నడిపిన 17 మందికి ఒక్కొక్కరికి రూ.10,000 జరిమానా...కె.లక్ష్మీనారాయణ,చిత్తూరు ట్రాఫిక్ సిఐ...

Image
మద్యం సేవించి వాహనాలు నడిపిన 17 మందికి ఒక్కొక్కరికి రూ.10,000 జరిమానా కె.లక్ష్మీనారాయణ,చిత్తూరు ట్రాఫిక్ సిఐ  VS9TV న్యూస్,చిత్తూరు క్రైం : చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు,చిత్తూరు సబ్ డివిజన్ పోలీస్ ఆఫీస ర్ టి.సాయినాథ్ ఆధ్వర్యంలో చిత్తూరు ట్రాఫిక్ సిఐ కె.లక్ష్మీనారాయణ నిర్వహించిన వా హన తనిఖీల సందర్భంగా మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 17మంది వ్యక్తులు పట్టుబడ్డారు.వీరిని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ కోర్టులో ప్రవేశపెట్టగా,గౌరవ న్యాయమూ ర్తి కుమారి ఉమాదేవి గారు ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున, మొత్తం రూ.1,70, 0 00 జరిమానా విధించారు.ఈ సందర్బంగా సిఐ కె.లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రోడ్డు భ ద్రతా నియమాలను పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని,వాటిని తప్పని సరిగా పాటిం చకపోతే భారీ జరిమానాలు తప్పవని,మద్యం సేవించి వాహనం నడపడం అత్యంత ప్ర మాదకరమని,ఇది వాహనదారుల ప్రాణాలకు మాత్రమే కాకుండా ఇతరుల ప్రాణాలకు కూ డా ముప్పు కలిగిస్తుందని హెచ్చరించారు. మద్యం సేవించి వాహనం నడిపినప్పుడు మో టారు వాహనాల చట్టం సెక్షన్ 185 ప్రకారం...మొదటి సారి నేరం చేస్తే రూ.10,000 జరిమానా,లేదా ఆరు నెలల జై...

ప్రభుత్వ పాఠశాల బాలికల బాత్రూంలో సీక్రెట్ కెమెరా...

Image
ప్రభుత్వ పాఠశాల బాలికల బాత్రూంలో సీక్రెట్ కెమెరా VS9TV న్యూస్, కరీంనగర్ : మానవ మృ­గా­ళ్ల దా­రు­ణా­ల­తో బా­లి­క­ల­కు రక్ష­ణే లే­కుం­డా పో­తోం­ది.బడి­కి­పో­తే పి­చ్చి పి చ్చి చే­ష్ట­లు చే­స్తూ ఇబ్బం­ది­ప­ట్టే ఉపా­ధ్యా­యు­లు రూ­పం­లో ఉన్న కా­మాం­ధు­లు కొం­ద­రై­తే. ..అమ్మా­యిల వాష్ రూ­మ్స్‌­లో రహ­స్య కె­మె­రా­లు పె­ట్టి వీ­డి­యో­లు రి­కా­ర్డు చేసి...వి­కృత ఆనం­దం పొం­దే నీచులు మరి­కొం­ద­రు.తా­జా­గా కరీం­న­గ­ర్ జి­ల్లా కు­రి­క్యాల ప్ర­భు­త్వ పా ఠ­శా­ల­లో­ని బా­లి­కల వాష్ రూమ్ లో రహ­స్య కె­మె­రా బయ­ట­ప­డ­డం తీ­వ్ర కల­క­లం రే­పిం ది.అమ్మా­యిల బా­త్రూ­మ్‌­లో అటెం­డ­ర్‌ యా­కూ­బ్‌ సీ­క్రె­ట్ కె­మె­రా­ను పె­ట్టి...వీ­డి­యో­లు రి కా­ర్డు చే­స్తు­న్నా­డు.బా­త్రూ­మ్‌­లో ఓ పరి­క­రం మె­రు­స్తూ ఓ పరి­క­రం బా­లి­కల కం­ట­ ప­డింది. ఏంటా అని చెక్ చే­య­గా...రహ­స్య కె­మె­రా అని గు­ర్తిం­చా­రు.వెం­ట­నే ప్రధానోపాధ్యా యునికి తల్లి­దం­డ్రు­ల­కి ఫి­ర్యా­దు చే­శా­రు.బా­త్రూ­మ్‌ నుం­చి కె­మె­రా తరహా పరి­క­రం స్వా ధీ­నం చే­సు­కు­న్నా­రు పో­లీ­సు­లు.ఆగ్ర­హం­తో తల్లి­దం­డ్రు­లు పా­ఠ­శాల వద్ద­కు చే­రు­కొ­ని...

వాట్సాప్ నుంచి గ్యాస్ బుక్ చేయొచ్చు...

Image
వాట్సాప్ నుంచి గ్యాస్ బుక్ చేయొచ్చు VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి : ఎల్ పిజి సిలిండర్ ను వాట్సాప్లోనూ బుక్ చేసుకోవచ్చు.భారత్ గ్యాస్,ఇండేన్,హెచ్ పి గ్యాస్ కస్టమర్లు తమ రిజిస్టర్డ్ నంబర్ నుంచి కంపెనీ అధికారిక వాట్సాప్ నంబర్కు "Hi" లేదా "REFILL" అని మెసేజ్ చేస్తే చాలు. ఈ 24X7 సేవ ద్వారా తక్షణ బుకింగ్ క న్ఫర్మేషన్,డెలివరీ ట్రాకింగ్,చెల్లింపు సౌకర్యాలు లభిస్తాయి.Bharat-1800 22 434 4,Indane-75888 88824,HP Gas -92222 01122 నంబర్లకు వాట్సాప్ చే యొచ్చు.

హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగి ఆత్మహత్య కలకలం...

Image
హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగి ఆత్మహత్య కలకలం VS9TV న్యూస్,హైదరాబాద్ : హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది.తాను ఉంటున్న నివాసం 14 అంతస్తు బిల్డింగ్ పై నుంచి దూకి ఇంజనీర్ మరణించాడు.ఈ విషాద ఘట న చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.వివరాల ప్రకారం...స్థానికంగా నివాసం ఉంటున్న శ్రీనివాసరావు హుజూర్‌నగర్ వాసి.గత కొన్ని సంవత్సరాలుగా హైద రాబాదులోని స్థిరపడ్డాడు.స్థానికంగా నల్లగండ్లలో ఉన్న రాంకీ గెలాక్సీయా అపార్ట్మెంట్స్ లోని 14అంతస్తులో ఆయన నివాసం ఉంటున్నాడు.కొద్దిరోజులుగా భార్యతో తరచూ శ్రీ నివాస్ రావుకి గొడవలు అవుతున్నాయి.ఈ క్రమంలో ఇరు కుటుంబాల పెద్ద మనుషులు వచ్చి ఇరువురికి నచ్చచెప్పి పంచాయితీ చేసినా ఫలితం లేదు.వీరికి ఇద్దరు పిల్లలు ఉన్న ప్పటికీ నిరంతరం ఆస్తి విషయంలో గొడవలు అవుతూనే ఉండేవి.ఈ నేపథ్యంలో అపా ర్ట్మెంట్ 14ఫ్లోర్ నుండి శ్రీనివాసరావు కిందికి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.తీవ్రగా యాలతో ఘటన స్థలంలోనే శ్రీనివాసరా వు మృతి చెందాడు.

పత్రికా విలేకరిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం...

Image
పత్రికా విలేకరిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం VS9TV న్యూస్,సింగనమల : ప్రజాస్వామ్యంలో నాలుగో స్థంభంగా ఉన్న మీడియాపై దాడులకు పాల్పడ డాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని సింగనమల మండల ఏపీయూడబ్ల్యూజే ప్రింట్,ఎలక్ట్రానిక్ మీడియా జ ర్నలిస్టులు పేర్కొన్నారు.ప్రజా సమస్యల పరిష్కార వేదికలో శింగనమల తహసిల్దార్ శే షారెడ్డిని  కలిసి  వారు  వినతి పత్రం అందజేశారు.అనంతరం వారు మాట్లాడుతూ సమా జంలో జరుగుతున్న పరిణామాలపై వార్తలు రాసే స్వేఛ్చ పత్రికలకు ఉంటుందని,పేపర్లలో తమకు వ్యతిరేక వార్తలు వస్తే,వాటికి ఖండనలు ఇవ్వటం,వివరణలు ఇవ్వటం చేయాలి. కానీ బెదిరింపులకు,భౌతిక దాడులకు దిగడం ప్రజాస్వామ్యంలో సరికాదని,తక్షణమే పత్రి కా విలేఖరిపై బెదిరింపులకి దిగిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాశక్తి రిపోర్టర్ పెద్దన్నపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.ఇలాం టి చర్యలు పత్రికా స్వేచ్ఛను హరించడమే అవుతుంది.పత్రికా విలేకరులు అనేక కోణాల్లో వారికి తెలిసిన విషయాలను వార్తలుగా రాస్తారు.వాటిలో ఎవరికైనా నొప్పించే విషయం వుంటే తగిన రీతిలో ప్రశ్నించాలి,లేదా ఫిర్యాదు చేయాలని అన్న...