ప్రభుత్వ పాఠశాల బాలికల బాత్రూంలో సీక్రెట్ కెమెరా...
ప్రభుత్వ పాఠశాల బాలికల బాత్రూంలో సీక్రెట్ కెమెరా
మానవ మృగాళ్ల దారుణాలతో బాలికలకు రక్షణే లేకుండా పోతోంది.బడికిపోతే పిచ్చి పి చ్చి చేష్టలు చేస్తూ ఇబ్బందిపట్టే ఉపాధ్యాయులు రూపంలో ఉన్న కామాంధులు కొందరైతే. ..అమ్మాయిల వాష్ రూమ్స్లో రహస్య కెమెరాలు పెట్టి వీడియోలు రికార్డు చేసి...వికృత ఆనందం పొందే నీచులు మరికొందరు.తాజాగా కరీంనగర్ జిల్లా కురిక్యాల ప్రభుత్వ పా ఠశాలలోని బాలికల వాష్ రూమ్ లో రహస్య కెమెరా బయటపడడం తీవ్ర కలకలం రేపిం ది.అమ్మాయిల బాత్రూమ్లో అటెండర్ యాకూబ్ సీక్రెట్ కెమెరాను పెట్టి...వీడియోలు రి కార్డు చేస్తున్నాడు.బాత్రూమ్లో ఓ పరికరం మెరుస్తూ ఓ పరికరం బాలికల కంట పడింది. ఏంటా అని చెక్ చేయగా...రహస్య కెమెరా అని గుర్తించారు.వెంటనే ప్రధానోపాధ్యా యునికి తల్లిదండ్రులకి ఫిర్యాదు చేశారు.బాత్రూమ్ నుంచి కెమెరా తరహా పరికరం స్వా ధీనం చేసుకున్నారు పోలీసులు.ఆగ్రహంతో తల్లిదండ్రులు పాఠశాల వద్దకు చేరుకొని నిం దితుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్తత వా తావరణం నెలకొంది.ఈ దారుణానికి ఒడిగట్టింది ఆ పాఠశాలకు చెందిన అటెండర్ యా కూబ్ అని తేలింది.ఇతను సీక్రెట్ కెమెరాను అమర్చి...వీడియోలు రికార్డు చేస్తూ వికృత ఆ నందం పొందుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.అంతే కాకుండా...అటెండర్ యాకూబ్ బాలికల ఫొటోలు తీసి వాటిని అశ్లీల చిత్రాలుగా మార్ఫింగ్ కూడా చేస్తున్నట్లు సమాచారం.బాలికలు,వారి తల్లిదండ్రులు వెంటనే ఈ విషయాన్ని హెడ్మాస్టర్కు ఫిర్యా దు చేశారు.హెడ్ మాస్టర్ ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు.పోలీసులు వా ష్రూమ్ నుంచి కెమెరా తరహా పరికరాన్ని స్వాధీనం చేసుకున్నారు.ఈ పరికరంలో ఉన్న రికార్డుల ఆధారంగా దర్యాప్తును వేగవంతం చేశారు.నిందితుడైన అటెండర్ యాకూబ్ ఈ విషయం బయటపడటంతోనే పరారీలో ఉన్నాడు.స్కూల్ వాతావరణంలో ఇలాంటి ఘ టనలు జరగడం దారుణం.ఈ ఘటనతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు గురవు తున్నారు.ఈ వ్యవహారానికి పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని విద్యార్థులు తల్లి దండ్రులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
Comments
Post a Comment