Posts

Showing posts from March, 2025

సాంకేతిక ఆధారంగా నేరాలపై నిఘా...జిల్లా పోలీసు శాఖకు కేటాయించనున్న డ్రోన్ పనితీరును పరిశీలన..విక్రాంత్ పాటిల్,కర్నూలు జిల్లా ఎస్పీ...

Image
VS9TV న్యూస్, కర్నూలు క్రైం : సాంకేతిక ఆధారంగా నేరాల కట్టడిపై దృష్టి పెట్టామని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు.ఈ సంధర్బంగా సోమవారం ఆంధ్రప్రదేశ్ డిజిపి కార్యాలయం నుండి కర్నూలు జిల్లా పోలీసు శాఖకు కేటాయించనున్న డ్రోన్ కెమెరా పనితీరును కర్నూలు ఎపిఎస్పీ రెండవ బెటాలియన్ లో కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ పరిశీలించారు.ఈ సంధర్బంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ...ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని స్మార్ట్ పోలీసింగ్ తో నేరాలను నియంత్రించడానికి డ్రోన్ సాంకేతికతను ఉపయోగించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. డ్రోన్ కెమెరా వివరాలు : ఈ డ్రోన్ కెమెరా చెన్నై మార్స్ ( MARS) ఎయిరో( ఓపిసి) ప్రవేట్ లిమిటెడ్ కు చెందింది.శాంతి భద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నియంత్రణ,విపత్తు నిర్వహణ, వివిధ బందోబస్తులు,బహిరంగ సభలు, జాతరలు/ఊరేగింపు సమయంలో జన సమూహాన్ని పర్యవేక్షించడం,క్రౌడ్ మేనేజ్మెంట్ ద్వారా అవాంఛనీయ సంఘటనలు నిలువరించుట, సెన్సిటివ్/హాట్స్పాట్ ప్రాంతాల్లో గస్తీ నిర్వహించుటకు,వరదలు,భూకంపాల వంటి విపత్తు సమయాలలో రెస్క్యూ & సహాయక చర్యలు చేపట్టుట, అనుమానితులను గు...

రంజాన్ పురస్కరించుకొని హజరత్ మౌలానా యూసుఫ్ సాబ్ మస్జీద్ లో ప్రత్యేక ప్రార్ధనలు...

Image
VS9TV న్యూస్,కల్లూరు : కర్నూలు నగరం,కల్లూరు అర్బన్,35వ వార్డ్,హజరత్ మౌలానా యూసుఫ్ సాబ్ మస్జీద్ లో రంజాన్ పురస్కరించుకొని ప్రత్యేక ప్రార్ధనలు జరిపారు.ప్రార్థనలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మత పెద్దలు మౌలానా అబ్దుల్ సత్తార్,హజరత్ మౌలానా ఇస్మాయిల్,అబ్దుల్ హాక్,మస్జీద్ కమిటీ ప్రెసిడెంట్,సెక్రటరీలు ఖాసీం మియా,మొల్ల హుసేన్ సాహెబ్,హాజరై ప్రార్థనలు చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రంజాన్ సందర్బంగా కర్నూలు,పాణ్యం ముస్లిం ప్రజలకు శుభాకాంక్షలు తెలియచేశారు. హజరత్ మౌలానా యూసుఫ్ సాబ్ మస్జీద్ ను జిల్లాలో అతిపెద్ద మస్జీద్ గా నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు.నిర్మాణం ప్రారంభం నుండి మస్జీద్ లో బక్రీద్, రంజాన్ వంటి పండుగలు సందర్బంగా ప్రత్యేకంగా ప్రార్థనలు జరుగుతున్నట్లు చెప్పారు.మస్జీద్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని కోరారు. అదేవిదంగా ముస్లిం సమాజం సైతం మస్జీద్ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు అబ్దుల్ షుకూర్,అబ్దుల్ హమీద్,ఖాజామియ, మహబూబ్ బాషా,నూర్ అహమ్మద్, మహమ్మద్ సోహైల్,చుట్టుపక్కల ముస్లిం సోదరులు అధ...

బాల్ బ్యాట్మెంటన్ క్రీడాకారుడు కన్నయ్య జ్ఞాపకార్ధం బాల్ బ్యాట్మెంటన్ పోటీలు...

Image
VS9TV న్యూస్,కల్లూరు : కర్నూలు నగరం,32వ వార్డ్,ముజఫర్ నగర్ లో ఉగాది పండుగ సందర్భంగా బాల్ బ్యాట్మెంటన్ క్రీడాకారుడు కన్నయ్య జ్ఞాపకార్ధంగా బాల్ బ్యాట్మెంటన్ పోటీలు నిర్వహించారు.పోటీలకు స్టార్ ఆఫ్ ఇండియా బాల్ బ్యాట్మెంటన్ క్రీడాకారుడు రామకృష్ణ హాజరై ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత సంవత్సరంలో ప్రమాదబారినపడి కన్నయ్య మృతి క్రీడాకారుల్లో తీరని దిగ్బ్రాంతిని మిగిలించిందని ఆవేదన చెందారు.క్రీడల పట్ల కన్నయ్య ఎంతో చొరవచూపేవాడని,ప్రతి క్రీడాకారున్ని కలుపుకొని పలుమార్లు క్రీడపోటీలలో పాల్గొనేవాడని గుర్తుచేశారు.కన్నయ్య జ్ఞాపకార్థంగా ముజఫర్ నగర్ బాల్ బ్యాట్మెంటన్ పోటీలు జరుపుతున్న క్రీడాకారులను అభినందించారు.కన్నయ్య పేరుతో అనేక క్రీడాపోటీలు జరిపించాలని సూచించారు.ఈ పోటీలో నాలుగు టీంలు పాల్గొన్నాయని అన్నారు.దాతల సహకారంతో బాల్ బ్యాట్మెంటిన్ పోటీలు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. క్రీడాకారులు శ్రీనివాసులు,గిరి,శ్యామ్, సుల్తాన్,సీనియర్ బ్యాట్మెన్ క్రిరకారుడు ఆనంద్ మాట్లాడుతూ కల్లూరు మండలంలో క్రీడామైదానం లేక గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారులు వెనకబడుతున్నారని చెప్పారు.రాష్ట్ర ప్రభుత్వం యువతను ప...

రంజాన్ సందర్బంగా గట్టి భద్రత…పకడ్బందీ తనిఖీలు...ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలి...మధుసూదన్ గౌడ్,నాల్గవ పట్టణ సిఐ...

Image
VS9TV న్యూస్,కర్నూలు క్రైం : రంజాన్ పండుగను పురస్కరించుకొని సోమవారం భారీ సంఖ్యలో ముస్లిం, సోదరులు మసీదులకు,ఈద్గాలకు రానున్న నేపథ్యంలో సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ బందోబస్తు విధులు నిర్వహించాలని, వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చర్యలు చేపట్టాలని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ పోలీస్ అధికారులు,సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కర్నూల్ డిఎస్పీ బాబుప్రసాద్ ఆధ్వర్యంలో కర్నూలు నాల్గవ పట్టణ సిఐ మధుసూదన్ గౌడ్ సూచనల మేరకు కర్నూలు నాలుగవ పట్టణ ఎస్సై సమీర్ భాష,బాంబు స్క్వాడ్ బృందాలతో ఓల్డ్ ఈద్గా,న్యూ ఈద్గా తదితర ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించారు.ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి చర్యలు చేపట్టారు.

ఉగాది పురస్కరించుకొని ఘనంగా చౌడేశ్వరి ఉత్సవాలు...

Image
VS9TV న్యూస్,కల్లూరు : కర్నూలు నగరం,కల్లూరు గ్రామంలోని చౌడేశ్వరి దేవాలయ వద్ద ఉగాది పురస్కరించుకొని ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా చుట్టుపక్కల కాలనీ ప్రజలు చౌడేశ్వరి మాతను దర్శించుకుని,ప్రత్యేక పూజలు చేశారు.అలాగే ఆలయం చుట్టూ మట్టి బురద ఏర్పాటుచేసి, అందులో ఎద్దుల బండ్లు,గాడిదలతో ప్రదక్షిణం చేశారు. కార్యక్రమం ప్రజలను ఎంతగానో అక్షర్షితులను చేస్తుంది.మరోవైపు ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన దుకాణాల్లో బొమ్మలు, మహిళలకు సంబందించిన వస్తువులు, తినుబండారాలు ఆమ్మకాలు జరిపారు. అదేవిదంగా ఎగ్జిబిషన్ ప్రాంతంలో మహిళలు, పిల్లల సందడి పండుగకు ఆకర్షణగా నిలిచింది.ఈ నేపథ్యంలో ఆలయ ప్రాంతంలో ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా నాల్గవ పట్టణ పోలీసుల నిఘా పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.

ఉద్యోగుల సామాజిక సేవలు అభినందనీయం...

Image
VS9TV న్యూస్,కర్నూలు కార్పోరేషన్ : నగరపాలక ఉద్యోగులు సామాజిక సేవాకార్యక్రమాలు చేపట్టడం అభినందించదగ్గ విషయమని నగరపాలక కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు అన్నారు.ఆదివారం రామలింగేశ్వర్ నగర్ 17వ శానిటేషన్ డివిజన్ కార్యాలయంలో ఇన్ స్పెక్టర్ రాఘవేంద్ర అధ్వర్యంలో 42మంది పారిశుద్ధ్య కార్మికులకు వస్త్రాల బహూకరణ, చలివేంద్రం ప్రారంభోత్సవం,ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమానికి కమిషనర్ హాజరయ్యారు.

శ్రీ సీతారామాంజనేయ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుపేదలకు కూరగాయలు పంపిణీ...

Image
VS9TV న్యూస్,కల్లూరు :  కల్లూరు మండలం,పందిపాడు గ్రామం, బి.ఆర్.రెడ్డి కాలనీ నందు ఉన్న శ్రీ సీతారామాంజనేయ చారిటబుల్ ట్రస్టు వారు ఉగాది పండుగ సందర్భంగా కల్లూరు గ్రామ సమీపంలోని నిరుపేద కుటుంబాలకు ఆదివారం కూరగాయలు పంపిణీ చేశారు.ట్రస్ట్ వారు సేవా విషయంలో అన్నిట ముందు ఉండడం గమనార్హం.ప్రతి అమావాస్యకు ట్రస్ట్ వారు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సందర్బంగా ట్రస్ట్ చైర్మన్ వాసంతి మాట్లాడుతూ ట్రస్టులో అనాధలు,వృద్ధులను చేర్చుకుంటామని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సెక్రటరీ పవన్ చౌదరి, కోశాధికారి మధుసూదన్,తదితరులు పాల్గొన్నారు.

జిల్లా ప్రజలకు ఉగాది,రంజాన్ శుభాకాంక్షలు...కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్...

Image
VS9TV న్యూస్,కర్నూలు క్రైం : కర్నూలు జిల్లా ప్రజలకు తెలుగు నూతన సంవత్సరాది ఉగాది,రంజాన్ పండుగలను పురస్కరించుకొని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ శుభాకాంక్షలు తెలిపారు.ఈ ఉగాది ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.రంజాన్ పండుగను ముస్లిం సోదరీ, సోదరీమణులందరూ సంతోషంగా జరుపుకోవాలని కోరారు.అల్లాహ్ దీవెనలతో జిల్లా ప్రజలకు సకల శుభాలు కలగాలని జిల్లాఎస్పీ పేర్కొన్నారు.

జిల్లా విద్యాశాఖ అధికారిని మర్యాదపూర్వకంగా కలిసిన ఫ్యాప్టో నూతన కమిటీ బృందం...

Image
VS9TV న్యూస్,కర్నూలు ఎడ్యుకేషన్ : కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారిని నూతనంగా ఏర్పడిన ఫ్యాప్టో జిల్లా కమిటీ బృందం శనివారం మర్యాదపూర్వకంగా కలిసింది. కార్యక్రమానికి వివిధ సభ్య సంఘాల నాయకులు హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా ఫ్యాప్టో చైర్మన్ సేవాలాల్ నాయక్,సెక్రటరీ జనరల్ భాస్కర్,రవికుమార్,నవీన్ పాటిల్, ఎస్టియు గోకారి,డీటీఎఫ్ గట్టు తిమ్మప్ప,1938 ఇస్మాయిల్,ఎపిటిఎఫ్ 257 రంగన్న,వివిధ సభ్య సంఘాల నాయకులు కలిసి జిల్లా విద్యశాఖలో పరిష్కారం నోచుకోని సమస్యలను ప్రస్తావించారు.సమస్యల పట్ల డిఈఓ సానుకూలంగా స్పందించారు.

పదోతరగతి వొకేషనల్ పరీక్షలో 117 మంది గైర్హాజరు...ఎస్‌.శ్యామ్యూల్‌ పాల్‌,జిల్లా విద్యాశాఖాధికారి...

Image
VS9TV న్యూస్,కర్నూలు ఎడ్యుకేషన్ : కర్నూలు జిల్లాలో పదోతరగతి వొకేషనల్ పబ్లిక్ పరీక్షల్లో భాగంగా శనివారం జరిగిన వొకేషనల్ సబ్జెక్టులో 117మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఎస్‌.శ్యామ్యూల్‌ పాల్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఎస్ ఎస్ సి,మార్చి,2025 పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఎస్ ఎస్ సి, మార్చి,2025 పరీక్షలకుగాను కర్నూలు జిల్లా నుండి 6339విద్యార్థిని, విద్యార్థులు నమోదు చేసుకున్నారు. వారిలో మొత్తం 6222మంది విద్యార్థిని,విద్యార్థులు హజరుకాగా,117మంది విద్యార్థిని, విద్యార్థులు గైర్హాజరయ్యారని అన్నారు.ఈ పరీక్షలను పర్యవేక్షించడానికి జిల్లాలోని నాలుగు పరీక్షా కేంద్రాలను జిల్లా విధ్యాశాఖాధికారి పర్యవేక్షించారు.అదేవిదంగా ఫ్లయింగ్ స్క్వాడ్లు 12పరీక్షా కేంద్రాలు,సిట్టింగ్ స్క్వాడ్లు 34పరీక్షా కేంద్రాలు పర్యవేక్షించారని చెప్పారు.ఎక్కడ కూడా ఎటువంటి మాల్ ప్రాక్టీసు కేసులు నమోదు కాలేదని పేర్కొన్నారు.జిల్లా వ్యాప్తంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదన్నారు. పరీక్షలు పకడ్బందీగా అసౌకర్యాలు లేకుండా నిర్వహిస్తున్నామని జిల్లా విద్యాశాఖాధికారి తెలియజేశారు.

రోడ్డు భద్రతా నియమాలు పాటించడం అందరి కర్తవ్యం...ప్రతి శనివారం రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు...కర్నూలు రేంజ్ డిఐజి డాక్టర్ కోయ ప్రవీణ్...జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్...

Image
VS9TV న్యూస్,కర్నూలు క్రైం : వాహనదారులు రహదారి భద్రత నియమాలు పాటిస్తే రోడ్డు ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందని ప్రతి శనివారం రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన చేయాలని  కర్నూలు రేంజ్ డిఐజి డాక్టర్ కోయ ప్రవీణ్ పిలుపు నిచ్చారు.ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ రోడ్డు ప్రమాదాల నివారణ కొరకు రహదారి భద్రతపై విస్తృత అవగాహన పెంపొందించాలని అధికారులను ఆదేశించారు.జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు,కర్నూలు జిల్లా పోలీసు అధికారులు జిల్లావ్యాప్తంగా ఉన్న ఆయా పోలీసుస్టేషన్ పరిధులలో ప్రజలకు రోడ్డు భద్రత,రహదారి నిబంధనలపై శనివారం అవగాహన కల్పించారు.బైక్ లు నడిపే వారు ఖచ్చితంగా హెల్మెట్లు ధరించాలని, వేసవి కాలంలో సెలవులు రానునుండడంతో మైనర్లు విచ్చలవిడిగా బైక్ లు నడపడం చేయకూడదని, తల్లిదండ్రులు పిల్లల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని,ఓవర్ స్పీడ్ చేయకూడదని,ఓవర్ లోడ్ తో వాహనాలు వెళ్ళకూడదని సూచించారు. డ్రంకెన్ డ్రైవ్ వంటి వాటి వలన రోడ్డు ప్రమాదాల బారిన పడకూడదని ముఖ్య పట్టణాలలో,రద్దీ ప్రాంతాలలో రోడ్డు భద్రత ప్రాముఖ్యతపై ప్రజలకు సూచించారు. పోలీసు అధికారులు మాట్లాడుతూ : ద్విచక్ర వాహనదారుడు హె...

ఐదు మంది గంజాయి విక్రదారులు అరెస్ట్... మధుసూదన్ గౌడ్,నాల్గవ పట్టణ సిఐ...

Image
VS9TV న్యూస్,కర్నూలు క్రైం : కర్నూలు నగరంలోని,శరీన్ నగర్,వాటర్ ట్యాంక్ వద్ద గంజాయి విక్రయిస్తున్న ఐదు మంది వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు నాల్గవ పట్టణ సిఐ మధుసూదన్ గౌడ్ పేర్కొన్నారు.ఈ మేరకు శనివారం ఒక ప్రకటనలో వివరాలు వెల్లడించారు. కర్నూలు జిల్లా ఎస్పీ ఉత్తర్వుల మేరకు కర్నూలు నాల్గవ పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో గంజాయి అమ్మడం గాని, రవాణా చేయడం,కొనడం లాంటి కార్యకలాపాలు నిరోదించడంలో భాగంగా గత శుక్రవారం రాత్రి రాబడిన సమాచారం మేరకు శరీన్ నగర్ లోని పార్క్ నందు గల వాటర్ ట్యాంక్ వద్ద గంజాయి విక్రయిస్తున్న కర్నూలు నగరం, ఓల్డ్ కల్లూరు,చెంచునగర్ కు చెందిన  చిగుర్ల చిన్న నరసింహులు @ చిన్ని, కల్లూరు ఊరు వాకిలి ప్రాంతానికి చెందిన పి.రంగనాయకులు,ఓ మహిళా,షేక్ ఇస్మాయిల్,కృష్ణానగర్ కు చెందిన కె.కృష్ణలు గంజాయిని చిన్న చిన్న పొట్లాలుగా తయారుచేసి వ్యాపారం చేసే ప్రయత్నం చేశారని అన్నారు.అ ప్రయత్నంలో ఉండగా ఎస్సై గోపీనాథ్,సిబ్బందితోపాటు,గెజెటెడ్ అధికారి గురు స్వామిరెడ్డి,ప్రభుత్వ అధికారుల సమక్షం లో దాడి చేసి వారి నుండి 2.7 కేజీల గంజాయిని స్వాదీనపరచుకొని, వారిని రిమాండ్ చేసినట్లు చెప్పారు.ఇంకా ముగ్...

అమావాస్య పురస్కరించుకొని శ్రీశ్రీశ్రీ అభయాంజనేయస్వామి ఆలయంలోప్రత్యేకపూజలు,అన్నదానం...దాసరి మోహన్,ఆలయ కమిటీ చైర్మన్...

Image
VS9TV న్యూస్,కల్లూరు : కల్లూరు అర్బన్ పరిధి,32వ వార్డ్,ముజఫర్ నగర్,శ్రీశ్రీశ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో అమావాస్య పురస్కరించుకొని శుక్రవారం ప్రత్యేక పూజలు,అన్నదానం కార్యక్రమం చేపట్టినట్లు ఆలయ కమిటీ చైర్మన్ దాసరి మోహన్ పేర్కొన్నారు. ఈ సందర్బంగా దాసరి మోహన్ మాట్లాడుతూ కమిటీ బృందం వడ్డె ఆంజనేయులు,వి.విజయ్ కుమార్, వి.చంద్ర,వి.నరసింహులు,వి.కృష్ణ, టి.నాగిరెడ్డిలతోకలిసి ఆలయంలో దాతల సహకారంతో ప్రతి నెల అమావాస్య, హనుమాన్ జయంతి, శ్రీరామనవమి పర్వదినాలలో ప్రత్యేక పూజలు,అన్నదానం కార్యక్రమం జరుపుతున్నట్లు చెప్పారు.అదేవిధంగా ఈ అమావాస్య నందు ఆలయం పూజారి విరుపాక్షయ్య ప్రత్యేక పూజల తరువాత వీర గోత్రం,శంకరప్ప, హైమావతి వారి కుటుంబ సభ్యులు రాజశేఖర్,సరిత, నాగేంద్ర,చాముండేశ్వరి, తేజేశ్వర్,రామసాయి,భువనేశ్వర్ లు  ఏర్పాటుచేసినట్లు చెప్పారు.అనంతరం దాతలు శంకరప్ప,హైమావతి దంపతులను ఆలయ కమిటీ బృందం శాలువా, పూలమాలతో ఘనంగా సత్కరించారు. ఆలయంలో జరుపుతున్న ప్రతి కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలు,ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలియచేశారు.అలాగే సాయంత్రం భజన భక్త బృందం భజన కార్యక్రమం నిర్వహించారు...

దక్షిణ షిరిడీ సాయి మందిరంలో ఘనంగా ఉగాది వేడుకలకు ఏర్పాట్లు...

Image
మహాబలేష్,ఓం సాయి రామ్ సాయిబాబా భక్తి మండలి ప్రధాన కార్యదర్శి VS9TV న్యూస్,కర్నూలు కార్పోరేషన్ : కర్నూలు నగరం,పాతబస్తీ,షిరిడీ సాయి మందిరంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఓం సాయి రామ్ సాయిబాబా భక్తి మండలి ప్రధాన కార్యదర్శి మహాబలేష్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.ఈ నెల 30, ఆదివారం కర్నూలు దక్షిణ షిరిడిగా పేరుగాంచిన మన శిరిడి సాయిబాబా దేవస్థానం నందు తెలుగు నూతన స్వస్తిశ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉగాది వేడుకలను సాయి భక్తులచే ఏర్పాట్లు పూర్తిచేసినట్లు చెప్పారు. కార్యక్రమాలు : 1.ఉ.11.00 సాయి సత్సంగం 2.సా. 6:30 సంధ్యా హారతి 3.సా.7.00 చిన్నారుల చేత నృత్య ప్రదర్శన 4.రా 8.00 పల్లకి సేవ రథోత్సవము ఏర్పాటు చేయడమైనది కావున సాయి బంధువులు భగవద్ బంధువులందరు ఈ కార్యక్రమం పాల్గొని ఆ సాయినాథ కృపకు అందరూ పాత్రలు కావలసిందిగా కోరారు. గమనిక : కార్యక్రమానంతరం బాబా తరపున ఉగాది పచ్చడి ఏర్పటుచేయడమైనది.

డ్రోన్‌ కెమెరాలతో ప్రత్యేక నిఘా...

Image
పలు ప్రాంతాలలో పెట్రోల్ బంకుల దగ్గర జరుగుతున్న నేరాలను అదుపు చేసేందుకు ఆరా తీస్తున్న పోలీసులు... నిందితుల కొరకు డ్రోన్ కెమెరాలతో నిఘాను పటిష్టం చేసిన పోలీసులు... VS9TV న్యూస్,కర్నూలు క్రైం : కర్నూలు జిల్లాలో నేరాలను నియంత్రించే చర్యల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా నేరాలు జరిగేందుకు ఆస్కారం ఉన్న మారుమూల ప్రాంతాలను ముందుగా గుర్తించి,ఆయా ప్రాంతాలపై నిఘా పెట్టేందుకు డ్రోన్లను వినియోగిస్తున్నామని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ పేర్కొన్నారు.శుక్రవారం పెట్రోల్ బంకుల దగ్గర జరుగుతున్న నేరాలపై ముమ్మరంగా దర్యాప్తులు చేపట్టాలని జిల్లా ఎస్పీ పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.సబ్ డివిజన్ల వారిగా డ్రోన్ కెమెరాలను పంపి పెట్రోల్ బంకుల వద్ద నిఘా పటిష్టం చేశారు. ఈ సందర్బంగా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి,నేరాల కట్టడికి చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు.ఇందులో భాగంగా ప్రతీ పోలీసు స్టేషను పరిధిలో పెట్రోల్ బంకుల దగ్గర జరుగుతున్న నేరాల గురించి ఆరా తీస్తున్నారని అన్నారు. దొంగతనాలు,ఇతర నేరాలు జరిగేందుకు అవకాశం ఉన్న శివారు ప్రాంతాలన...

ఏపీలో నామినేటెడ్ పదవుల జాతర...

Image
VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి : ఆంధ్రప్రదేశ్ లో నామినేటెడ్ పదవుల కొనసాగుతోంది.ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మార్కెట్ యార్డ్ కమిటీలను ప్రకటించింది.ఇందులో రాష్ట్రంలోని 47మార్కెట్ యార్డు కమిటీల్లో టిడిపి - 37,జనసేన - 8,బీజేపీ - 2 స్థానాల్లో ఏఎంసి చైర్మన్లను అధిష్టానం ప్రకటించింది.చైర్మన్లు కానీ సభ్యులు కానీ మొత్తం 705మందికి పదవులు దక్కాయి. త్వరలో మిగిలిన మార్కెట్ కమిటీలను కూడా ప్రభుత్వం ప్రకటించే యోచనలో ఉంది.

న్యాయపరమైన చిక్కులను తొలగించి వెంటనే పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించాలి...

Image
ఇది మాటల ప్రభుత్వము చేతల ప్రభుత్వం కాదు నిరుద్యోగులను వంచిస్తుంది... నిరుద్యోగులకు ఇచ్చిన హామీ అమలు చేయకపోతే అసెంబ్లీని ముట్టడిస్తాం... డివైఎఫ్ఐ...   VS9TV న్యూస్,కర్నూలు కలెక్టరేట్ : ఏపీ పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ విడుదల చేసి రెండున్నర సంవత్సరమైనా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదని వెంటనే న్యాయపరమైన చిక్కులను తొలగించి పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని పాత పద్ధతిలోనే హోంగార్డుల రిజర్వేషన్ ని కొనసాగించాలని కోరుతూ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో శుక్రవారం డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రాఘవేంద్ర అధ్యక్షతన జిల్లా పరిషత్ నుండి కలెక్టరేట్ కి ర్యాలీ నిర్వహించారు.అనంతరం నిరుద్యోగులతో కలిసి జాయింట్ కలెక్టర్ బి.నవ్యకు వినతి పత్రం అందించారు. ధర్నాను ఉద్దేశించి డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నగేష్,ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు అబ్దుల్లా,పోలీస్ కానిస్టేబుల్ నిరుద్యోగ నాయకులు బాబు నాయక్ నాగార్జున మాట్లాడుతూ న్యాయపరమైన చిక్కులను తొలగించి వెంటనే మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించాలన్నారు.21/2 సం నుండి పెండింగ్ లో ఉన్న కానిస్టేబుల్ నోటిఫికేషన్ ను వెంటనే పూర్తి చేయాలన్నారు.నారా లో...

పండుగ రోజుల్లో సైతం పన్నులు చెల్లించవచ్చు...

Image
50శాతం వడ్డీ రాయితీ ఈ నెల 31తో ముగింపు... ఉదయం 9-00 నుండి రాత్రి 9-00వరకు పన్ను వసూళ్లు... నగరపాలక అదనపు కమిషనర్ ఆర్.జి.వి.క్రిష్ణ వెల్లడి... VS9TV న్యూస్,కర్నూలు కార్పోరేషన్ : ఉగాది,రంజాన్ పండుగ రోజులు ఈ నెల 30, 31వ తేదీల్లో సైతం ఆస్తి పన్ను,తాగునీటి కొళాయి చార్జీలను ప్రజలు చెల్లించవచ్చని నగరపాలక అదనపు కమిషనర్ ఆర్.జి.వి.క్రిష్ణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ నెల 31వ తేదీతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో ప్రజల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.50శాతం వడ్డీ రాయితీని ప్రజలు అధిక సంఖ్యలో వినియోగించుకుంటున్నారని,సెలవు దినాల్లో సైతం పన్నులను చెల్లించవచ్చని సూచించారు.ఆది,సోమవారాల్లో ఉదయం 9-00 గంటల నుండి రాత్రి 9-00 వరకు నగరపాలక కార్యాలయంలోని పన్ను వసూలు కేంద్రంతో పాటు నగరంలో వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలో సైతం పన్నులు చెల్లించవచ్చన్నారు.అదేవిధంగా ప్రజలు ఇంటి నుంచే పన్నులను డిజిటల్ ప్లాట్‌ఫాం ద్వారా చెల్లించవచ్చని, వాట్సాప్ నెంబర్ 9552300009, పురసేవ యాప్,వెబ్‌సైట్ https://cdma.ap.gov.in/en/ptpayments లలో చెల్ల...

ఆప్కోమాజీ డైరెక్టర్,కల్లూరు మాజీ సర్పంచ్ పోలిశెట్టి నాగలక్ష్మయ్య మృతి...

Image
VS9TV న్యూస్,కల్లూరు : ఆప్కో మాజీ డైరెక్టర్,గోల కల్లూరు మాజీ సర్పంచ్,శ్రీ చౌడేశ్వరి దేవి వసతి సముదాయం శ్రీశైలం అధ్యక్షులు పోలిశెట్టి నాగలక్ష్మయ్య (74) అనారోగ్యంతో శుక్రవారం స్వర్గస్తులయ్యారు.వీరి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని,వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని బంధుమిత్రులు కల్లూరు ప్రజలు భగవంతుని,కోరారు.25 సంవత్సరాల నుంచి ఆప్కో డైరెక్టర్ గా, అఖిలభారత తొగట వీర క్షత్రియ సేవా సంఘం శ్రీ చౌడేశ్వరి దేవి వసతి సముదాయం సత్రం శ్రీశైలం అధ్యక్షులుగా కొనసాగుతున్నారు.పోలిశెట్టి నాగలక్ష్మయ్య అంతిమయాత్ర శనివారం ఉదయం 11-00గంటలకు వారి స్వగృహం కల్లూరు ఎస్టేట్ నుంచి ప్రారంభమై కల్లూరు స్మశాన వాటిక యందు అంత్యక్రియలు నిర్వహించడం జరుగుతుంది అని కుటుంబ సభ్యులు తెలిపారు.

జమ్ కేర్ కామినేని హాస్పటల్లో క్లిష్టమైన భుజం మార్పిడి ఆపరేషన్ విజయవంతం...

Image
VA9TV న్యూస్,కర్నూలు హాస్పిటల్ : కర్నూలు నగరంలోని జమ్ కేర్ కామినేని హాస్పిటల్లో క్లిష్టమైన భుజం మార్పిడి ఆపరేషన్ విజయవంతంగా చేశామని ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ రవిబాబు తెలిపారు.నంద్యాల జిల్లా గాజులపల్లికి చెందిన జయమ్మ అనే పేషెంట్ కు గత సంవత్సరం జెమ్ కేర్ కామినేని హాస్పిటల్ లో మోకాలు మార్పిడి చేశామని,ఆమెకు 6నెలల నుండి కీళ్ల నొప్పులు అధికమై చెయ్యి కూడా పైకి ఎత్తలేని పరిస్థితుల్లో హాస్పిటల్ లో చేరిందని.ఆమెకు ఎమ్మారై, ఎక్స్ రే అన్ని రకాల టెస్టులు చేసిన అనంతరం కుడి భుజం ఎముకలు పూర్తిగా అరిగి పోయినట్లు నిర్దారణ జరిగిందన్నారు.ఈ వ్యాధిని ఆంకలోసిస్ అంటారని,దీనికి ఉత్తమ చికిత్స భుజం మార్పిడి చేయడమేనని,భుజం మార్పిడి ఆపరేషన్ చాలా క్లిష్టమైనదన్నారు.ఈ ఆపరేషన్ ప్రముఖ నగరాలైన హైదరాబాదు,బెంగళూరు తదితర ప్రాంతాల్లో మాత్రమే చేస్తున్నారని,ఈ ఆపరేషన్ ఇప్పుడు కర్నూలు నగరంలో జమ్ కేర్ కామినేని హాస్పిటల్ లో చేశామని డాక్టర్ రవిబాబు తెలిపారు. భుజం మార్పిడిలో కాంప్లెక్స్ ప్రొసీజర్ రివర్స్ షోల్డర్ ఆర్థోప్లాస్టి చేశారు.దీనివల్ల రోగికి భుజం కదలిక పూర్తిగా వచ్చింది. ప్రస్తుతం పేషంటు ఫిజియోథెరపీ చికిత్సతో కోల...

పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతిపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలి...కెవిపిఎస్ డిమాండ్...

Image
VS9TV న్యూస్,కల్లూరు : కల్లూరు అర్బన్ పరిధి,32వ వార్డ్, ముజఫర్ నగర్ కమిటీ ఆధ్వర్యంలో ముజఫర్ నగర్ ఆటో స్టాండ్ వద్ద పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతిపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం కెవిపిఎస్ ఆధ్వర్యంలో వార్డు అధ్యక్షులు ఇ.రామాంజనేయులు అధ్యక్షతన నిరసన కార్యక్రమం జరిగింది.ఈ సందర్బంగా సిఐటియు నాయకులు కె.సుధాకరప్ప, కెవిపిఎస్ నగర కార్యదర్శి వర్గ సభ్యులు యం.సి. ఆనంద్,డివైఎఫ్ఐ నగర కార్యదర్శి యస్. హుస్సేన్ భాష మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఏర్పడ్డాక మైనార్టీలపై జరుగుతున్న దాడులు కాస్త మతోన్మాదులు హత్యలు చేసే దిశగా అడుగులు వేస్తున్నారని విమర్శించారు.ప్రవీణ్ పగడాల మరణం ముమ్మాటికి మతోన్మాదుల హత్యేనని, ప్రభుత్వం దీనిని ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతుందని అన్నారు. ప్రవీణ్ పగడాల సోషల్ మీడియాలో పదేపదే తమకు ప్రాణహాని ఉందని చెబుతున్న ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోకుండా ఆయనకు సరైన భద్రత కల్పించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి కారణమని తెలిపారు‌.ఆయన మృతిపై ఇప్పటికే ప్రజాసంఘాలు,ప్రజాతంత్ర వాదులు,లౌకికవాదులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారని,ప్రభుత్వం స్పంది...

తక్షణమే ఇంటరిమ్ రిలీఫ్ (ఐఆర్) ప్రకటించాలి...ఆప్తా...

Image
VS9TV న్యూస్,కర్నూలు ఎడ్యుకేషన్ : ఉద్యోగ,ఉపాధ్యాయుల సమస్యలపై దృష్టిసారించి,పీఆర్సీ చైర్మన్ ను వెంటనే నియమించాలని,అలాగే ఇంటరిమ్ రిలీఫ్ (ఐఆర్) ప్రకటించాలని, ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ కర్నూలు జిల్లా అధ్యక్షులు యం.మధుసూదన రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఆర్.సేవలాల్ నాయక్ లు గురువారం ఒక ప్రకటనలో కోరారు. సరెండర్ లీవులు తదితర బకాయిలను చెల్లించి,'పెండింగ్ డీఏలను మంజూరు చేయాలన్నారు.కేంద్ర ప్రభుత్వ మెమో 57 ప్రకారం,2004,సెప్టెంబర్ కు ముందు నియమితులైన ఉపాధ్యాయులకు,పాత పింఛన్ విధానాన్ని అమలు చేయాలన్నారు. ప్రభుత్వ హామీకి అనుగుణంగా సీపీఎస్ రద్దుకు పరిష్కారం చూపే రోడ్ మ్యాప్ ప్రకటించాలన్నారు.ఎం.టి.ఎస్ ఉపాధ్యాయులకు 62 సం..లకు సర్వీస్ పెంచి,రెగ్యులర్ చేయాలని,పదవీ విరమణ పొందే ఉద్యోగ,ఉపాధ్యాయులకు వెంటనే గ్రాట్యుటీ చెల్లించాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

యూనివర్శిటి ఖ్యాతిని పెంపొందించడంలో విద్యార్థులే ప్రథానపాత్ర పోషించాలి... వి.వెంకట బసవరావు,విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్ లర్ ఆచార్య..

Image
VS9TV న్యూస్,కర్నూలు ఎడ్యుకేషన్ : రాయలసీమ యూనివర్శిటి ఖ్యాతిని పెంపొందించడంలో విద్యార్థులే ప్రథానపాత్ర పోషించాలని విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్ లర్ ఆచార్య వి.వెంకట బసవరావు పిలుపునిచ్చారు.బుధవారం యూనివర్శిటి ఇంజినీరింగ్ కాలేజీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సెమినార్ 2025 (TECH VUDBHAV - 2K25) కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా శాస్త్ర సాంకేతికరంగాల్లో కొనసాగుతున్న పరిశోధనలు,ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మొదలైన నూతన ఆవిష్కరణలపట్ల ఇంజినీరింగ్ విద్యార్థులు అవగాహన పెంచుకోవాలన్నారు.తాము చదువుతున్న విభాగాల్లో విషయ పరిజ్ఞానాన్ని పెంచుకుంటూ ప్రాజెక్టు వర్కులు పూర్తిచేసినపుడే విద్యార్థులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు.కేవలం తరగతిగదికే పరిమితం కాకుండా లైబ్రరీతోపాటు,ఇంటర్నెట్లో అందుబాటులోఉన్న సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలన్నారు. ఈ దిశగా యూనివర్శిటిలోని వసతులను సద్వినియోగం చేసుకుంటూ, విద్యార్థులంతా జీవితంలో పురోగతి సాధించాలని ఆకాంక్షించారు.వర్శిటి ఇంజినీరింగ్ కాలేజీలో వసతుల మెరుగుదలకు కృషిచేస్తున్నట్లు తెలిపారు.విద్యార్థుల జీవితానికి మేలి మలుపుగా నిల...

బహిరంగ మద్యపానంపై డ్రోన్ తో నిరంతరం నిఘా...

Image
బహిరంగ మద్యపానంపై ఉక్కు పాదం మోపుతున్న మంగళగిరి గ్రామీణ పోలీసులు ప్రజా జనజీవనానికి వారి స్వేచ్ఛకు భంగం కలిగిస్తే కఠినచర్యలు తప్పవు మంగళగిరి గ్రామీణ ఎస్ఐ చిరుమామిళ్ల వెంకట్ VS9TV న్యూస్,మంగళగిరి క్రైం : బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించిన, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని మంగళగిరి గ్రామీణ ఎస్ఐ చిరుమామిళ్ల వెంకట్ హెచ్చరించారు. గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్,నార్త్ డిఎస్పి సి.హెచ్.మురళీకృష్ణ మంగళగిరి రూరల్ సీఐ వై.శ్రీనివాసరావు ఆదేశాల మేరకు బుధవారం మంగళగిరి మండలం,కాజా గ్రామ శివారులోని డొంకలలో నిర్మానుష్యమైన ప్రదేశాలలో డ్రోన్ గస్తీ నిర్వహించి బహిరంగ మద్యపానం చేస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.ఈ సందర్బంగా మంగళగిరి రూరల్ ఎస్ఐ వెంకట్ మాట్లాడారు.ప్రజా శాంతికి,వారి స్వేచ్ఛకు భంగం కలిగే విధంగా బహిరంగ మద్యపానం చేయడం చట్టరీత్యా నేరం అని అన్నారు.మండల పరిధిలో నిరంతర డ్రోన్ గస్తీ నిర్వహణతో అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామని, బహిరంగ మద్యపానం సేవిస్తే కేసులు నమోదు చేసి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని మంగళగిరి రూరల్ ఎస్సై సి.హెచ్.వెంకట్ హెచ్చరించారు.

కర్నూలు వీ-లెర్న్ స్ఫూర్తితో రాష్ట్రమంతటా విస్తరిస్తాం...జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో విద్యామంత్రి నారాలోకేష్...

Image
VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి : కర్నూలు జిల్లాలో విద్యాశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న వీ-లర్న్ వర్చువల్ స్టూడియోను రాష్ట్రమంతా అన్ని జిల్లాల్లో అమలు చేయడానికి విద్యాశాఖా మంత్రి నారాలోకేష్ అంగీకరించారు.మంగళ,బుధవారాల్లో జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో కర్నూలులో ప్రారంభించిన వర్చువల్ స్టూడియో గూర్చి జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, సీఎం నారా చంద్రబాబునాయుడు,రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లారు. సాంకేతికతను అందిపుచ్చుకొని జిల్లా అంతట ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు విద్యా విషయ నైపుణ్యాలను వర్చువల్ స్టూడియో నుంచి ప్రతి పాఠశాలకు అనుసంధానం చేసి బోధించడం ద్వారా మెరుగైన ఫలితాలు వచ్చినట్లు వివరించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి ప్రతి విద్యార్థికి ప్రతి సబ్జెక్టులో ఎటువంటి సందేహాలు లేకుండా విషయనిపుణులతో వర్చువల్ స్టూడియోలో బోధించడం ద్వారా చేసిన ప్రయత్నాలు సఫలమయ్యాయని జిల్లా కలెక్టర్ వివరించారు.ముఖ్యంగా వీ-లర్న్ ద్వారా టీచర్ల కొరత సమస్యను అధిగమించామని వివరించారు.జిల్లాలో దాదాపు మూడువేల మంది ఉపాధ్యాయుల కొరతను దృష్టిలో పెట్టుకొన...

అర్ధరాత్రి కంగారు పెట్టించిన ఆటో డ్రైవర్...కౌన్సిలింగ్ చేసి మందలింపు..

Image
ఊపిరి పీల్చుకున్న కర్నూలు పోలీసులు... మన న్యూస్,కర్నూలు క్రైం : నంద్యాల నుండి కర్నూలు వైపు వెళ్తుంటే ఇద్దరు వ్యక్తులు తన ఆటోను ఆపి,దాడి చేసి గాయపరిచి,ఆటో ఎత్తుకెళ్ళారని కాల్వబుగ్గ సమీపంలో రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న నయారా పెట్రోల్ బంక్ లోకి వచ్చి కర్నూలు పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించడంతో కర్నూలు కమాండ్ కంట్రోల్ నుండి కర్నూలు పోలీసులు అప్రమత్తం అయ్యారు.జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు కర్నూలు డిఎస్పీ జె. బాబు ప్రసాద్ ఆధ్వర్యంలో కర్నూలు సబ్ డివిజన్ పోలీసులతో విచారణ చేపట్టారు.చెక్ పోస్టులు,కర్నూలు సరిహద్దు ప్రాంతాలలో అర్ధరాత్రి తనిఖీలు నిర్వహించారు.కర్నూలు డిఎస్పీ జె.బాబుప్రసాద్ ఓర్వకల్లుకు అర్థరాత్రి వెళ్ళి పరిశీలన చేశారు.ఈ మేరకు బుధవారం ఘటన వివరాలు వెల్లడించారు.కాల్వబుగ్గ దగ్గరకు వెళ్ళి సంఘటన జరిగిన ప్రాంతానికి వెళ్ళి చూస్తే ఆటో లోయలో పడింది.ఆటో డ్రైవర్ కు బాగా గాయాలయ్యాయి. అయితే పోలీసుల విచారణలో నల్గొండ జిల్లా,మిర్యాల గూడకు చెందిన డ్రైవర్ పేరు మనోజ్ (32),జమ్ములమడుగు చెందిన మహిళను పెళ్ళి చేసుకున్నాడు.భార్య గొడవపడి జమ్ముల మడుగుకు వాళ్ళ ఇంటికి వెళ్ళింది.ఆటోడ్ర...

ఆస్తి పన్నుకు మాత్రమే 50శాతం వడ్డీ మాఫీ...

Image
ఈ నెలాఖరులోగా ఏకమొత్తంలో చెల్లిస్తేనే వర్తింపు... సెలవు దినాల్లో సైతం పన్ను వసూళ్లు.. ఆర్.జి.వి.క్రిష్ణ,నగరపాలక అదనపు కమిషనర్... VS9TV న్యూస్,కర్నూలు కార్పోరేషన్ : భవనాలు,ఖాళీ స్థలాలపై ఉన్న బకాయిలకు మాత్రమే 50శాతం వడ్డీ రాయితీ వర్తిస్తుందని నగరపాలక అదనపు కమిషనర్ ఆర్.జి.వి. క్రిష్ణ స్పష్టం చేశారు.బుధవారం ఆయన నగరపాలక కార్యాలయంలోని పన్ను వసూళ్లు కేంద్రాన్ని పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...భవనాలు,ఖాళీ స్థలాలకు సంబంధించి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పాటు,పాత బకాయిలన్నీ ఏక మొత్తంలో చెల్లిస్తేనే 50శాతం వడ్డీ రాయితీ వర్తిస్తుందని తెలిపారు.ఇప్పటికే వడ్డీతో చెల్లించిన బకాయిదారులకు,వచ్చే ఆర్థిక సంవత్సరంలో సర్దుబాటు చేయడం జరుగుతుందన్నారు.ఈ నెల 31తో ఆర్థిక సంవత్సరం ముగుస్తుందని,ఆదివారం ఉగాది,సోమవారం రంజాన్ దినాల్లో సైతం పన్ను వసూళ్లు కేంద్రాలు, ప్రత్యేక కౌంటర్లు తెరిచే ఉంటాయన్నారు.ఈ నెలాఖరున రాష్ట్ర వ్యాప్తంగా పన్ను చెల్లింపుదార్ల రద్దీ ఎక్కువగా ఉండొచ్చని, కావున బకాయిదారులు చివరి వరకు వేచి ఉండొద్దని సూచించారు.సత్వరమే పన్నులు చెల్లించి,50శాతం వడ్డీ రాయితీ పొందాలని అదనపు కమిషనర్ ప...

పెంచిన ఇంటి పన్నులు రద్దు చేయకపోతే మరో ఇంటి పన్నుల పోరాటం చేస్తాం...సిపిఎం నాయకుల హెచ్చరిక...

Image
VS9TV న్యూస్,కర్నూలు కార్పోరేషన్ : కర్నూలు నగర కార్పొరేషన్ అధికారులు పెంచిన ఇంటి పనులు తగ్గించకపోతే గతంలో కల్లూరు కాలనీలో ఇంటి పన్నులు పెంచినప్పుడు చేసిన పద్ధతుల్లో పెంచిన ఇంటి పనులకు వ్యతిరేకంగా సుదీర్ఘ పోరాటం చేస్తామని సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పి.నిర్మల, రాముడు హెచ్చరించారు.బుధవారం స్థానిక కర్నూలు నగరపాలక సంస్థ కార్యాలయం ముందు పెంచిన ఇంటికి తగ్గించాలని విస్తరించిన కాలనీలో త్రాగునీటి సౌకర్యం కల్పించాలని రద్దయిన క్యాప్ ఆటోలను తిరిగి పునరుద్ధరించాలని మరో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మాణం చేపట్టాలని కోరుతూ సిపిఎం పార్టీ ఓల్డ్ సిటీ కార్యదర్శి ఎం.రాజశేఖర్ అధ్యక్షతన ధర్నా కార్యక్రమాన్ని చేపట్టింది.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సిపిఎం పార్టీ మార్చి, 8వ తేదీ నుండి ప్రజా చైతన్య యాత్ర పేరుతో నగరంలో వివిధ వార్డుల్లో పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకోవడం జరిగిందని,తమ దృష్టికి వచ్చిన సమస్యలు మున్సిపల్ అధికారులు తక్షణమే పరిష్కారం చేయాలని తెలిపారు.నగరంలో మున్సిపల్ కార్యాలయానికి ఎదురుగా ఉన్న ఎన్.ఆర్.పేట,కొత్తపేట,ప్రకాష్ నగర్ లాంటి ప్రాంతాలతో ప...

కర్నూలు జిల్లా ఫ్యాప్టో ఛైర్మన్ గా ఆప్టా సేవలాల్ నాయక్...

Image
VS9TV న్యూస్,కర్నూలు ఎడ్యుకేషన్ : ఫ్యాప్టొ రాష్ట కార్యవర్గ ఆదేశాల ప్రకారం 2025 -27 కుగాను కర్నూలు జిల్లా ఫ్యాప్టో కార్యవర్గ ఎన్నిక కర్నూలు జిల్లా ఎస్ టీయు భవన్ యందు బుధవారం జరిగింది.కార్యక్రమానికి రాష్ట్ర పరిశీలకుడుగా రాష్ట్ర ప్యాప్తో కో ఛైర్మన్, కర్నూలు జిల్లా ఫ్యాప్టో ఇంచార్జి కాకి ప్రకాష్ రావు,13సభ్య సంఘాల జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి హాజరయ్యారు.ఇందులో ఎపి ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్(ఆప్టా) జిల్లా ప్రధాన కార్యదర్శి సేవాలాల్ నాయక్, ఫెప్టో కర్నూలు జిల్లా ఛైర్మన్,సెక్రెటరీ జనరల్ జి.భాస్కర్ (బిటిఎ),కో ఛైర్మన్ లు వై. నారాయణ (హెచ్ ఎంఎ),వి.జి.వెంకట రాముడు (డిటిఎఫ్),ఎస్.గులాబ్ భాష (రూట),రాజేష్ (ఎస్ సి/ఎస్ టి యూనియన్) డిప్యూటీ సెక్రటరీ జనరల్ యు.రవికుమార్ (యుటిఎఫ్),టి.కె. జనార్ధన్ (ఎస్ టియు),ఎస్.ఇస్మాయిల్ (ఎపిటిఎఫ్ 1938),కోశాధికారి ఎన్.రంగన్న (ఎపిటిఎఫ్ 257) నుండి ఎన్నిక కావటం జరిగింది.ఈ ఎన్నిక కార్యక్రమంలో నవీన్ పాటిల్ (యుటిఎఫ్),ఎస్.గోకారి (ఎస్ టియు), మరియనందం(ఎపి టిఎఫ్ 1938),తిమ్మప్ప (డిటిఎఫ్) మధుసుధన్ రెడ్డి (ఆప్టా),జిల్లా నాయకులు పాల్గొన్నారు.

విద్యార్థులతో కలిసి ట్రాఫిక్ నియంత్రణ,హెల్మెట్ పై అవగాహన... మన్సురుద్దీన్,ట్రాఫిక్ సిఐ...

Image
VS9TV న్యూస్,కర్నూలు క్రైం : కర్నూలు నగరంలోని,వివిధ ట్రాఫిక్ పాయింట్ల వద్ద బుధవారం డిజిపి,జిల్లా ఎస్పీ సూచనల మేరకు ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్ ఆధ్వర్యంలో మైపర్ ఫార్మసి,నారాయణ పాఠశాలల విద్యార్థులతో కలిసి ట్రాఫిక్ నియంత్రణ, హెల్మెట్ అవగాహనా కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్బంగా ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్ మాట్లాడుతూ వాహనదారులు అన్నారు. ప్రమాదాలను అరికడదాం - గమ్యాన్ని చేరుకుందాం అనే విధంగా ట్రాఫిక్ నిబంధనలు ప్రతిఒక్కరు పాటించాలని సూచించారు.హెల్మెట్ వాడడం వల్ల ప్రమాదంలో మనిషికి రక్షణ కల్పిస్తుందని వారు తెలిపారు.

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

Image
పైపులైన్ లో భూములు కోల్పోయిన రైతులకు ఒక సెంటుకు రూ.50 వేలు ఇవ్వాలి 10 సెంట్లకన్నా ఎక్కువ భూమి పోయిన రైతుల కుటుంబాల్లో ఒక ఉద్యోగం ఇవ్వాలికి  పైపులైను పోయిన గ్రామాలలో చెరువులు కుంటలకు మోటార్ల ద్వారా నీళ్లు నింపాలి ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి.రామకృష్ణ డిమాండ్... VS9TV న్యూస్,కర్నూలు మండలం :  ఓర్వకల్లు మండలంలోని పరిశ్రమలకు నీళ్లు తీసుకురావడం కోసం పూడిచెర్ల, కేతవరం, గార్గెయపురం రైతుల భూములు కోల్పోయిన విషయం పైన ఆర్డీఓ ఆఫీస్ లో ఆర్డిఓ సందీప్ కుమార్,కర్నూలు తహసిల్దార్ రమేష్ బాబుఓర్వకల్లు డిప్యూటీ తాసిల్దార్ రాజేష్,ఏపీఐఐసీ జెడ్.ఎం.మధుసూదన రెడ్డి సమక్షంలో సమావేశం జరిగింది.ఈ సమావేశానికి ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి.రామకృష్ణ కేతవరం పూడిచెర్ల, గార్గేయపురం రైతులు హాజరయ్యారు.ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి.రామకృష్ణ మాట్లాడుతూ ఓర్వకల్ మండలంలో రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల హబ్ ను ఏర్పాటు చేసిందని,వాటికి నీరు అవసరాల కోసం ముచ్చుమర్రి ఎత్తిపోతల కాలువ నుండి భారీ పైపులైన్ తీసుకొస్తున్నారని,వచ్చే దారిలో గార్గేయపురం,కేతవరం,పూడిచెర్ల గ్రామాల ర...

గొందిపర్ల గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పించాలి...సిపిఎం డిమాండ్...

Image
VS9TV న్యూస్,కర్నూలు మండలం : కర్నూలు మండలం,గొందిపర్ల గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పించాలని సిపిఎం మండల నాయకులు రాఘవేంద్ర, సీనియర్ నాయకులు ఆంజనేయులు డిమాండ్ చేశారు.మంగళవారం ప్రజా చైతన్య యాత్ర గొందిపర్ల గ్రామంలో వీధి వీధిన తిరిగి,అలాగే ఇందిరమ్మ కాలనీలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన నాటినుండి మౌలిక సదుపాయాలు కల్పించడంలో పూర్తిగా విఫలం చెందిందని అన్నారు.గొందిపర్ల గ్రామంలో రోడ్లు పూర్తిగా దెబ్బతినిపోయాయని చెప్పారు.డ్రైనేజీ నిర్మాణం లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉందన్నారు.ప్రతిరోజు శుభ్రమైన మంచినీరు అందించడం లేదని విమర్శించారు.ప్రచారం సందర్భంగా అనేకమంది కొత్త పెన్షన్ల కోసం ఇళ్ల స్థలాల కోసం ఎదురు చూస్తున్నామని తెలియజేశారన్నారు.రాష్ట్ర ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చి అమలు చేయకుండా మోసం చేసిందని విమర్శించారు.వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని, రైతులకు ఇస్తామన్న పెట్టుబడి సహాయం, తల్లికి వందనం పేరుతో ఇస్తామన్న సహాయం,ఉచిత బస్సు సౌకర్యం మహిళలకు ఇస్తామన్న రూ.1500 నిరుద్యోగ భృతి,మెగా డీఎస్సీ,ఎస్సై,కానిస్టేబుల్ సమస్యల పరిష్కారం చే...

అమరవీరుల స్ఫూర్తితో నాణ్యమైన విద్య కోసం పోరాడుదాం...

Image
VS9TV న్యూస్,కర్నూలు ఎడ్యుకేషన్ : అమరవీరుల స్ఫూర్తితో నాణ్యమైన విద్య కోసం పోరాడాలని ఈ తాండ్రపాడు గ్రామ సర్పంచ్ బాలపీర,ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు సాయి ఉదయ్,డివైఎఫ్ఐ మండల కార్యదర్శి ప్రకాష్ లు పిలుపునిచ్చారు.మంగళవారం కర్నూలు మండలం,ఈ.తాండ్రపాడు గ్రామంలో భగత్ సింగ్ సుఖదేవ్ రాజు గురుల 23వ వర్ధంతి ఉత్సవాలలో భాగంగా కార్యక్రమం ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి అంజి అధ్యక్షతన జరిగింది.ముందుగా అమరవీరుల చిత్రపటానికి పూలమాలతో నివాళులు అర్పించారు.అనంతరం సర్పంచ్ బాలపీరా,ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు సాయి ఉదయ్,మండల్ కార్యదర్శి ప్రకాష్,ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మి మాట్లాడారు.ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య కోసం మెరుగైన సౌకర్యాల కోసం ప్రతి విద్యార్థి అమరవీరుల స్ఫూర్తితో పోరాడాలని అన్నారు.ప్రభుత్వం మెగా డీఎస్సీ పూర్తి చేసి మొత్తం ప్రతి స్కూలులో అన్ని సబ్జెక్టులకు సంబంధించిన టీచర్లను నియమించారని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో డ్రగ్స్ మత్తు పదార్థాలు మితిమీరిపోయాయని వాటికి విద్యార్థులు దూరంగా ఉండాలని సూచించారు.రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ నివారణ చర్యలు చేపట్టడంలో పూర్తిగా విఫలమైందని డ్రగ్స్ నివారణ కోసం ప...