పదోతరగతి వొకేషనల్ పరీక్షలో 117 మంది గైర్హాజరు...ఎస్.శ్యామ్యూల్ పాల్,జిల్లా విద్యాశాఖాధికారి...
VS9TV న్యూస్,కర్నూలు ఎడ్యుకేషన్ :
కర్నూలు జిల్లాలో పదోతరగతి వొకేషనల్ పబ్లిక్ పరీక్షల్లో భాగంగా శనివారం జరిగిన వొకేషనల్ సబ్జెక్టులో 117మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఎస్.శ్యామ్యూల్ పాల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఎస్ ఎస్ సి,మార్చి,2025 పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఎస్ ఎస్ సి, మార్చి,2025 పరీక్షలకుగాను కర్నూలు జిల్లా నుండి 6339విద్యార్థిని, విద్యార్థులు నమోదు చేసుకున్నారు. వారిలో మొత్తం 6222మంది విద్యార్థిని,విద్యార్థులు హజరుకాగా,117మంది విద్యార్థిని, విద్యార్థులు గైర్హాజరయ్యారని అన్నారు.ఈ పరీక్షలను పర్యవేక్షించడానికి జిల్లాలోని నాలుగు పరీక్షా కేంద్రాలను జిల్లా విధ్యాశాఖాధికారి పర్యవేక్షించారు.అదేవిదంగా ఫ్లయింగ్ స్క్వాడ్లు 12పరీక్షా కేంద్రాలు,సిట్టింగ్ స్క్వాడ్లు 34పరీక్షా కేంద్రాలు పర్యవేక్షించారని చెప్పారు.ఎక్కడ కూడా ఎటువంటి మాల్ ప్రాక్టీసు కేసులు నమోదు కాలేదని పేర్కొన్నారు.జిల్లా వ్యాప్తంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదన్నారు. పరీక్షలు పకడ్బందీగా అసౌకర్యాలు లేకుండా నిర్వహిస్తున్నామని జిల్లా విద్యాశాఖాధికారి తెలియజేశారు.
Comments
Post a Comment