రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...
రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వంఅన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్సంవత్సరానికి రూ.20వేలు సహకారంగౌరు చరిత రెడ్డి,పాణ్యం ఎమ్మెల్యే
కర్నూలు జిల్లా,ఓర్వకల్లు మండలం,ఎంపిడిఓ కార్యాలయ ప్రాంగణంలో రైతన్న సేవలో మ న మంచి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ కార్యక్రమం బుధవారం ఏర్పాటు చేశారు.కార్యక్రమానికి హాజరైన పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి మాట్లాడుతూ కూట మి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా అన్నదాత సుఖీభవ పథకం కింద సాగు భూమి కలిగి ఉన్న భూ యజమాని రైతు కుటుంబాలకు,అటవీ భూమి సాగుదారు కుటుం బాలకు అన్నదాత సుఖీభవ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.14వేలు,పీఎం కిసాన్ పథ కం కింద కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు కలుపుకుని,సంవత్సరానికి రూ.20వేలు చొప్పున ఆ ర్థిక సహాయం అందిస్తున్న కూటమి ప్రభుత్వం 2025,ఆగస్ట్,2వ తేదీన మొదట విడతగా 46,85,838 మంది రైతుల ఖాతాల్లో రూ.3174.43 కోట్లు (కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ నిధులు) జమ చేయడం జరిగిందని అన్నారు.
అదేవిదంగా 2025,నవంబర్,19వ తేదీన రెండో విడత రూపంలో 46,85, 838 మం ది రైతుల ఖాతాల్లో రూ.3135.01 కోట్లు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ నిధులు జమ చేయడం జరిగిందని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి రైతులకు తెలియచేశారు.ఈ కార్యక్రమం లో నంద్యాల జిల్లా అధ్యక్షులు,టీటీడీ పాలక మండలి సభ్యులు మల్లెల రాజశేఖర్,ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్సన్ కమ్మరి పార్వతమ్మ, సింగల్ విండో చైర్మన్లు,డైరెక్టర్లు,క్లస్టర్ ఇన్చార్జిలు,యూనిట్,భూత్ ఇన్చార్జిలు సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు,కూటమి నాయకులు,కార్యకర్తలు,అభిమానులు,తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment