న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

లా నేస్తం,మ్యాచింగ్‌ గ్రాంట్‌ చెల్లించాలి

సుంకర రాజేంద్ర ప్రసాద్‌,ఆల్‌ ఇండియా లాయర్స్‌ యూనియన్‌ నేషనల్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌

Vs9tvన్యూస్,కర్నూలు లీగల్ :

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి చేస్తోందని, అందులో భాగంగానే న్యాయవాదుల చట్టానికి సవరణలు చేస్తూ డ్రాఫ్ట్‌ రూపొందించిందని ఆల్‌ ఇండియా లాయర్స్‌ యూనియన్‌ (ఐలు) నేషనల్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సుంకర రాజేంద్ర ప్రసాద్‌ తెలిపారు.కర్నూలులోని ఎపిఎస్‌ఇబి ఇంజనీర్స్‌ అతిధి గృహంలో ఆదివారం ఐలు రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించారు.అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజేంద్ర ప్రసాద్‌ మాట్లాడుతూ న్యాయవాదుల చట్టానికి సవరణలు చేయడం వెనక కుట్ర ఉందన్నారు.కేంద్రం తన నిరంకుళ విధానాలతో అన్ని వ్యవస్థలనూ నిర్వీర్యం చేసినట్లు న్యాయవ్యవస్థ మీద కూడా తన పెత్తనాన్ని చలాయించాలని చూస్తోందని తెలిపారు.బార్‌ కౌన్సిల్లకు స్వయం ప్రతిపత్తి లేకుండా ఆల్‌ ఇండియా బార్‌ కౌన్సిల్‌ కనుసన్నల్లో పనిచేసేలా చూస్తోందన్నారు. న్యాయవాదులు బయపడుతూ పని చేసే పరిస్థితి వస్తే దేశంలో న్యాయ వ్యవస్థ కూలిపోతుందన్నారు. యువ న్యాయవాదులకు గత ప్రభుత్వం నెలకు రూ.5వేలు లా నేస్తం పేరుతో ప్రకటించిందని,టిడిపి నాయకులు ఎన్నికలకు ముందు ఆ మొత్తాన్ని రూ.10వేలు చేస్తామని హామీ ఇచ్చారని చెప్పారు.అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు పూర్తవుతున్నా లా నేస్తం ఇవ్వలేదని,దాన్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.గతంలో టిడిపి ప్రభుత్వం మరణించిన న్యాయవాదుల కుటుంబాలకు రూ.4 లక్షల మ్యాచింగ్‌ గ్రాంట్‌ ఇస్తామని ప్రకటించారని,వెయ్యి మందికి ఆ మొత్తం బకాయి ఉందని,దాన్ని వెంటనే చెల్లించాలని కోరారు.న్యాయస్థానాల్లో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్‌ చేశారు.న్యాయవాదుల పోరాటానికి ప్రజలు మద్దతివ్వాలని కోరారు.1న విజయవాడలో న్యాయ విద్యార్థుల రాష్ట్ర కన్వెన్షన్‌ నిర్వహిస్తున్నామని,ప్రతి లా కాలేజీ నుంచి ప్రతినిధులు హాజరుకానున్నట్లు తెలిపారు.ఐలు జాతీయ నాయకులు నర్ర శ్రీనివాస్‌ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా అనేక ఒత్తిడులు వస్తున్నాయన్నారు.కొన్ని సందర్భాల్లో న్యాయవాదులపై హత్యాప్రయత్నాలు జరిగాయన్నారు. న్యాయవాదులకు రక్షణ లేకపోతే ప్రజలకు న్యాయం అందే పరిస్థితి ఉండదన్నారు.న్యాయవాదుల రక్షణకు చట్టం తేవాలని డిమాండ్‌ చేశారు. న్యాయవాదుల హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ఇవ్వాలన్నారు. సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాధవరావు,అధ్యక్షులు కెంగార కుమార్‌, జిల్లా అధ్యక్షులు సింగరాజు లక్ష్మణ్‌ పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....