చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...
చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ
విక్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ
కర్నూలు నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని సూర్య దేవాలయం వద్ద గల వివేక్ నగర్లో నివాసం ఉంటున్న కృష్ణమూర్తి నాగేంద్ర అను వ్యక్తి ఇంట్లో పని చేసే పనిమనిషి చోరీ చేసిన వస్తు వులు ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ చేసి నట్లు నాల్గవ పట్టణ సిఐ విక్రమ్ సింహ పేర్కొన్నారు. ఈ మేరకు సిఐ విక్రమ్ సింహ తెలిపిన వివరాలు ప్రకా రం...కృష్ణమూర్తి నాగేంద్ర ఏప్రిల్,2వ తేదీ నుండి 27వ తేదీ మధ్యలో తన పనుల నిమిత్తం ఇతర ప్రాంతానికి వెళ్ళాడు.ఆ సమయంలో పనిమనిషి పర్వీన్ ఇదే అదనుగా యజమాని కృష్ణమూర్తి నాగేంద్ర ఇంటిలోని సుమారు ఐదు తులాల బంగారు ఆభరణాలు,30 తు లాల వెండి వస్తువులను చోరీ చేయడం జరిగిందని అ న్నారు.యజమాని కృష్ణ మూర్తి నాగేంద్ర ఇంటికి తిరిగి వచ్చాక చోరీ జరిగి నట్లు గుర్తించాడు.దీంతో నాల్గవ పట్టణ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసినట్లు చెప్పా రు.పిర్యాదు మేరకు ఎస్సై గోపినాథ్,చంద్రశేఖర్,హెడ్ కానిస్టే బుల్ జీనస్,కాని స్టేబుళ్లు మురళి, సుబ్బారా యుడు విచారణ చేపట్టినట్లు చెప్పారు.విచారణలో పనిమనిషి పర్వీన్ చోరికి పాల్పడినట్లు గుర్తించడం జరిగిందన్నారు.చోరికి పాల్పడిన పనిమనిషి పర్వీన్ ను అరెస్ట్ చేసి ఆమె నుండి 15తులాల బంగారు ఆభ రణాలు,30తులాల వెండి వస్తువులను స్వాధీనం చే సుకున్నట్లు సిఐ విక్రమ్ సింహ పేర్కొన్నారు.కేసును చే దించిన ఎస్సై గోపినాథ్,చంద్రశేఖర్,హెడ్ కానిస్టేబుల్ జీన స్,కానిస్టేబుళ్లు మురళి,సుబ్బారాయుడులను క ర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ అభినందించారు.
Comments
Post a Comment