ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్నకూతురిని హత్య చేసిన తండ్రి

ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం

పోస్టుమార్టంతో వెలుగులోకి వచ్చిన నిజం
నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,మాచర్ల,జూన్, 21:

ప్రేమించిన యువకుడిని వివాహం చేసు కుం దనే ఆగ్రహంతో కన్న తండ్రే తన కు మార్తెను హత్య చేసిన ఘటన పల్నాడు జిల్లా మాచ ర్లలో కలకలం రేపింది.హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసినప్పటికీ,పోస్టుమా ర్టం నివేదికలో అసలు విషయం బయటపడ టంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.వివరాలు ఇలా ఉ న్నాయి...మాచర్ల పట్టణంలోని 22వ వార్డు యాదవ బజార్‌కు చెందిన చంద్రశ్రీనుకు ఇద్ద రు సంతానం.కుమార్తె చౌడేశ్వరి ఇంటర్ వరకు చదివి ఇంటి వద్దే ఉంటోంది.ఈ క్రమంలో తమ ఇంటికి సమీపంలో నివసించే జమ్మలమడక నాగరాజుతో ఆమె ప్రేమలో పడింది.ఇద్దరూ ఒ కే సామాజిక వర్గానికి చెందినప్పటికీ,తమ ప్రే మ వివాహాన్ని పెద్దలు అంగీకరించరని భావిం చిన జంట ఇంటి నుంచి వెళ్లిపోయి వివాహం చేసుకుంది.వివాహం అనంతరం కొంతకాలం చెన్నైలో ఉన్న వీరు,తర్వాత నరసరావు పేట లోని ఓ స్నేహితుడి ఇంట్లో ఆశ్రయం పొందారు. కుమార్తె కనిపించకపోవడంతో చంద్రశ్రీను మా చర్ల పోలీసులకు ఫిర్యాదు చేశాడు.వారం రో జులైనా ఆచూకీ లభించకపోవడంతో పోలీస్ స్టేషన్ వద్ద పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయ త్నానికి ప్రయత్నించాడు.దీంతో గురజాల డీఎ స్పీ జోక్యం చేసుకుని యువతి ఆచూకీ కను గొంటామని హామీ ఇవ్వడంతో అతడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు.ఈ ఘటన జరిగిన మూ డు రోజుల తర్వాత పోలీసులు చౌడేశ్వరి,నాగ రాజుల ఆచూకీ గుర్తించి,వారిని మాచర్ల పోలీ స్ స్టేషన్‌కు తీసుకువచ్చారు.ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో చర్చలు జరిపారు.ఇద్దరూ మేజర్లు కావడంతో తాము చట్టపరంగా ఏమీ చేయలేమని పోలీసులు స్పష్టం చేశారు.అయి తే,పెద్దల సూచన మేరకు ఐదు రోజుల పాటు ఎవరింటికి వారు వెళ్లి,ఆ తర్వాత తుది నిర్ణ యం తీసుకోవాలని నిర్ణయించా రు.ఈ నేప థ్యంలో చౌడేశ్వరిని తన ఇంటికి తీసుకెళ్లిన చంద్ర శ్రీను,మరుసటి రోజు ఆమె ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని బంధువులకు తెలి పాడు.దీంతో ప్రేమ వివాహం కారణంగా మన స్తాపానికి గురై యువతి ఆత్మహత్య చేసుకుం దని మొదట అందరూ భావించారు.అయితే, అను మానాస్పద మృతిగా కేసు నమోదు చేసి న పోలీసులు పోస్టుమార్టం నిర్వహించగా షా కింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి.చౌడేశ్వ రి గొంతు నులిమి హత్య చేసిన అనంతరం, ఆమెను ఉరివేసి ఆత్మహత్యగా చిత్రీకరించిన ట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది.దీంతో పో లీసులు తండ్రి చంద్రశ్రీ నును అదుపులోకి తీ సుకుని విచారిస్తున్నారు.కూతురు తనకు ఇ ష్టం లేని వ్యక్తిని వివాహం చేసుకుందనే కార ణంతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ప్రాథ మిక దర్యాప్తులో వెల్లడైందని పోలీసులు తెలి పారు.ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....