Posts

Showing posts from May, 2025

400 మంది పోలీసులతో కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్షకు పటిష్ట భద్రత...బందోబస్తు విధులకు విచ్చేసిన పోలీసులకు దిశా,నిర్దేశం...విక్రాంత్ పాటిల్,జిల్లా ఎస్పీ...

Image
400 మంది పోలీసులతో కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్షకు పటిష్ట భద్రత బందోబస్తు విధులకు విచ్చేసిన పోలీసులకు దిశా,నిర్దేశం విక్రాంత్ పాటిల్,జిల్లా ఎస్పీ VS9TV న్యూస్,కర్నూలు క్రైం : కేటాయించిన విధులలో పోలీసులు  అప్రమ త్తంగా ఉండాలని,అలసత్వం ప్రదర్శించరా దని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు.శనివారం కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్ష సంధర్భంగా బందోబస్తు విధులకు వి చ్చేసిన పోలీసు లకు జిల్లా పోలీసు కార్యాల యంలోని పరేడ్ మైదానంలో శనివారం  జి ల్లా ఎస్పీ దిశా,నిర్దేశం చేశారు.ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్షను ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించడానికి పటిష్ట చర్యలు తీసుకో వాలన్నారు.పరీక్షా కేంద్రాల వద్ద 144సెక్షన్ అమలులో  ఉందని,పరీక్షలు ముగిశాక ఆ పత్రాలను పటిష్ట భద్రతా నడుమ స్ట్రాంగ్ రూమ్ లకు తరలించాలన్నారు.అభ్యర్దులకు పరీ క్షల సమయంలో ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఎలాంటి  మాల్ ప్రాక్టిస్ వంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.పరీక్ష కేంద్రాల చుట్టూ జిరాక్స్,కంప్యూటర్ కేంద్రాలను మూసివేసేవిధంగా చూడాలన్నారు.పరీక్ష జరిగే సమయం...

రహదారి ప్రమాదాల నియంత్రణే లక్ష్యం...డాక్టర్ కోయ ప్రవీణ్,కర్నూలు రేంజ్ డిఐజి...

Image
రహదారి ప్రమాదాల నియంత్రణే లక్ష్యం డాక్టర్ కోయ ప్రవీణ్,కర్నూలు రేంజ్ డిఐజి విక్రాంత్ పాటిల్,జిల్లా ఎస్పీ VS9TV న్యూస్,కర్నూలు క్రైం : ప్రతి శనివారం రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పోలీ సు అధికారులకు కర్నూలు రేంజ్ డిఐజి డాక్టర్ కోయ ప్రవీణ్,జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ లు ఆదేశాలు జారీ చేశారు.వాహనదారులు రహదారి భద్రత నియమాలు పాటిస్తే రోడ్డు ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందని  తెలిపారు.ఈ మేరకు శనివారం జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆయా పోలీసుస్టేషన్ పరిధులలో జిల్లా పోలీసు అధికారులు ప్రజలకు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై సమావేశాలు నిర్వహించి,అవగాహన కల్పించారు.మైనర్లు వాహనా లు నడపకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.బైక్ లు నడిపే వారు ఖ చ్చితంగా హెల్మెట్లు ధరించే విధంగా,ఓవర్ స్పీడ్,ఓవర్ లోడ్ తో వాహనాలు వెళ్ళకుండా, డ్రంకెన్ డ్రైవ్ చేయరాదని తదితర రోడ్డు భద్రత ప్రాముఖ్యతలపై ప్రజలకు అవగాహన క ల్పించారు.

దేశంలోకల్లా పింఛన్లు రాష్ట్రంలోనే అధికం...ఇబ్బందులు అధిగమించి మాట ప్రకారం పింఛన్లు...మంత్రి టీజీ భరత్...

Image
దేశంలోకల్లా పింఛన్లు రాష్ట్రంలోనే అధికం ఇబ్బందులు అధిగమించి మాట ప్రకారం పింఛన్లు మంత్రి టీజీ భరత్ VS9TV న్యూస్,కర్నూలు కార్పోరేషన్ : దేశంలోకెల్లా అధిక మొత్తంలో సామాజిక భద్రత పింఛన్లు పంపిణీ చేస్తున్న రాష్ట్రం ఏపీ ఒ క్కటేనని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం,ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. శనివారం 48వ వార్డు అమీర్ హైదర్ నగర్‌లో మంత్రి, నగరపాలక కమిషనర్ యస్.ర వీంద్ర బాబుతో కలిసి పలువురు లబ్దిదారులకు పింఛన్ల పంపిణీ చేశారు.పింఛన్ల నగదు సక్రమంగా జరుగుతుందా? లేదా? అని లబ్దిదారులను ఆరా తీశారు.స్థానిక సమస్యలను అడిగి తెలుసుకుని,వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. బి.నాగమ్మ,సందేపోగు సుకుమార్‌,వడ్డే లక్ష్మీదేవి‌,యు.లక్ష్మన్నలకు వృద్ధాప్య,కే.డ్యాని, వి.రామకృష్ణలకు దివ్యాంగుల పించన్లు అందజేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు తూ...ఆదాయం సమకూర్చుకోలేని వివిధ వర్గాల ప్రజలను దృష్టిలో ఉంచుకుని,ఎన్ని ఆర్థి క ఇబ్బందులు ఉన్నా, వారికి క్రమం తప్పకుండా ప్రతి నెలా 1వ తేదీ,ఆరోజు సెలవు రోజు ఉంటే ఒకరోజు ముందే పింఛన్ల నగదు ఇచ్చేలా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని పే ర్కొన్నారు.ఎన్న...

ఐపిఎల్ క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడుతున్న ఏడు మంది అరెస్ట్...రూ.91లక్షల నగదు స్వాధీనం,ఏడు మొబైల్ ఫోన్ లు సీజ్...విక్రాంత్ పాటిల్,కర్నూలు జిల్లా ఎస్పీ...

Image
ఐపిఎల్ క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడుతున్న ఏడు మంది అరెస్ట్ రూ.91లక్షల  నగదు స్వాధీనం,ఏడు మొబైల్ ఫోన్ లు సీజ్ విక్రాంత్ పాటిల్,కర్నూలు జిల్లా ఎస్పీ VS9TV న్యూస్,కర్నూలు క్రైం : కర్నూలు జిల్లా,వ్యాస్ ఆడిటోరియంలో గత నెలలో జరిగిన జిల్లా ఎస్పీ నేర సమీక్ష సమా వేశంలో బాగంగా చాలామంది యువకులు క్రికెట్ బెట్టింగ్ ను ఆన్ లైన్ లో ఆడుతూ, బెట్టింగ్ కు వ్యసనపరులుగా మారి డబ్బులు పోగొట్టుకోవడమే కాకుండా అప్పులు చేసి మ రీ,ఆ అప్పులు తీర్చలేక ఇంట్లో తల్లితండ్రులకు చెప్పుకోలేక,తమ భవిష్యత్తు పై వారి తల్లి తండ్రులు పెట్టుకున్న ఆశలను అడియాశలు చేస్తూ ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉండడం వలన ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుచున్నాయని బెట్టింగ్ ను ఎలాగైనా అరికట్టాలని జి ల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాలు జారీ చేశారు.ఈ మేరకు, ఆదోని డిఎస్పి ఎం.హేమ లత సూచనల మేరకు ఆదోని వన్ టౌన్ సిఐ కె.శ్రీరామ్, స్టేషన్ సిబ్బంది రాబడిన సమా చారం మేరకు ఈ నెల 18వ తేదీన ఆదోని వాల్మీకి నగర్ లోని వాల్మీకి గుడికి ఎదురుగా మొబైల్ ఫోన్ లలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాపై దాడి చేసి ఎస్.ఆర్.నాగరాజు ను అదుపులోనికి తీసుకోగా మిగిలిన ముద్దాయులు పారిప...

ప్రభుత్వ ఆర్భాటాలతో విద్యార్థులకు నష్టం...ఎస్ ఎఫ్ ఐ...

Image
ప్రభుత్వ ఆర్భాటాలతో విద్యార్థులకు నష్టం ప్రభుత్వ లోపాలను ఉపాధ్యాయులపై నెట్టొద్దు రివాల్యువేషన్ ఫీజులను తిరిగి విద్యార్థులకు చెల్లించాలి ఎస్ ఎఫ్ ఐ VS9TV న్యూస్,కర్నూలు ఎడ్యుకేషన్ : పదవ తరగతి పరీక్షల మూల్యాంకనంలో ప్రభుత్వం ఆర్భాటాలకు పోయి విద్యార్ధుల జీ వితాలతో చెలగాటం ఆడుతూ,ఉపాధ్యా యులను భాద్యుల్ని చేయడాన్ని భారత వి ద్యార్థి ఫెడరేషన్‌ (ఎస్‌ఎఫ్‌ఐ) తీవ్రంగా ఖండి స్తుందని కర్నూలు నగర అధ్యక్ష కార్యదర్శు లు అబూబకర్,సాయి ఉదయ్ లు శనివారం ఒక ప్రకటనలో తెలిజయజేశారు.విద్యా సం స్కరణల పేరుతో చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఏడు రోజుల్లో 10వ తరగతి పరిక్ష ఫలి తాలు ఇచ్చారని విద్యా శాఖ మంత్రి ఆర్భాటం చేస్తున్నారన్నారు.ఎవరి ప్రయోజనాల కో సం ఇంత హడావిడిగా ఫలితాలు ఇవ్వాల్సి వచ్చిందని ప్రశ్నించారు.ఇంటర్‌ తరగతులను హడావిడిగా ప్రారంభించి కార్పోరేట్లకు కొమ్ముకాయడమే కోసమే ఈ చర్యలు తీసుకోవ డమని ఎద్దేవా చేశారు.ప్రభుత్వం యొక్క లోపాలను ఉపాధ్యాయుల మీదకు నెట్టివేయ డం ఎంతవరకూ సమంజసం అని అన్నారు.15రోజులు మూల్యాంకనం చేసి ఫలితాలు ఇవ్వాల్సింది పోయి హడావిడిగా ఉపాధ్యాయులపై ఒత్తిడి తీసుకొచ్చి వారం రోజుల్లోనే ప లితాలు ఇవ్వడం గొప్పల...

నేడు జరగబోయే కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు...విక్రాంత్ పాటిల్,కర్నూలు జిల్లా ఎస్పీ...

Image
నేడు జరగబోయే కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు అన్ని పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట భద్రత సీసీ కెమరాలు,డ్రోన్ కెమెరాలతో  పర్యవేక్షణ పరీక్ష ప్రారంభానికి ఒక గంట ముందే అభ్యర్దులు  పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి హాల్ టికెట్ తో పాటు ఆధార్ కార్డు లేదా  ఇతర గుర్తింపు కార్డు తప్పనిసరిగా ఉండాలి కర్నూలు కేంద్రంలో మొత్తం 16పరీక్షా కేంద్రాలు ఏర్పాటు పరీక్షకు హాజరు కానున్న మొత్తం 7,588 మంది అభ్యర్ధులు విక్రాంత్ పాటిల్,కర్నూలు జిల్లా ఎస్పీ VS9TV న్యూస్,కర్నూలు క్రైం : ఆంధ్రప్రదేశ్ పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డు రాష్ట్ర వ్యాప్తంగా జూన్,1వ తేది ఆదివారం పోలీసు కానిస్టేబుల్ (సివిల్,ఎ పిఎస్పీ) అభ్యర్ధులకు మెయిన్స్ రాత పరీక్షలను కర్నూలు పట్టణంలోని  16పరీక్షా కేంద్రాలలో పరీక్షలు నిర్వహిస్తు న్నారు.ఈ సంధర్బంగా కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు రాత పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటో రియంలో శనివారం విలేకరుల సమావేశంలో తెలిపారు.ఈ పరీక్ష ఉదయం 10-00 గంటల నుండి మధ్యాహ్నాం 1-00గంట వరకు ఉంటుందన్నారు.పరీక్ష రాసే అభ్యర్దులకు జిల...

డీఎస్సీ హాల్ టికెట్ల డౌన్లోడ్ సమస్యను వెంటనే పరిష్కరించాలి...డివైఎఫ్ఐ...

Image
డీఎస్సీ హాల్ టికెట్ల డౌన్లోడ్ సమస్యను  వెంటనే పరిష్కరించాలి... డివైఎఫ్ఐ VS9TV న్యూస్,కర్నూలు ఎడ్యుకేషన్ : డీఎస్సీ హాల్ టికెట్ల డౌన్లోడ్ సమస్యను వెంటనే పరిష్కరించాలని డివైఎఫ్ఐ జిల్లా కార్య దర్శి నగేష్,జిల్లా ఉపాధ్యక్షులు అబ్దుల్లాలు డిమాండ్ చేశారు.శనివారం రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ హాల్ టికెట్లను మే,30వ తేదీ నుండి డౌన్లోడ్ చేసుకోమని తెలియజేసింది.కానీ ర కరకాల సమస్యల వల్ల 31వ తేదీ ఉదయం నుండి డౌన్లోడ్ అవుతున్నాయి.అయితే యు హావ్ మే నాట్ సెలెక్ట్ ఎనీ పోస్ట్స్ అని చాలా మందికి చూయించడంతో డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నగేష్,జిల్లా ఉపాధ్యక్షులు అబ్దుల్లా నిరుద్యోగులతో కలిసి సెయింట్ క్లారెట్ స్కూల్లో నంద్యాల,కర్నూలు డిఈఓ లను కలిసి సమస్యను వివరించారు.వారు ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకంత సమస్య పరిష్కారం అవుతుందని తెలిపారు.ఈ సంద ర్బంగా వారు మాట్లాడుతూ డీఎస్సీ అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు అప్లై చేసు కున్న వారికి ఒక పోస్టుకు మాత్రమే తేదీ సమయం చూపిస్తుంది.మిగిలిన పోస్టులకు హా ల్ టికెట్లో ఎప్పుడు పరీక్ష ఉంటుంది.సెంటర్ సమయం వివరాలు తెలియట్లేదు.కావున వెంటనే అప్లై చేసుకున్న అభ్యర్థులందరికీ అన్నీ పరీక...

పదవి వీరమణ పొందిన డిపిఓ ఎఓ, సిఐ,ఎస్సైలు,ఎఎస్సైలకు ఘన సన్మానం...విక్రాంత్ పాటిల్,కర్నూలు జిల్లా ఎస్పీ...

Image
పదవి వీరమణ పొందిన డిపిఓ ఎఓ,  సిఐ,ఎస్సైలు,ఎఎస్సైలకు ఘన సన్మానం విక్రాంత్ పాటిల్,కర్నూలు జిల్లా ఎస్పీ VS9TV న్యూస్,కర్నూలు క్రైం : సుధీర్ఘకాలం పోలీసుశాఖలో పని చేసి పోలీసు సిబ్బంది  పదవి వీరమణ పొందడం అభి నందనీయమని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. శనివారం పదవీ  వి రమ ణ పొందిన కర్నూలు డిపిఓ ఎఓ-ఎ.విజయ్ కుమార్ నాయుడు,సిఐ–జి.సుగుణ కుమా రి,కర్నూలు సిసియస్ ఎస్సై–రావూఫ్, కర్నూలు స్పెషల్ బ్రాంచ్  ఎస్సై-ఎ.కొండయ్య, క ర్నూలు పిసిఆర్ ఎస్సై–బి.ఉమాపతి,కర్నూలు పిసిఆర్ ఎస్సై–ఎస్.పి.మహబూబ్ భాష, ఆదోని తాలుకా ఎఎస్సై-కె.జి.ఎల్ నారాయణలను  జిల్లా పోలీసు కార్యాలయంలో శని వారం జిల్లా ఎస్పీ శాలువ,పూలమాలతో సత్కరించి,జ్ఞాపికను అందజేశారు.ఈ సంద ర్బంగా ఎస్పీ మాట్లాడారు. కుటుంబాలతో సంతోషంగా గడపాలని,పదవివీరమణ పొంది న తర్వాత ఏమైనా సమస్యలుంటే నేరుగా జిల్లా ఎస్పీని సంప్రదించవచ్చని తెలిపారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్  హుస్సేన్ పీరా,స్పెష ల్ బ్రాంచ్ సిఐ తేజమూర్తి,డి సిఆర్ బి సిఐ గుణశేఖర్ బాబు,ఆర్ ఐ నారాయణ,స్పెషల్ బ్రాంచ్ ఎస్సై వేణుగోపాల్ రా జు,జిల్లా పోలీసు అధికారుల సంఘం అధ...

ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు రెండవ గేట్ ఓపెన్...ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకే...ఆస్పత్రిలో పార్కింగ్ స్థలాలు గుర్తింపు...డా.కె.వెంకటేశ్వర్లు,ఆసుపత్రి సూపరింటెండెంట్...

Image
ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు రెండవ గేట్ ఓపెన్ ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకే...  ఆస్పత్రిలో పార్కింగ్ స్థలాలు గుర్తింపు డా.కె.వెంకటేశ్వర్లు,ఆసుపత్రి సూపరింటెండెంట్ VS9TV న్యూస్,కర్నూలు హాస్పిటల్ : కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఆస్పత్రికి చికిత్స నిమిత్తం వచ్చే రోగులు...ఎటువం టి ఇబ్బంది పడరాదన్న సదుద్దేశంతో ఆస్పత్రి రెండవ గేట్ ను ఓపెన్ చేస్తున్నామని,దీంతో కొంత ట్రాఫిక్ సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉందని ,ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.కె.వెంకటేశ్వర్లు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.రోగులకు వేగంగా...మెరుగైన వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో  సోమవారం నుంచి ఆస్పత్రి రెండవ గేట్ ( ఇన్) ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.ఆస్పత్రిలో పార్కింగ్ స్థలాలు లేక కొన్నేళ్లుగా రోగులు...వైద్య సిబ్బంది ఇబ్బంది పడుతున్నారని,ఇక నుంచి పార్కింగ్ సమస్య తలెత్త కూడదని పార్కింగ్ స్థలాలను కూడా గుర్తించామని,వాటిని అభివృద్ధి చేసిన తరువాత అందుబాటులోకి తీసు కొస్తామని వెల్లడించారు.రోగికి ఐడీ కార్డు...వివిధ వ్యాధుల నిమిత్తం వచ్చే రోగులకు ఆ యుష్మాన్ భారత్ హెల్త్ ఐడి కార్డ్, ఆధార్ కార్డు లింక్ అయినా ఫోన్ వారి వెంట తీసు...

కేటీఆర్ కు వరుస షాకులిస్తున్న కవిత...నిరసనలకు పిలుపు...

Image
కేటీఆర్ కు వరుస షాకులిస్తున్న కవిత నిరసనలకు పిలుపు VS9TV న్యూస్,తెలంగాణ ప్రతినిధి : కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడంపై కవిత ఫైర్ అయ్యారు.ఐదో తేదీన కే సీఆర్ కమిషన్ ముందు హాజరవనున్నారు.నాలుగోతేదీన భారీగా నిరసనలు చేపట్టాలని కవిత నిర్ణయించారు.అయితే ఈ నిరసనలు ఏవీ బీఆర్ఎస్ తరపున ఆమె పిలుపునివ్వ లేదు.తెలంగాణ జాగృతి తరపునే నిరసనలకు పిలుపునిచ్చారు. ఆమె ఎక్కడికి వెళ్లినా బీఆ ర్ఎస్ నేతలు స్వాగతించడం లేదు...కనీసం సమావేశం అయ్యేందుకు రావడం లేదు. పూర్తిగా సొంత క్యాడర్,అనుచరులతోనే ప్రస్తుతానికి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.కే సీఆర్ కు నోటీసులు ఇస్తే.. కేటీఆర్ ఓ ట్వీట్ వేసి సర్దుకున్నారని అదే కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు వస్తే మాత్రం ధర్నాలకు పిలుపునిచ్చారని కవిత రెండు రోజుల కిందట వ్యాఖ్యా నించారు.ఇప్పుడు కేసీఆర్ కోసం ఆమె రంగంలోకి దిగారు. కేసీఆర్ నోటీసులు ఇవ్వడం దుర్మార్గమని ఆరోపిస్తున్నారు.కవిత నిరసనల వ్యవహారం బీఆర్ఎస్ లోనూ హాట్ టాపిక్ అయ్యే అవకాశం ఉంది.ఎందుకంటే కేసీఆర్ కు వచ్చిన కాళేశ్వరం కమిషన్ నోటీసుల గు రించి ఎవరూ పెద్దగా స్పందించలేదు.నిరసనల దాకా ఆలోచించలేదు.కేసీఆర్ కు నోటీ సులు ఇస్తే స్...

శ్రీ కాళహస్తిలో హీరో శ్రీకాంత్ న‌వ‌గ్ర‌హ పూజ‌లు...వేద‌పండితుడు స‌స్పెన్ష‌న్...

Image
శ్రీ కాళహస్తిలో హీరో శ్రీకాంత్ న‌వ‌గ్ర‌హ పూజ‌లు వేద‌పండితుడు స‌స్పెన్ష‌న్ VS9TV న్యూస్,తిరుపతి :  ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తి ఆలయ వేద పండితుడిపై సస్పెన్షన్ వేటు పడింది.సినీ న టుడు శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేటుగా నవగ్రహ శాంతి పూజలు నిర్వహించిన వ్యవహా రంపై శ్రీకాళహస్తి ఆలయ అర్చకుడిపై ఆలయ అధికారులు చర్యలు తీసుకున్నారు.శ్రీకాళ హస్తి పట్టణం సన్నిధి వీధిలోని రాఘవేంద్ర స్వామి మఠంలో ఈనెల 29న హీరో శ్రీకాంత్ కుటుంబం నవగ్రహ శాంతి పూజలు చేయించుకున్నారు.ముక్కంటి ఆలయంలో పనిచేసే కొందరు అర్చకులు,వేద పండితులు శ్రీకాంత్‌కు ప్రైవేటుగా పూజలు నిర్వహించారు.దీనికి సంబంధించిన ఫోటోలు,వీడియోలను సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.ఈ నేపథ్యంలో శ్రీకాంత్ ఫ్యామిలీకి శ్రీకాళహస్తి అర్చకుడు ప్రత్యేకంగా పూజలు చేసిన అం శంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తడం దేవస్థానం ఈఓ బాపిరెడ్డి వెంటనే స్పందిం చారు.ప్రత్యేక పూజలు చేసిన అర్చకుడికి మెమో ఇచ్చారు.శ్రీకాళహస్తి దేవస్థానం ప్రతిష్ట దె బ్బతినే విధంగా ప్రవర్తించినందుకు ఆలయంలో విధులు నిర్వహించిన వేద పండితులను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఈవో ఉత్తర్వులు జారీ చేశారు....

జగన్ అరెస్టుకు ముహుర్తం ఫిక్స్...సన్నిహితులతో సాయిరెడ్డి వెల్లడి...

Image
జగన్ అరెస్టుకు ముహుర్తం ఫిక్స్ సన్నిహితులతో సాయిరెడ్డి వెల్లడి VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి : ఏపీ మద్యం కుంభకోణంపై కూటమి ప్రభుత్వం దూకుడు ప్రదర్శిస్తోంది.ఇప్పటికే ఈస్కాం లో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి,రాజ్ కెసిరెడ్డి,సజ్జల శ్రీధర్ రెడ్డితో పాటు రిటైర్డ్ ఐఏఎస్ ధ నుంజయ్ రెడ్డి,జగన్ మాజీ ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డి,భారతీ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పను నిందితులుగా చేర్చి,వీరిలో కొందరని అరెస్టు చేసి జైలుకు కూడా పంపారు. ఈ నేపథ్యంలో ఇక తదుపరి అరెస్టు మాజీ సీఎం వైఎస్ జగన్ దేనన్న ప్రచారం ముమ్మరం గా సాగుతోంది.దీనిపై ఈ మధ్యే జగన్ కూడా స్పందించారు.అరెస్టుకు భయపడేది లేద ని,తాను విజయవాడలోనే ఉన్నానని జగన్ ఇప్పటికే చెప్పేశారు.ఈ నేపథ్యంలో సీఐడీ వే గంగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.ఈ మేరకు జగన్ ను అరెస్టు చేసేందుకు ప క్కా ప్రణాళిక సిద్దం చేస్తోంది.దీనిపై వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తన సన్నిహి తులకు ఇప్పటికే కీలక సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.ఈ మధ్యే తిరుపతి వెళ్లిన విజ యసాయిరెడ్డి లిక్కర్ స్కాంలో జగన్ ఎప్పుడు అరెస్టు అవుతారో వారికి వెల్లడించినట్లు స మాచారం.విజయసాయిరెడ్డి తన సన్నిహితులతో ప...

రూ.22 లక్షలు విలువజేసే 730కేజీల గంజాయి పట్టివేత...బి.నాగేశ్వర నాయక్,దేవరపల్లి సీఐ...

Image
రూ.22 లక్షలు విలువజేసే 730కేజీల గంజాయి పట్టివేత బి.నాగేశ్వర నాయక్,దేవరపల్లి సీఐ   VS9TV న్యూస్,తూర్పు గోదావరి : లారీలో అక్రమంగా రవాణా చేస్తున్న 730కేజీల గంజాయిని తూర్పు గోదావరి జిల్లా,దే వరపల్లి మండలం, యర్నగూడెంలో పోలీసులు పట్టుకున్నారు.స్వాధీనం చేసుకున్న గం జాయి విలువ సుమారు రూ 22 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.ఇందుకు సం బంధించి దేవరపల్లి సీఐ బీ నాగేశ్వర నాయక్ మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం... హైదరాబాద్ కు చెందిన కర్రే శ్రీశైలం‌ (ఏపీ 16 టీఎక్స్ 5319) లారీలో ఒడిస్సా మల్కా న్ గిరి ప్రాంతానికి వెళ్ళి గంజాయి తీసుకుని హైదరాబాదులో నర్సిరెడ్డి,యాదయ్యలకు రవాణా చేస్తే ఎక్కువ మొత్తంలో డబ్బులు ఇస్తామని ఆశ చూపారు.దీంతో శ్రీశైలం మల్కా న్ గిరి వెళ్ళి గంజాయిని‌ తన లారీ సీక్రెట్ కాబిన్ లో నింపుకున్నాడు. తెలంగాణాకు రవా ణా చేయటానికి హైవే మార్గంలో దేవరపల్లి మీదుగా వెళుతుండగా డైమండ్ జంక్షన్ దాటి న తరువాత గోల్డెన్ ఫిష్ ధాబా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఈ అక్రమ గంజాయి ర వాణా గుట్టు బయటపడింది.గోల్డెన్ ఫిష్ ధాబా దగ్గర హైవే రోడ్డులో బైక్ ను లారీ ఢీకొ ట్టింది.ఈ ప్రమాదంలో బైక్ పై వెళుతున్న జంట అక్కడికక్...

ఫేస్‌బుక్‌లో యువతీతో పరిచయం...ఇంటికి లంచ్‌కు పిలిచి మత్తుమందు ఇచ్చి అత్యాచారం...ఫొటోలు,వీడియోలు తీసి కోటి డిమాండ్...

Image
 ఫేస్‌బుక్‌లో యువతీతో పరిచయం ఇంటికి లంచ్‌కు పిలిచి మత్తుమందు ఇచ్చి అత్యాచారం ఫొటోలు,వీడియోలు తీసి కోటి డిమాండ్ VS9TV న్యూస్,హైదరాబాద్ : హైదరాబాద్,బంజారాహిల్స్‌లో నివసిస్తున్న 24ఏళ్ల యువతికి 2023, ఫిబ్రవరిలో ఫేస్‌ బుక్ ద్వారా పరిచయమైన మహేంద్రవర్ధన్ అనే వ్యక్తి ఇద్దరు కొన్నాళ్లు ఫోన్లో మాట్లాడుకు న్న అనంతరం...అదే ఏడాది ఆగస్టు,15న ఆమెను తన ఇంటికి భోజనానికి ఆహ్వానించా డు.ఇంటికొచ్చిన ఆమెకు మాటల్లో పెట్టి మత్తుమందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు.ఆ దారుణం అంత ఫొటోలు,వీడియోలు తీసి...మర్నాడు ఉదయం నిద్రలోంచి మేల్కొన్న ఆ మెకు ఆ ఫొటోలు,వీడియోలు చూపించి...తనకు రూ.20లక్షలు ఇవ్వాలని,లేదంటే వా టిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బెదురింపులకు గురిచేశాడు.దీంతో అతడు అడిగిన ఆ మొత్తాన్ని యువతి ఇచ్చింది.కాగా మరి కొన్నాళ్లుగా తనకు కోటి ఇవ్వాలంటూ బాధితురాలిని డిమాండ్ చేశాడు.ఈ నేపథ్యంలో యువతీ తాను అంత ఇచ్చుకోలేనని వే డుకున్నా...ఫొటోలు,వీడియోలు నెట్లో పెడతానంటూ బెదిరించడంతో బాధితురాలు పో లీసులకు ఫిర్యాదు చేసింది.కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

దాబాలో మూడు కోట్ల విలువైన డ్రగ్స్‌, హెరాయిన్‌ పట్టివేత...ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు...

Image
దాబాలో మూడు కోట్ల విలువైన డ్రగ్స్‌, హెరాయిన్‌ పట్టివేత ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు VS9TV న్యూస్,హైదరాబాద్ : డ్రగ్స్‌ను ఎక్కడికి అక్కడ కట్టడి చేస్తున్నామని అధికారులు చెప్తున్నారు.కానీ గ్రామ స్థాయి ల వరకు డ్రగ్స్ వాడకం పెరిగిపోయిందని అధికారులు గుర్తించలేకపోతున్నారు.ఏకంగా జాతీయ రహదారుల వెంబడి ఉన్న దాబాలు హోటల్స్‌లో ఈ డ్రగ్స్ విచ్చలవిడిగా దొరు కుతుంది.హైదరాబాద్ శివారు ప్రాంతంలోని దాబాలలో డ్రగ్స్ విచ్చలవిడిగా అమ్ముతున్నా రు.మధ్యప్రదేశ్‌కు చెందిన ఒక మార్వాడి కొన్నాళ్ల క్రితం షాద్‌నగర్ ప్రాంతానికి వచ్చి దా బా ఏర్పాటు చేసుకున్నాడు.మధ్యప్రదేశ్ నుంచి పెద్ద మొత్తంలో డ్రగ్స్‌ని తీసుకువచ్చి తన కస్టమర్లకు అమ్ముతుండేవాడు.ఇటీవల కాలంలో సదరు డాబా యజమాని చనిపోయా డు.అయితే అందులో కుక్ గా చేరి చివరికి మేనేజర్ స్థాయికి చేరుకున్నారు. డ్రగ్స్ ను మధ్యప్రదేశ్ నుంచి తెప్పించి అమ్మడం మొదలు పెట్టాడు.ఎవరికి ఎలాంటి డ్రగ్స్ కావాలన్నా ఈజీగా అమ్మేస్తున్నారు.సైబరాబాద్ పోలీసులకు వచ్చిన సమాచారంతో దా బాపైని ఘా పెట్టి డ్రగ్స్ పట్టుకున్నారు.ఏకంగా కిలోన్నర హెరాయిన్‌తో పాటు గంజాయి, ఓపి యంతో పాటు మరికొన్ని రకా...

ట్రేడింగ్ స్కాంలతో వేల కోట్లు మాయం...

Image
ట్రేడింగ్ స్కాంలతో వేల కోట్లు మాయం VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి : స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ చేస్తారు.లక్షకు లక్ష వస్తాయని ఆశ పడి పోలోమంటూ వంద ల మంది పెట్టుబడి పెట్టారు. దాదాపుగా రూ.150కోట్లు వసూలు చేసిన ట్రేడింగ్ మోసగా ళ్లు రాత్రికి రాత్రి జెండా ఎత్తేశారు.ఈ మోసం హైదరాబాద్‌లోని జీడిమెట్ల పరిధిలో మధ్య తరగతి ప్రజలు నివాసం ఉండే కాలనీలో జరిగింది.ఓ చిన్న కాలనీని టార్గెట్ చేసుకుని చేసిన మోసంలోనే రూ.150 కోట్లు దోచుకెళ్లిపోయారు.ఇక దేశంలో ఎన్ని ఇలాంటి మోసాలు జరుగుతున్నాయో చెప్పడం కష్టం.ఈ స్కామ్స్ పరిధి వేల కోట్లలోనే ఉంటుం ది. ట్రేడింగ్ పేరుతో విస్తృతంగా ప్రచారం : ప్రతి ఒక్కరి వాట్సాప్ కు...ఇప్పుడు ట్రేడింగ్ గ్రూపులు తయారయ్యాయి. అవసరం లేక పోయినా...ఆసక్తి చూపకపోయినా...ఉచిత ట్రేడింగ్ చిట్కాలంటూ వాట్సాప్ గ్రూపుల్లో యాడ్ చేస్తున్నారు.ఆ మాయలో పడి చివరికి డబ్బులు పోగొట్టుకుంటున్నారు.మల్టీ బ్యాగ ర్ స్టాక్స్ అని...రోజువారీ ట్రేడింగ్ లాభాలు అని ఆశ చూపి వారి సొమ్ము కాజేస్తున్నారు. మొదట్లో చిన్న మొత్తాల్లో లాభాలు ఇచ్చి భారీగా వసూలు చేశాక జెండా ఎత్తేస్తున్నారు.ఈ తరహా మోసాలు పెరిగిపోవడంతో పోలీసులు కూడా అ...

తిరుమలలో భక్తుల ఆందోళన...

Image
తిరుమలలో భక్తుల ఆందోళన VS9TV న్యూస్,తిరుమల : తిరుమలలో గత శుక్రవారం అర్ధరాత్రి భక్తులు ఆందోళనకు దిగారు.సర్వదర్శనం కోసం వే చి ఉన్న భక్తులు తమకు సరైన సౌకర్యాలు కల్పించడం లేదని ఒక్కసారిగా నినాదాలు చే శారు.‘‘టీటీడీ చైర్మన్ డౌన్ డౌన్, ఈవో డౌన్ డౌన్’’ అంటూ క్యూ లైన్లలో వేచిఉన్న భ క్తులు నిరసన తెలిపారు.దీంతో టీటీడీ అదనపు ఈఓ వెంకయ్య చౌదరి వెంటనే వారికి కావాల్సిన సౌకర్యాలను కల్పించారు.గోవింద నామస్మరణ జరగాల్సిన వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో టీటీడీ చైర్మన్ డౌన్ డౌన్ అనే నినాదాలు వినిపిస్తున్నాయి.పసిపిల్లలకు పా లు,ఆహారం ఇవ్వాలని భక్తులు దేవుని సన్నిధిలోనే ఆందోళన చేస్తున్నారు.ఇలాంటి పరి స్థితి తిరుమలలో ఎప్పుడూ లేదు.టీటీడీ చైర్మన్ అసమర్ధత పట్ల ప్రజలే ముందుకు వచ్చి ధై ర్యంగా నిరసన తెలుపుతున్నారు.

నకిలీ ఫోన్ పే యాప్ తో ఘరానా మోసం...స్కానర్ ద్వారా డబ్బులు తీసుకునేవారు తమ అకౌంట్ తప్పకుండా చెక్ చేసుకోవాలి...

Image
నకిలీ ఫోన్ పే యాప్ తో ఘరానా మోసం స్కానర్ ద్వారా డబ్బులు తీసుకునేవారు  తమ అకౌంట్ తప్పకుండా చెక్ చేసుకోవాలి VS9TV న్యూస్,మంచిర్యాల క్రైం : మంచిర్యాల జిల్లా,మందమర్రి పట్టణంలో ఘరానా మోసం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిం ది.పూర్తి వివరాల్లోకి వెళితే....కొన్ని నెలల క్రితం మందమర్రి పాత బస్టాండులో ఒక వ్యక్తి సూపర్ మార్కెట్లోకి వచ్చే నిత్యవసర సరుకులను కొనడం జరిగింది.బిల్లు రూ.1000 రూ పాయలు కాగా సరుకులు కొన్న వ్యక్తి ఫోన్ పే స్కానర్ ద్వారా పే చేసినట్లు,తన ఖాతా లో నుండి డబ్బులు కట్టయినట్టు ఆ సూపర్ మార్కెట్ యజమానికి చూపించాడు. సరుకు లు తీసుకెళ్లాడు.కొంత సమయం తర్వాత యజమానికి అనుమానం వచ్చి తన అకౌంట్లో చెక్ చేసుకోగా సూపర్ మార్కెట్ యాజమాని ఖాతాలోకి డబ్బులు రాకపోయేసరికి తను నకిలీ కేటుగాళ్ల వలలో పడి మోసపోయినానని గ్రహించారు.చుట్టు ప్రక్కల స్థానికులకు విషయం తెలిస్తే షాపు పరువు పోతుందన్న భయంతో యజమాని కొన్ని నెలల వరకు ఎవరికీ విషయాన్ని తెలియని ఇవ్వకపోవడంతో విషయం ఆలస్యంగా బయటకు వచ్చిం ది.అధికారులు ప్రజలకు పదేపదే ఈ నకిలీ ఫోన్ పే యాప్,సైబర్ మోసాలకు పాల్పడు తున్న కేటుగాళ్ల వలలో పడకుండా జాగ్రత్తలు వహించాలని హెచ్చరి...

ప్రతి పౌరుడు రాజ్యాంగంపై అవగాహన పెంచుకోవాలి...పౌరుల హక్కులు రాజ్యాంగం ద్వారానే కాపాడబడుతాయి...డాక్టర్ వి.బ్రహ్మారెడ్డి,జన విజ్ఞాన వేదిక వ్యవస్థాపక సభ్యులు...

Image
ప్రతి పౌరుడు రాజ్యాంగంపై అవగాహన పెంచుకోవాలి పౌరుల హక్కులు రాజ్యాంగం ద్వారానే కాపాడబడుతాయి జె.వి.వి కార్యకర్తలు సామాజిక అంశాలు,   శాస్ర్తీయ దృష్టితో పరిష్కారాల కోసం ప్రయత్నం చేయాలి డాక్టర్ వి.బ్రహ్మారెడ్డి,జన విజ్ఞాన వేదిక వ్యవస్థాపక సభ్యులు VS9TV న్యూస్,కర్నూలు హాస్పిటల్ : ప్రతి పౌరుడు రాజ్యాంగంపై అవగాహన పెంచుకోవాలని,పౌరుల హక్కులు రాజ్యాంగం ద్వారానే కాపాడబడుతాయని,ఇందుకోసం జన విజ్ఞాన వేదిక (జె.వి.వి) కార్యకర్తలు సా మాజిక అంశాలు,శాస్ర్తీయ దృష్టితో పరిష్కారాల కోసం ప్రయత్నం చేయాలని జన విజ్ఞా న వేదిక వ్యవస్థాపక సభ్యులు డాక్టర్ వి బ్రహ్మారెడ్డి అన్నారు.శుక్రవారం స్థానిక బిర్లా కాం పౌండ్ యందు వివిధ జిల్లాల నుండి వచ్చిన వేదిక కార్యకర్తలకు మూడు రోజుల రాష్ట్ర స్థా యి శిక్షణా  కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ వేదిక కార్యకర్తలకు శాస్త్రీయ దృక్పథం అవసరమని అందుకే మూడు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అ ని తెలిపారు.జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు బర్మా సురేష్ కుమార్ మాట్లాడుతూ వేదిక విద్య,ఆరోగ్యం,పర్యావరణం,మహిళా సాధికారత మూఢనమ్మకాల లాంటి అంశాలపై ప నిచేస్తుందని అన్నారు.రా...

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర డిజిపి హరీష్ కుమార్ గుప్తా...

Image
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర డిజిపి హరీష్ కుమార్ గుప్తా VS9TV న్యూస్,తిరుపతి : తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శుక్రవారం ఉదయం రాష్ట్ర డిజిపి హరీష్ కుమార్ గుప్తా స్వామివారిని దర్శించుకున్నారు.అనంతరం టీటీడీ ఈఓ వెంకయ్య చౌదరి డిజిపికి స్వామివారి రంగనాయకుల మండపంలో తీర్థప్రసాదాలు స్వామివారి చిత్రపఠం బహూక రించారు.ఈ ఆలయ సందర్శనలో తిరుపతి జిల్లా ఎస్పీ విష్ణువర్ధన్ రాజు,టెంపుల్ డిప్యూ టీ ఈఓ లోకనాథం,తదితరులు పాల్గొన్నారు.

దేవాలయం భూములను కొల్లగొట్టేందుకు కూటమి ప్రభుత్వం చీకటి జీఓ తీసుకోస్తుంది...ఎస్వీ మోహన్ రెడ్డి,వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు,మాజీ ఎమ్మెల్యే...

Image
దేవాలయం భూములను కొల్లగొట్టేందుకు  కూటమి ప్రభుత్వం చీకటి జీఓ తీసుకోస్తుంది ఎస్వీ మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు,మాజీ ఎమ్మెల్యే VS9TV న్యూస్,కర్నూలు క్రైం : దేవాలయం భూములను కొల్లగొట్టేందుకు కూటమి ప్రభుత్వం చీకటి జీఓ తీసుకోస్తున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి ఆ రోపించారు.ఈ మేరకు నగరంలోని ఎస్ వి కాంప్లెక్స్ లో శుక్రవారం విలేకరుల సమావే శం ఏర్పాటుచేశారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఈ జిఓను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు.న్యాయపోరాటానికి తాము సిద్ధంగా ఉన్నాం. ప్రజలను సమీకరించి ఆందోళన నిర్వహిస్తామని చెప్పారు.రాష్ట్ర ప్రభుత్వానికి ఎండోమెం ట్ భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు ఎటువంటి హక్కు లేదు.దేవుడినే ద్రోహం చేసేందుకు చంద్రబాబు,కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోందన్నారు.దీనిపై ప్రతి ఒక్కరు స్పందించాలని పిలుపునిచ్చారు.పప్పులు,బెల్లం అని దేవాలయా భూములను పంచుకుం టే తాము ఊరుకోమన్నారు.క్యాబినెట్ లో ఈ నిర్ణయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యతిరేకించాలి.దేవాలయం భూము...

ట్రంప్ టారిఫ్‌లను నిలిపివేసిన అమెరికా కోర్టు...చెల్లించిన సుంకాలను వడ్డీతో తిరిగి ఇస్తారా? ఇప్పుడేం జరగనుంది?...

Image
ట్రంప్ టారిఫ్‌లను నిలిపివేసిన అమెరికా కోర్టు చెల్లించిన సుంకాలను వడ్డీతో తిరిగి ఇస్తారా?  ఇప్పుడేం జరగనుంది? VS9TV న్యూస్,న్యూ ఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ విధిస్తున్న భారీ సుంకాలను అమెరికాలోని ఓ ఫెడరల్ కోర్టు అడ్డుకుంది.ఇది ట్రంప్ ఆర్థిక విధానాలలో కీలకాంశానికి ఎదురుదెబ్బ.వైట్‌హౌస్ అ త్యవసరంగా అమలుచేసిన చట్టం దాదాపు ప్రతి దేశంపై సుంకాలు విధించడానికి అధ్య క్షుడికి ఏకపక్ష అధికారాన్ని ఇవ్వలేదని ‘ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ ట్రేడ్’ పేర్కొంది.ఇతర దే శాలతో వాణిజ్య నియంత్రణకు అమెరికా రాజ్యాంగం కాంగ్రెస్‌కు ప్రత్యేక అధికారాలు దా ఖలు పరిచిందని,అయితే ఆర్థిక వ్యవస్థ రక్షణకు అధ్యక్షుడికి ఉన్న అధికారం దీనిని అధిగ మించలేదని ఈ కోర్టు పేర్కొంది.ఈ తీర్పు వెలువడిన కొన్ని నిమిషాలలో ట్రంప్ ప్రభు త్వం అప్పీల్‌ దాఖలు చేసింది.సుంకాలను నిలిపివేసేందుకు అధికార ప్రక్రియను పూర్తి చే యడానికి ఈ తీర్పు వైట్‌హౌస్‌కు పది రోజుల సమయం ఇచ్చింది.అయితే వీటిలో చాలా సుంకాలు ఇప్పటికే తాత్కాలికంగా నిలిపివేశారు.మరోవైపు అక్రమ వలసదారులు,మాద కద్రవ్యాల ప్రవాహం ఆమోదయోగ్యం కాదంటూ ట్రంప్ ప్రభుత్వం చైనా,మెక్సికో, కెనడా లపై ...

అమర్నాథ్ యాత్ర భద్రతకు 42 వేల మంది సాయుధ బలగాలు...

Image
అమర్నాథ్ యాత్ర భద్రతకు 42 వేల మంది సాయుధ బలగాలు VS9TV న్యూస్,న్యూ ఢిల్లీ : ప్రతిష్ఠాత్మకమైన అమర్ నాథ్ యాత్ర భద్రత కోసం 581కంపెనీల కేంద్ర సాయుధ పో లీసు బలగాలను మోహరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.ఇందులో CRPF, CISF, BSF, ITBP,ఎస్ఎస్ఓలకు చెందిన 42,000 మంది జవాన్లు యాత్ర మా ర్గంలో భద్రతను పర్యవేక్షిస్తారు. అమర్నాథ్ యాత్ర జులై,3న మొదలై ఆగస్టు,9న ముగు స్తుంది.మొత్తం 38 రోజుల పాటు యాత్ర కొనసాగనుంది.

పంచాయతీ రాజ్ శాఖ చీఫ్ ఇంజనీర్ ఇంట్లో ACB దాడులు...అపార్ట్మెంట్ కిటీకీ నుంచి రూ.500కోట్లు విసిరేసిన ఇంజినీర్...

Image
పంచాయతీ రాజ్ శాఖ చీఫ్ ఇంజనీర్ ఇంట్లో ACB దాడులు అపార్ట్మెంట్ కిటీకీ నుంచి రూ.500 కోట్లు విసిరేసిన ఇంజినీర్ VS9TV న్యూస్,ఒడిస్సా : ఒడిశాలో సంచలనం సృష్టించిన ఘటనలో,పంచాయతీ రాజ్ శాఖ చీఫ్ ఇంజనీర్ బైకుంఠ నాథ్ సారంగి ఇంట్లో ఏసీబీ సోదా లు నిర్వహించింది.ఆయన అక్రమాస్తులు కలిగి ఉన్నాడని ఆరోప ణలు రావడంతో అధికారులు తనిఖీలు చేపట్టారు.ఈ సమయం లో సారంగి తన ఫ్లాట్ కిటికీ నుండి రూ.2 కోట్ల నగదును బయ టకు విసిరేశాడు.విజిలెన్స్ అధికారులు రూ.2.1కోట్ల నగదు, బంగారం,భూమి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.ఈ ఘటన భు వనేశ్వర్ లో కలకలం రేపింది.

నకిలీ పత్తి విత్తనాల తయారీ కేంద్రంపై ఆకస్మిక దాడులు...రూ.14లక్షల విలువ చేసే 560 కేజీల నకిలీ విత్తనాలు పట్టివేత...తొమ్మిది మంది అరెస్ట్...రిమాండ్ కు తరలింపు...నకిలీ విత్తనాల కట్టడికి టాస్క్ ఫోర్స్ బృందాలు...సునీల్ దత్,పోలీస్ కమిషనర్...

Image
నకిలీ పత్తి విత్తనాల తయారీ కేంద్రంపై ఆకస్మిక దాడులు రూ.14లక్షల విలువ చేసే 560 కేజీల నకిలీ విత్తనాలు పట్టివేత తొమ్మిది మంది అరెస్ట్...రిమాండ్ కు తరలింపు నకిలీ విత్తనాల కట్టడికి టాస్క్ ఫోర్స్ బృందాలు సునీల్ దత్,పోలీస్ కమిషనర్ VS9TV న్యూస్,ఖమ్మం క్రైం : దేశ ప్రజలకు అన్నం పెట్టే రైతుకు తీరని నష్టం జరుగుతుంది.వారికి జరుగుతున్న అన్యా యం పట్ల ఎవరు స్పందించరు.పండించే పంట పండుతుందో లేదో అనే భయం ఒక వై పు,సరైన సమయానికి వర్షం పడుతుందో లేదో అనే ఆందోళన,చివరకు పండిన పంట కు సరైన గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాల విఫలం కాగా,మరో వైపు నకిలీ విత్త నాలు,నకిలీ ఎరువులతో పంటలు పండక నష్టపోతున్నారు.దీంతో చేసిన అప్పులకు చె ల్లించలేక,కుటుంబాలను పోషించుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న కూడా వారిపై కనికరించక  రైతుల జీవితాలతో చేలగాటమాడుతున్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వాలు సైతం రైతులను ఓటు బ్యాంక్ గానే చూస్తున్నాయి.అనేక హామీలు ఇస్తున్నాయి.కాని రై తుల సమస్యల పట్ల మాత్రం నిర్లక్షం వహిస్తునాయి.ఈ నేపథ్యంలోనే కొందరు అక్రమా ర్కులు రైతులను నిట్టనిలువుగా దోపిడీకి పాల్పడడం దారుణం.రైతు పంట కోసం ఉప యోగించే విత్తనాలను దుకా...

జగన్నాథ గట్టుపై ప్రభుత్వ భూములు పరిశీలన...పి.రంజిత్ బాషా,జిల్లా కలెక్టర్...

Image
జగన్నాథ గట్టుపై ప్రభుత్వ భూములు పరిశీలన పి.రంజిత్ బాషా, జిల్లా కలెక్టర్   .. VS9TV న్యూస్,కర్నూలు కలెక్టరేట్ : కర్నూలు నగర శివారులోని జగన్నాథగట్టు వద్ద వివిధ సంస్థల ఏర్పాటుకు కేటాయించిన ప్రభుత్వ  భూములను,అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను గురువారం జిల్లా కలెక్టర్ పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా  కలెక్టర్ జగన్నాథ గట్టు వద్ద టిడ్ కో గృహాలకు, క్లస్టర్ యూనివర్సిటీ,ఐఐటీడిఎమ్ కు,ఇతర సంస్థల కోసం కేటాయించిన భూములను ప రిశీలించారు.మ్యాపుల ద్వారా వివరాలను అడిగి తెలుసుకున్నారు.వివిధ సంస్థల ఏర్పా టుకు కేటాయించిన భూములకు సంబంధించి సమగ్రమైన వివరాలతో నివేదిక అందచే యాలని  కలెక్టర్ ఆర్డీఓ,తహసీల్దార్లను ఆదేశించారు. సిల్వర్ జూబ్లీ క్లస్టర్  యూనివర్సిటీకి సంబంధించి నిర్మాణ పనులకు పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేసేందుకు ని ధుల విడుదలకు చర్యలు తీసుకోవాలని సంబంధిత ఈఈ కలెక్టర్ దృష్టికి తీసుకొని రాగా,మరొక సారి డిఓ లెటర్ సి ద్ధం చేసి పంపాలని కలెక్టర్ సిల్వర్ జూబ్లీ క్లస్టర్ ఈఈ ను ఆదేశించారు.అనంతరం కర్నూలు నగర శివారులోని జగ న్నాథగట్టు,రూపాల సంగమేశ్వర స్వామి ఆలయం,దర్గాల ను కలెక్టర్ దర్శించు...

మోస్ట్ వాంటెడ్ హీడ్మా అరెస్ట్...

Image
మోస్ట్ వాంటెడ్ హీడ్మా అరెస్ట్ VS9TV న్యూస్,భువనేశ్వర్ : మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు ఎన్కౌంటర్ ఘటన మరువక ముందే మరో కీల క నేతను ఒడిశా పోలీసులు అరెస్టు చేశారు.ఛత్తీస్ గఢ్ బీజాపూర్ జిల్లాలోని జనగూడకు చెందిన కుంజాం హిడ్మాను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.ఒడిశా పోలీసులు, డిస్ట్రిక్ట్ వాలంటరీ ఫోర్స్ బృందాలు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టాయి.ఈ క్రమంలో బోయిపరి గూడ పోలీసు స్టేషన్ పరిధిలోని పెటగూడ గ్రామ సమీపంలోని అడవుల్లో హిడ్మాను పోలీ సులు అరెస్టు చేశారు.ఈ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారని పక్కా సమాచా రం అందడంతో పోలీసులు అక్కడ కూంబింగ్ నిర్వహించినట్లు ఉన్నతాధికారులు పేర్కొ న్నారు.కూంబింగ్ నిర్వహిస్తుండగా పోలీసులకు మావోయిస్టులు తారసపడ్డారు.దీంతో మావోయిస్టులకు, పోలీసు బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి.అ యితే చాలా మంది మావోయిస్టులు అక్కడ్నుంచి పారిపోయారు.మావోయిస్టు కుంజాం హిడ్మా మాత్రం అక్కడున్న చెట్ల పొదల్లో తలదాచుకున్నాడు.పోలీసులు అతన్ని అదుపులో కి తీసుకున్నారు.ఆ తర్వాత అతను హార్డ్కోర్ మావోయిస్టు హిడ్మా అని పోలీసుల విచారణ లో తేలింది.కుంజాం హిడ్మా ప్రస్తుతం ఏరియా కమిటీ మెంబర్ ...

డిఎస్ సీ స్పోర్ట్స్ కోటా స‌ర్టిఫికెట్ ల ప‌రిశీల‌న‌లో క్రీడా సంఘాల‌ను భాగ‌స్వామ్యం చేయాలి...ఏపీ ఒలింపిక్ సంఘం 10వ వార్షిక స‌మావేశం తీర్మానం...

Image
డిఎస్ సీ స్పోర్ట్స్ కోటా స‌ర్టిఫికెట్ ల ప‌రిశీల‌న‌లో  క్రీడా సంఘాల‌ను భాగ‌స్వామ్యం చేయాలి ఏపీ ఒలింపిక్ సంఘం 10వ వార్షిక స‌మావేశం తీర్మానం VS9TV న్యూస్,విజ‌య‌వాడ స్పోర్ట్స్ : రాష్ట్ర ప్ర‌భుత్వం ఇటీవ‌ల విడుద‌ల చేసిన డీఎస్ సీ స్పోర్ట్స్ కోటా టీచ‌ర్ పోస్ట‌ల భ‌ర్తీలో భాగంగా స‌ర్టిఫికెట్ల ప‌రిశీల‌న‌లో రాష్ట్ర క్రీడాప్రాథికార‌సంస్థ (శాప్‌) అధికారుల‌తోపాటు క్రీడా సంఘాల‌ను కూడా భాగ‌స్వామ్యం చేయాల‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఒలింపిక్ సంఘం (ఏపీఓ ఏ) 10వ వార్షిక స‌ర్వ‌స‌భ్య స‌మావేశం (ఏజీఎం) తీర్మానించింది.క్రీడా సంఘాల ప్ర‌తిని ధులు లేకుండా స‌ర్టిఫికెట్ల ప‌రిశీల‌న నిర్వ‌హిస్తే,న‌కిలీ స‌ర్టిఫికెట్‌దారుల‌ను గుర్తించ‌డం క‌ష్ట‌ త‌ర‌మ‌వుతుంద‌ని స‌మావేశం పేర్కొంది.గ‌తంలో క్రీడా సంఘాల భాగ‌స్వామ్యం లేకుండా స్పోర్స్ట్ కోటా అభ్య‌ర్థుల స‌ర్టిఫికెట్‌ల ప‌రిశీల‌న జ‌రిగింద‌ని,ఫ‌లితంగా వంద‌లాది మంది న‌కిలీ స‌ర్టిఫికెట్‌ల‌తో స‌చివాల‌యం ఉద్యోగాలు పొందార‌ని స‌మావేశం తెలిపింది.ఏపీ ఓఏ రాష్ట్ర అధ్య‌క్షుడు ఆర్‌కె పురుషోత్తం అధ్య‌క్ష‌త‌న విజ‌య‌వాడ‌లోని హోట‌ల్ ఐలాపురం లో ఏపీఓఏ 10వ వార్షిక స‌ర్వ‌స‌భ్య స‌మావేశం జ‌రిగింది.ఈ స‌మావేశా...

వరంగల్‌లో నకిలీ కరెన్సీ స్కామ్...

Image
వరంగల్‌లో నకిలీ కరెన్సీ స్కామ్ VS9TV న్యూస్,వరంగల్ క్రైం : వరంగల్ జిల్లా,పర్వతగిరిలో దొంగ నోట్లు కలకలం రేపాయి.స్థానిక దుర్గశ్రీ వైన్స్‌లో గుర్తు తెలియని వ్యక్తులు దొంగ నోట్లతో మద్యం కొనుగోలు చేశారు.ఈ డబ్బును బ్యాంక్‌లో జమ చేయడానికి వైన్స్ వాళ్లు వెళ్లగా..ఒక రూ.500,రూ.100 దొంగ నోట్లను బ్యాంక్ అధికారులు గుర్తించారు. దీనిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. దొంగనోట్ల చలామణితో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.