దాబాలో మూడు కోట్ల విలువైన డ్రగ్స్, హెరాయిన్ పట్టివేత...ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు...
దాబాలో మూడు కోట్ల విలువైన డ్రగ్స్, హెరాయిన్ పట్టివేతఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
VS9TV న్యూస్,హైదరాబాద్ :
డ్రగ్స్ను ఎక్కడికి అక్కడ కట్టడి చేస్తున్నామని అధికారులు చెప్తున్నారు.కానీ గ్రామ స్థాయి ల వరకు డ్రగ్స్ వాడకం పెరిగిపోయిందని అధికారులు గుర్తించలేకపోతున్నారు.ఏకంగా జాతీయ రహదారుల వెంబడి ఉన్న దాబాలు హోటల్స్లో ఈ డ్రగ్స్ విచ్చలవిడిగా దొరు కుతుంది.హైదరాబాద్ శివారు ప్రాంతంలోని దాబాలలో డ్రగ్స్ విచ్చలవిడిగా అమ్ముతున్నా రు.మధ్యప్రదేశ్కు చెందిన ఒక మార్వాడి కొన్నాళ్ల క్రితం షాద్నగర్ ప్రాంతానికి వచ్చి దా బా ఏర్పాటు చేసుకున్నాడు.మధ్యప్రదేశ్ నుంచి పెద్ద మొత్తంలో డ్రగ్స్ని తీసుకువచ్చి తన కస్టమర్లకు అమ్ముతుండేవాడు.ఇటీవల కాలంలో సదరు డాబా యజమాని చనిపోయా డు.అయితే అందులో కుక్ గా చేరి చివరికి మేనేజర్ స్థాయికి చేరుకున్నారు.
డ్రగ్స్ ను మధ్యప్రదేశ్ నుంచి తెప్పించి అమ్మడం మొదలు పెట్టాడు.ఎవరికి ఎలాంటి డ్రగ్స్ కావాలన్నా ఈజీగా అమ్మేస్తున్నారు.సైబరాబాద్ పోలీసులకు వచ్చిన సమాచారంతో దా బాపైని ఘా పెట్టి డ్రగ్స్ పట్టుకున్నారు.ఏకంగా కిలోన్నర హెరాయిన్తో పాటు గంజాయి, ఓపి యంతో పాటు మరికొన్ని రకాల డ్రగ్స్ను కూడా స్వాధీనం చేసుకున్నారు.ఏకంగా డ్రగ్స్ సూపర్ మార్కెట్ను పెట్టేసి అమ్ముతున్నట్లు అధికారులు గుర్తించారు.దాదాపు మూ డు కోట్ల పైచిలుకు విలువచేసే డ్రగ్స్ ను అధికారులు స్వాధీన పరుచుకున్నారు.దాబాలో ని డ్రగ్స్ అమ్ముతుండగానే చూసి ఒక్కసారిగా అధికారులు అవ్వక్కయ్యారు.ప్రస్తుతం సైబ రాబాద్ కమిషనరేట్ లో దీనికి సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు.

Comments
Post a Comment