బాణసంచా తయారీ కేంద్రం భారీ పేలుడు...18 మంది మృతి...
బాణసంచా తయారీ కేంద్రం భారీ పేలుడు 18 మంది మృతి VS9TV న్యూస్,కాకినాడ : కాకినాడ జిల్లా,సామర్లకోట మండలంలోని బాణ సంచా తయారీ పరిశ్రమలో భారీ పేలు డు సంభవించింది.మండ లంలోని వేట్లపాలెం పరిధి గోదావరి కెనాల్ పక్కన ఉన్న సూ ర్యశ్రీ ఫైర్ వర్క్స్ కేంద్రంలో శనివారం భారీ ఒక్కసారిగా పేలుడు సంభవించింది.ఈ ఘట నలో 18మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.భారీ ఎత్తున మంటలు ఎగసిపడ డంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించింది.పేలుడు శబ్దాలు సుమారు ఐదు కి లో మీటర్ల మేర వినిపించాయని స్థానికులు తెలిపారు.శబ్దం తీవ్రతకు పక్క గ్రామంలో ఉ న్న ప్రైవేటు పాఠశాలలో స్లాబ్కు పగుళ్లు వచ్చాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది రెండు ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు.తీ వ్రంగా గాయపడిన ఎనిమిది మందిని అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించారు.పూర్తి వివరా లు తెలియాల్సి ఉంది.