విజయ్ దేవరకొండ,రష్మిక జంటకు...ప్రధాని మోదీ శుభాకాంక్షలు...
విజయ్ దేవరకొండ,రష్మిక జంటకుప్రధాని మోదీ శుభాకాంక్షలు
విజయ్ దేవరకొండ,రష్మిక మందన్నల వివాహం మరో రోజులో (గురువారం) ఉదయ్ పూర్ లో జరుగనున్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో ఇప్పటికే నూతన వధూవరులు, సమీప బంధువులు ఇప్పటికే కల్యాణ వేదికకు చేరుకోగా సినీ,రాజకీయ సెలబ్రిటీలు ఒ క్కొక్కరే అక్కడకు చేరుకుంటున్నారు.హల్దీ,సంగీత్ వంటి వరుస సెలబ్రేషన్స్తో ఫుల్ బి జీగా ఉన్నారు.అయితే...విజయ్,రష్మిక వివాహం సందర్భంగా ప్రధాని మోదీ ఈ జంటకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఓ ప్రకటన విడుదల చేశారు.ఈ లేఖలో...మాధ వి,గోవర్ధన్ రావు దేవరకొండలు పంపిన వివాహ ఆహ్వనం అందినట్లు తెలియచేశారు. దే వర కొండ మందన్న కుటుంబాలకు అభినందనలు తెలిపారు.ఇన్నాళ్లు తెరపై అలరించార ని,ఇకపై విజయ్,రష్మిక జీవితాల్లో ఒక కొత్త అధ్యాయం ఆరంభం అవుతున్నదని,వారు క లకాలం కలసి ఉండాలని,పరస్పర ప్రేమ,ఆలోచనతో బాధ్యతలను పంచుకుని,ఒకరినొక రు అర్థం చేసుకుని,బలాలను తెలుసుకుని,భాగస్వాములుగా జీవన ప్రయాణం కొనసా గించాలని ఆకాంక్షిస్తున్నాను అని అన్నారు.ఈ సందర్భంగా వధూవరులకు,కుటుంబ సభ్యు లకు నా ఆశీర్వాదాలు,శుభాకాంక్షలు అంటూ వ్రాసుకొచ్చారు.ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Comments
Post a Comment