Posts

Showing posts from July, 2025

రైతు భూమి నష్టపరిహారం రూ. 10.57 లక్షలు మింగేసిన ప్రభుత్వ సిబ్బంది...

Image
రైతు భూమి నష్టపరిహారం రూ. 10.57 లక్షలు  మింగేసిన ప్రభుత్వ సిబ్బంది కార్యాలయాల చుట్టూ రైతు ప్రదక్షిణలు న్యాయం చేస్తామని ఆర్ డిఓ హామీ బి.విజయ్ కుమార్, ఆర్ జిఎన్ హ్యుమన్ రైట్స్  అండ్ ఆంటీ కరప్షన్ అసోసియేషన్ ఎపి ఇంచార్జి VS9TV న్యూస్,ఓర్వకల్ : మనిషి బతకాలంటే ఆహారం కావాలి.కాని నాటి నుండి నేటి వరకు రైతుకు అన్యాయమే జరుగుతుంది.అతివృష్టి, అనావృష్టి,నకిలీ విత్తనాలు,నకిలీ ఎరువులు,పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక,చేసిన అప్పులకు వడ్డీలు చె ల్లించలేక రైతు ప్రాణాలు తీసుకుంటున్న పరిస్థితి నెల కొంది.మరోవైపు రైతుకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వ సిబ్బంది,అదే రైతు భూమిపై వచ్చే నష్టపరిహారం అక్రమం గా మింగేసిన ఘటన కర్నూలు జిల్లా,ఓర్వకల్ మండలంలో జరిగింది.ఈ నేపథ్యంలో రై తుకు జరిగిన అన్యాయంపై న్యాయం కోరుతూ "ఆర్ జిఎన్ హ్యుమన్ రైట్స్ అండ్ ఆంటీ క రప్షన్ అసోసియేషన్" ను అశ్రాయించాడు.స్పందించిన ఆర్ జిఎన్ హ్యుమన్ రైట్స్ అండ్ ఆంటీ కరప్షన్ అ సోసియేషన్ ఎపి ఇంచార్జి విజయ్ కుమార్,జిల్లా అధ్యక్షులు విజ య్ కుమార్ లు ఓర్వకల్ మండలం తహసీల్దార్ విద్యాసాగర్ ను కలిసి గురువారం ఘట నకు సంబందించిన విషయాన్ని వివరించారు.రైతుకు న్...

సామాజిక సేవకు గౌరవం...సిఐ శేషయ్యకు డాక్టరేట్ ప్రధానం...

Image
సామాజిక సేవకు గౌరవం...సిఐ శేషయ్యకు డాక్టరేట్ ప్రధానం VS9TV న్యూస్,కర్నూలు క్రైం : ఎస్సైగా పోలీసుశాఖలో చేరినప్పటి నుండి ఎన్నో సామాజిక సేవలు చేసినందుకుగాను క ర్నూలు త్రీ టౌన్ సిఐ శేషయ్యకు అరుదైన గౌరవం దక్కింది. ఆయనకు డాక్టరేట్ ప్రధానం చేశారు.ఈ నేపథ్యంలో గురువారం ఢిల్లీలోని హోటల్ అశోక్ కన్వెక్షన్ హాల్ లో హెచ్ డి ఎసి ప్రతినిధులు సిఈఓ కవితా బజాజ్ చేతుల మీదుగా కర్నూలు త్రీ టౌన్ సిఐ శేషయ్యకి గౌరవ డాక్టరేట్ ను ప్రధానం చేశారు.ఈ కార్యక్రమంలో వివిధ దేశాల వారు హాజరయ్యా రు.ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ...గౌరవ డాక్టరేట్ రావడం పట్ల ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నామన్నారు.అంతేకాకుండా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు.సమా జంలో ప్రతి ఒక్కరు సామాజిక సేవలో పాల్గొనాలని సిఐ పిలుపునిచ్చారు.కర్నూలు త్రీ టౌన్ సిఐ శేషయ్యను జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్,అడిషనల్ ఎస్పీలు,డిఎస్పీలు,సిఐలు,బంధు వులు,శ్రేయోభిలాషులు అభినందనలు తెలిపారు.

కొత్త బస్టాండ్ ప్రాంతంలో వేశ్యల వ్యాపారాన్ని అరికట్టండి...డివైఎఫ్ ఐ...

Image
కొత్త బస్టాండ్ ప్రాంతంలో వేశ్యల వ్యాపారాన్ని అరికట్టండి... డివైఎఫ్ ఐ  VS9TV న్యూస్,కర్నూలు క్రైం : కర్నూలు నగరం,కొత్త బస్టాండ్ ప్రాంతంలో జరుగుతున్న వేశ్యల వ్యాపారాన్ని అరికట్టాల ని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాఘవేంద్ర,అబ్దుల్లా జిల్లా ఉపాధ్యక్షులు హుస్సేన్ భాషా,సహాయ కార్యదర్శి మధు విజ్ఞప్తి చేశారు.గురువారం నాలుగవ పట్టణ సిఐ విక్రమ సింహను కలిసి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కర్నూలు కొత్తబస్టాండు సుందరయ్య సర్కిల్ వరకు వేశ్యలు వ్యాపారానికి కేంద్రంగా మార్చివేశా రని తెలియజేశారు.ఉదయం నుండి రాత్రి వరకు దాదాపు పదిమంది ఇక్కడే ఉంటున్నారని అ న్నారు.వారి వలన ఆధ్యా హాస్పిటల్ గాయత్రి హాస్పిటల్ నవయుగ హోటల్ మార్కెట్, యార్డు వివిధ ప్రజాసంఘాల కార్యాలయాలకు వస్తున్న మహిళలు చాలా ఇబ్బందులు ప డుతున్నారని అన్నారు.వేశ్యల కోసం వస్తున్న వారు ఏ మహిళలు కనబడిన వారు వెంట పడుతున్నారని,మహిళలు ఈ ప్రాంతంలో తిరగాలంటే భయపడుతున్న పరిస్థితి ఉంద న్నారు. వేశ్యలు మార్కెట్ కు వస్తున్న రైతులను వెంటపడి వేధిస్తున్నారని,వారి దగ్గర బల వంతంగా డబ్బులు గుంజుకుని వారి పైన దౌర్జన్యం చేస్తున్...

మమ్మల్నే బెదిరిస్తారా?...అమెరికాకు చైనా కౌంటర్...

Image
మమ్మల్నే బెదిరిస్తారా?.. అమెరికాకు చైనా కౌంటర్ VS9TV న్యూస్,హైదరాబాద్ : అమెరికా బెదిరింపులకు లొంగేది లేదని చైనా స్పష్టం చేసింది.రష్యా నుంచి ఆయిల్ కొం టే టారిఫ్స్ విధిస్తామన్న అమెరికా బెదిరింపులపై చైనా స్పందించింది.మేము మా దేశ అవ సరాల కోసం ఎక్కడి నుంచైనా ఆయిల్ కొంటాం.ఒత్తిడి తెస్తే ఏమీ సాధించలేరు.టారిఫ్ యుద్ధాలు పనికిరావు.మా దేశ అవసరాలు,సమగ్రత,భద్రత విషయాల్లో రాజీపడం అని చైనా విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.

తిరుమలలో రీల్స్ చేస్తే...జైలే...

Image
తిరుమలలో రీల్స్ చేస్తే...జైలే VS9TV న్యూస్,తిరుమల : తిరుమలలో రీల్స్ చేయడంపై టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది.శ్రీవారి ఆలయం ముందు,మాడ వీధుల్లో భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తించినా,రీల్స్ చేసి నా సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేసింది.క్షేత్ర పవిత్రతకు భం గం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. తిరుమలలో ఆధ్యాత్మిక వాతావరణం,పవిత్రతను కాపాడడంలో భక్తులంతా సహకరించాలని విజ్ఞప్తి చే సింది.

8వ తరగతి విద్యార్థినితో 40 ఏళ్ల వ్యక్తికి పెళ్లి...బాలిక ఫిర్యాదుతో బాలిక తల్లి,వరుడు, మధ్యవర్తి,వివాహం జరిపిన పూజారిపై కేసు నమోదు...

Image
8వ తరగతి విద్యార్థినితో 40 ఏళ్ల వ్యక్తికి పెళ్లి బాలిక ఫిర్యాదుతో బాలిక తల్లి,వరుడు, మధ్యవర్తి,వివాహం జరిపిన పూజారిపై కేసు నమోదు. VS9TV న్యూస్,నందిగామ : రంగారెడ్డి జిల్లాల్లో బాల్య వివాహం కలకలం రేపింది.13 ఏళ్ల బాలికను 40 ఏళ్ల వ్యక్తి వి వాహం చేసుకున్నాడు.అయితే బాలిక తాను చదువుతున్న స్కూల్ ఉపాధ్యాయులకు ఈ విషయం తెలియజేయడంతో రెండు నెలల కిందట జరిగిన ఈ ఘటన వెలుగులోకి వచ్చిం ది.వివరాలు ఇలా ఉన్నాయి...రంగారెడ్డి జిల్లా,నందిగామకు ఓ మహిళ భర్త కొన్నేళ్ల కింద ట చనిపోయాడు.ఆమెకు అప్పటికే ఒక కొడుకు,కూతురు ఉన్నారు. ఆమె కూతురు (13) ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతుంది.ఆ మహిళ కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తుంది.అయితే కొన్ని నెలల కిందట కూతురికి పెళ్లి చేయాలని ఆమె భావించింది.కుటుంబ పోషణ భారం కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది.ఈ క్రమంలోనే ఓ మధ్యవర్తిని ఆశ్రయించింది.అయితే మధ్యవర్తి రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంకు చెం దిన ఓ 40 ఏళ్ల శ్రీనివాస్‌ గురించి చెప్పాడు.అతడికి ఆస్తి బాగా ఉందని తెలిపాడు.ఈ క్ర మంలోనే మే,28న ఓ గుడిలో బాలికకు 40ఏళ్ల వ్యక్తితో వివాహం జరిపించారు.అయితే బాలిక మైనర్ కావడం,ఆమె ...

సిగాచి పరిశ్రమ ప్రమాదంపై తెలంగాణ హైకోర్టులో పిల్‌...

Image
సిగాచి పరిశ్రమ ప్రమాదంపై తెలంగాణ హైకోర్టులో పిల్‌ VS9TV న్యూస్,హైదారాబాద్ :  తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన సిగాచి పరిశ్రమ ఘోర పేలుడు ప్రమాదంపై తెలం గాణ హైకోర్టులో పిల్‌ దాఖలు అయ్యింది.సిగాచి పరిశ్రమలో భద్రతా ప్రమాణాలు పాటిం చలేదని న్యాయవాది కె.బాబూరావు హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు.దీంతో సిగాచి ప రిశ్రమ ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.మూడు వారా ల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశించింది.పేలుడు ఘటనలో ఇంకా ఎ నిమిది మంది ఆచూకీ లభించలేదని ఫిటిషన్‌లో పేర్కొన్నారు బాబూరావు.బాధితులకు ప్రకటించిన పరిహారం ప్రభుత్వం ఇంకా చెల్లించలేదని స్పష్టం చేశారు.సిగాచి పరిశ్రమ యజమానిని ఇప్పటివరకూ అరెస్టు చేయలేదని...ప్రమాదంపై సీఎం ఏర్పాటు చేసిన క మిటీ నివేదిక బయటపెట్టాలని పిటిషనర్ డిమాండ్ చేశారు.పటాన్‌చెరు మండలం పాశ మైలారం పారిశ్రామిక వాడలోని సిగాచి పరిశ్రమలో జూన్‌,30న సంభవించిన ఘోర పే లుడు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు,గాయపడిన వారికి న్యాయం చేయాలని పిటిషనర్ కోరారు. ప్రమాద సమయంలో పరిశ్రమలో 143మంది కార్మికులు ఉన్నారని,సిగాచి పరిశ్రమ మ...

కోరిక తీర్చాలంటూ మహిళా VRO ఇంటికెళ్లిన MRO...కామాంధుడైన MROకు బడితెపూజ...

Image
కోరిక తీర్చాలంటూ మహిళా VRO ఇంటికెళ్లిన MRO కామాంధుడైన MROకు బడితెపూజ VS9TV న్యూస్,తిరుపతి : ఏపీలోని తిరుపతి జిల్లా,నాయుడు పేటలో నివాసం ఉండే మహిళా VROను కొన్నేళ్లుగా అతడు లైంగికంగా వేధిస్తున్నాడు.'మీ ఇంటికి వస్తా,కోడికూర వండిపెడతావా? అడిగింది ఇస్తావా?' అని మెసేజ్ లు పెట్టాడు.నిన్న బరితెగించి ఆమె ఇంటికి వెళ్లాడు.దుస్తులు విప్పి తన కోరిక తీర్చాలంటూ వేధించాడు.దీంతో VRO తన తల్లికి సమాచారం ఇచ్చింది.ఆ మె వచ్చి అతడిని చితకబాదిన వీడియో వైరల్ అవుతోంది...

ఏపీపీఎస్పీ ఉద్యోగ నియామక ప్రక్రియలో మార్పులు...

Image
ఏపీపీఎస్పీ ఉద్యోగ నియామక ప్రక్రియలో మార్పులు VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే ఉద్యోగ నియామక ప్రక్రియలో ప్రభుత్వం కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. నియామకాల్లో వేగం పెంచేలా నూతన మార్గదర్శ కాలను తీసుకొచ్చింది.ఈ సంస్కరణలతో ఇకపై ఖాళీలను వెంటవెంటనే భర్తీ చేయనుం ది.ఇప్పటివరకు ఏపీపీఎస్సీ ప్రత్యక్ష నియామకాలలో అభ్యర్థుల సంఖ్య 25 వేలు దాటితే స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తూ వస్తుంది.అయితే దీన్ని ఇకపై రద్దు చేయనుంది.అభ్యర్థుల సం ఖ్య 200రెట్లు మించిన పుడు మాత్రమే స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించాలనే నిబంధనను అమ ల్లోకి తీసుకొచ్చారు.దీంతో చాలా పోస్టులు ఇకపై ఒక్క మెయిన్స్ పరీక్షతోనే ఎంపిక ప్రక్రి య పూర్తవుతుంది.ఈ మార్పులు అమలులోకి వస్తే ప్రతి ఉద్యోగానికి ప్రిలిమ్స్,మెయిన్స్ ప రీక్షలు రాయాల్సిన అవసరం లేదు.ఒకే పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ కొనసాగుతుం ది.ఏపీపీఎస్సీ చేసిన ప్రతిపాదనల్ని ప్రభుత్వం అధికారికంగా ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.ఈ కొత్త విధానం అకడమిక్‌ గా,అడ్మినిస్ట్రేటివ్‌గా కూడా ఈజీ కావడంతో భవిష్య త్‌ లో మెజారిటీ ఉద్యోగ నియామకాలకు ఇది వర...

తాగేందుకు బోరు నీళ్లు...అన్నంలో పురుగులు...గురుకుల పాఠశాల విద్యార్థుల పాదయాత్ర...

Image
తాగేందుకు బోరు నీళ్లు...అన్నంలో పురుగులు గురుకుల పాఠశాల విద్యార్థుల పాదయాత్ర 50రోజులుగా ఆందోళన చేస్తున్నా స్పందన కరువు  రోడ్డెక్కిన విద్యార్థులు హాస్టల్‌కు అదనపు కలెక్టర్‌ సమస్యలు పరిష్కరిస్తామని హామీ VS9TV న్యూస్,అలంపూర్‌ :   సమస్యలు ఎవరూ పట్టించుకోవడం లేదని,తమ గోడును ఏకంగా కలెక్టర్‌కే చెప్పుకుం టామంటూ గురుకుల పాఠశాల విద్యార్థులు పాదయాత్రగా బయలుదేరారు.పోలీసులు న చ్చజెప్పినా ససేమిరా అన్న విద్యార్థులు అడుగు ముందుకే వేశారు.జోగుళాంబ గద్వాల జి ల్లా,ఉండవల్లి మండలం,పుల్లూరు గ్రామ శివారు అలంపూర్‌ చౌరస్తాలోని మహాత్మా జ్యో తిభాఫూలే బాలుర గురుకుల పాఠశాలను ఆరేళ్లుగా ఓ ప్రైవేటు భవనంలో కొనసాగిస్తు న్నారు.5 నుంచి 10వ తరగతి వరకు 480మంది,ఇంటర్‌లో 80మంది కలిపి మొత్తం 560 మంది ఇక్కడ విద్యనభ్యసిస్తున్నారు.తమకు కనీస సౌకర్యాలు కల్పించాలని 50 రోజులుగా మొత్తుకుంటున్నా ఎవరూ పట్టించుకోవడం లేదంటూ విద్యార్థులు ఆందోళన బాటపట్టారు.ఏకంగా జిల్లా కలెక్టర్‌ వద్దకు వెళ్లి తమ గోడును వెళ్లబోసుకుంటామంటూ తొమ్మిదవ,పదవ తరగతికి చెందిన 59మంది విద్యార్థులు రోడ్డెక్కారు.45కి.మీ.దూ రంలో ఉన్న కలెక్టరేట్‌కు...

బీజేపీ తమిళనాడు ఉపాధ్యక్షురాలిగా ఖుష్బూ...

Image
బీజేపీ తమిళనాడు ఉపాధ్యక్షురాలిగా ఖుష్బూ VS9TV న్యూస్,తమిళనాడు : ప్రముఖ సినీ నటి ఖుష్బూ సుందర్ తమిళనాడు రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా నియమితుల య్యారు.బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆమోదంతో కొత్త రాష్ట్ర వర్గాన్ని నియమిం చినట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నయనార్ నాగేంద్రన్ ప్రకటన విడుదల చేశారు.రాష్ట్ర ఉ పాధ్యక్షులుగా 14మంది నియమితులు కాగా ఈ జాబితాలో ఖుష్బూకు చోటు దక్కింది. ప్రస్తుతం ఆమె జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా,బీజేపీ జాతీయ ఎగ్జిక్యూటివ్ క మిటీ సభ్యురాలిగా కొనసాగుతున్నారు.

రోడ్డు ప్రమాదంలో నటుడు బోరబండ భాను మృతి...

Image
రోడ్డు ప్రమాదంలో నటుడు బోరబండ భాను మృతి VS9TV న్యూస్,హైదరాబాద్ : టాలీవుడ్‌లో విలన్ గ్యాంగ్‌లో కనిపించే నటుడు బోరబండ భాను మృతి చెందారు.గండి కోటలో మిత్రుడు ఇచ్చిన పార్టీకి హాజరైన ఆయన తిరుగు ప్రయాణంలో కారు ప్రమాదంలో మరణించారు.ప్రమాదానికి కొన్ని గంటల ముందు వరకు ఆయన ఫ్రెండ్స్‌తో సరదాగా గడి పారు.ఆ వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో సైతం పోస్ట్ చేశారు.ఆయన మృతి పట్ల పలువురు టాలీవుడ్ నటులు సంతాపం తెలిపారు.

దొడ్డిపాడులో సీసీ,బీటీ రోడ్ల నిర్మాణంకు శంకుస్థాపన...హాజరైన పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరిత రెడ్డి...

Image
దొడ్డిపాడులో సీసీ,బీటీ రోడ్ల నిర్మాణంకు శంకుస్థాపన హాజరైన పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరిత రెడ్డి V S9TV న్యూస్,కల్లూరు : కల్లూరు మండలం,దొడ్డిపాడు గ్రామంలో సీసీ,బీటీ రోడ్ల నిర్మాణం కోసం శంకుస్థాపన కా ర్యక్రమం గురువారం ఏర్పాటుచేశారు.కార్యక్రమానికి పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరిత రెడ్డి హాజరై శంకుస్థాపన చేశారు.అనంతరం సుపరి పాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ఇంటింటికి తిరిగి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథ కాల గురించి ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేసి గౌరు చరిత రెడ్డి  వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ నాగశేచల రెడ్డి,డీఈ నాగిరెడ్డి,ఏఈ రవి మోహన్ రెడ్డి,రాష్ట ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ రామాంజనేయులు,మాజీ ఎంపీపీ మదేష్,కురువ ధనుంజ య,దొడ్డిపాడు గ్రామ నాయకులు మహబూబ్ భాష,ఖాసిం,ఇమ్రాన్,పెద్దటెకూరు ఎంపీ టీసీ మునిస్వామి,లక్ష్మీపురం గ్రామ నాయకులు పుల్లారెడ్డి,రామీరెడ్డి,మారేన్న,కురువ ము రళి,సల్కాపురం దేవేందర్ రెడ్డి,చిన్నటేకూరు రామాంజనేయులు,యూనిట్ ఇంచార్జి రా జశేఖర్,ఆంజనేయులు,శేషగిరి,పెద్దటెకూరు వెంకటప్ప,పెద్దకొట్టాల రంగారెడ్డి,కూటమి పార్టీ నాయకులు,కార్యకర్తలు,త...

ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వ విద్యాలయం ఆధ్వర్యంలో జరుగుతున్న దురాగతాలు...

Image
ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వ విద్యాలయం  ఆధ్వర్యంలో జరుగుతున్న దురాగతాలు ఆధ్యాత్మికం పేరుతో మహిళలపై లైంగిక వేధింపులు,దోపిడీ ప్రజలకు రక్షణ కరువు భార్య,భర్తలను అన్నా చెల్లెళ్లుగా మారుస్తున్న వైనం  శివుడితో మహిళలకు వివాహం జరిపిస్తున్న దుస్థితి ఆధ్యాత్మిక సంస్థల వెనక రాజకీయాల పెత్తనం కర్నూలులో వందల సంఖ్యలో బాధితులు మంజుల,నిరాకార శివ్ పరమాత్మ ఆధ్యాత్మిక్  విశ్వ విద్యాలయ వ్యవస్థాకురాలు VS9TV న్యూస్,కర్నూలు క్రైం : సమాజంలో మహిళలపై నేటికి అనేక దారుణాలు జరుగుతున్నాయి.వరకట్న వేధింపులు, గృహ హింస,అత్యాచారా లు,దాడులు,వేధింపులు,ఇలా అనేకం మహిళా లోకం భరిస్తూ నే ఉంది.ఇలాంటి నేపథ్యంలో మరో విధంగా ఆధ్యాత్మికం పేరుతో జరుగుతున్న దారుణా లు వెలుగులోకి వచ్చాయని,ఆ దారుణాలు అరికట్టే ప్రయత్నంలో ప్రతి ఒక్కరు కృషి చేయా ల్సిన అవసరం ఎంతైనా ఉందని నిరాకార శివ్ పరమాత్మ ఆధ్యాత్మిక్ విశ్వ విద్యాలయ వ్య వస్థాకురాలు మంజుల పేర్కొన్నారు.బుధవారం కర్నూలు జిల్లాలో ఆధ్యాత్మికం పేరుతో ప్ర జాపిత బ్రహ్మ కుమారి ఈశ్వరీయ విశ్వ విద్యాలయం ఆధ్వర్యంలో మీరా,మైల రాధాకృ ష్ణలు మహిళల పట్ల చేస్తున్న దుర్మార్గాలపై ర...

గంజాయి విక్రయాలపై కృష్ణా జిల్లా పోలీసులు ఉక్కుపాదం...6.255 కిలోల గంజాయి స్వాధీనం...డిఎస్పీ రాజా...

Image
గంజాయి విక్రయాలపై కృష్ణా జిల్లా పోలీసులు ఉక్కుపాదం 6.255 కిలోల గంజాయి స్వాధీనం డిఎస్పీ రాజా VS9TV న్యూస్,కృష్ణ క్రైం : గంజాయి విక్రయాలపై కృష్ణా జిల్లా పోలీసులు ఉక్కు పాదం మోపారు.అండర్ కవర్ ఆప రేషన్ నిర్వహించి పెద్ద మొత్తంలో గంజాయిను,విక్రయదారులను చిలకలపూడి పోలీసు లు అదుపులోకి తీసుకున్నారు.పోలీసులు స్వాధీనం చేసుకున్న గంజాయి,విక్రయ దారుల ను మీడియా ముందు ప్రదర్శించారు.అనంతరం కేసు వివరాలను డీఎస్పీ సిహెచ్ రాజా వె ల్లడించారు...పోలీసు బృందాలు నిర్వహించిన అండర్ కవర్ ఆపరేషన్ లో 6.255 కిలో ల గంజాయి స్వాధీనం చేసుకున్నామన్నారు.పదిమంది గంజాయి విక్రేతలను అరెస్టు చే శామని,నిందితుల్లో నలుగురు మైనర్లు ఒక మహిళ ఉన్నట్లు చెప్పారు.ఈ విక్రయాల్లో మ రో 70మంది ప్రమేయం ఉన్నట్లు గుర్తించామని,త్వరలో వారిని కూడా అరెస్టు చేస్తామ న్నారు.గంజాయి విక్రయించడమే కాదు,సేవించిన చర్యలు తీసుకుంటామని డిఎస్పీ రా జా హెచ్చరించారు.

బ్యాంకులు పకడ్బందీ భద్రత ఏర్పాటు చేసుకోవాలి...జిల్లాలోని బ్యాంకర్లతో సమీక్ష... విక్రాంత్ పాటిల్,కర్నూలు జిల్లా ఎస్పీ...

Image
బ్యాంకులు పకడ్బందీ భద్రత ఏర్పాటు చేసుకోవాలి నేర నివారణే ప్రథమ లక్ష్యం ఖాతాదారులను హెచ్చరిస్తూ సైబర్ మోసాలను తెలియజేయాలి భద్రతా ప్రమాణాలపై జిల్లాలోని బ్యాంకర్లతో సమీక్ష విక్రాంత్ పాటిల్,కర్నూలు జిల్లా ఎస్పీ VS9TV న్యూస్,కర్నూలు క్రైం : నేర నివారణే ప్రథమ లక్ష్యంగా కర్నూలు జిల్లాలోని అన్ని బ్యాంకులు పకడ్బందీ భద్రతను ఏర్పాటు చేసుకోవాలని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు.బ్యాంకుల భద్రతా ప్రమా ణాలపై జిల్లా ఎస్పీ జిల్లాలోని అన్ని బ్యాంకుల మేనేజర్లతో బుధవారం జిల్లా పోలీసు కా ర్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఇటీవల మ ధ్యప్రదేశ్,మహరాష్ట్ర,తమిళనాడు,హర్యానా వంటి పలు రాష్ట్రాలలో హైవే ప్రక్కన ఉన్న బ్యాంకుల్లో జరిగిన దొంగతనాలను గుర్తుచేశారు.అలాంటి సంఘటనలు జిల్లాలో జరగ కుండా బ్యాంకు అధికారులు పకడ్బందీగా భద్రతను ఏర్పాటు చేసుకోవాలన్నారు.ఈ సంథ ర్భంగా జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ...బ్యాంకు లోపల,బయట అన్ని ప్రదేశా ల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజా భద్రత చట్టం ప్రకారం మన్నిక కలిగిన సెన్సార్ సీసీ కెమెరాలు, బ్యాంకులలో దొంగలు పడిన వెంటనే అత్యవసర పరిస్థితుల్లో సెక్యూర...

సమస్యల పరిష్కారం కోసం ఆగస్ట్,2న కలెక్టరేట్ ఎదుట ధర్నా...ఫ్యాప్టో...

Image
సమస్యల పరిష్కారం కోసం ఆగస్ట్, 2న కలెక్టరేట్ ఎదుట ధర్నా...ఫ్యాప్టో VS9TV న్యూస్,కర్నూలు ఎడ్యుకేషన్ : రాష్ట్రంలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కొరకు రాష్ట్ర ఫ్యాప్టో ఆ ధ్వర్యంలో ఆగస్ట్,2వ తేదీన అన్ని జిల్లాల కలెక్టరేట్ ఎదుట ధర్నా చేయాలని నిర్ణయం తీ సుకోవడం జరిగింది.దానికి అనుగుణంగా బుధవారం కర్నూలు నగరంలో సలాం ఖాన్ భవనంలో కర్నూలు జిల్లా ఫ్యాప్టో చైర్మన్ సేవా లాల్ నాయక్ (ఆప్టా)అధ్యక్షతన కర్నూలు జిల్లా ఫ్యాప్టో సన్నాహక సమావేశం జరిగింది.సమావేశానికి రాష్ట్ర ఫ్యాప్టో కో చైర్మన్ క ర్నూలు జిల్లా ఫ్యాప్టో ఇంచార్జి కాకి ప్రకాష్ రావు,ఫ్యాప్టో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జి. హృదయ రాజులు హాజరయ్యారు.ఈ సందర్బంగా కాకి ప్రకాష్ రావు మాట్లాడుతూ రాష్ట్రం లో ప్రభుత్వం అధికారంలో వచ్చి సంవత్సరం దాటిన ఉద్యోగ,ఉపాధ్యాయులకు రావాల్సి న అర్ధిక అంశాలపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు.కొత్తగా ప్రమోషన్,బదలీ పొందిన ఉపాధ్యాయులకు రెండు నెలలుగా జీతాలు లేవు.ఈ విషయంలో చర్యలు తీసు కోవాలని అధికారులను కోరిన వారిలో నిర్లక్ష్యంగా ఉన్నారన్నారు.ఈ నిర్లక్ష్యం పోవాలి అంటే జిల్లా వ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులు అ...

శంషాబాద్‌లో రూ.40కోట్ల విలువైన గంజాయి పట్టివేత...

Image
శంషాబాద్‌లో రూ.40కోట్ల విలువైన గంజాయి పట్టివేత VS9TV న్యూస్,హైదరాబాద్ : హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రూ.40 కోట్ల విలువైన హైడ్రోఫోనిక్ గం జాయిని బుధవారం అధికారులు పట్టుకున్నారు.బ్యాంకాక్ నుంచి వచ్చిన మహిళా ప్రయా ణికురాలి వద్ద 400కిలోల గంజాయి ఉన్నట్లు నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు గు ర్తించారు.దీంతో ఆమెను అదుపులోకి తీసుకుని గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

ఎసిబికి చిక్కిన అవినీతి తిమింగళం...

Image
ఎసిబికి చిక్కిన అవినీతి తిమింగళం V A9TV న్యూస్,జగిత్యాల : జగిత్యాల జిల్లా కేంద్రంలో లం చం తీసుకుంటూ పంచాయతీ రాజ్ AEE అనీల్ ACBకి చి క్కారు.ఎసిబి అధికారులు తెలిపి న వివరాలు... కోరుట్లకు చెందిన కాంట్రాక్టర్ వెంకటేశంకు సంబం దించిన రూ.23లక్షల బిల్లు కో సం అనిల్ కుమార్ రూ.18వేలు లంచం డిమాండ్ చేశారు.ఈ నే పథ్యంలో వారి ఇరువురి మధ్యలో రూ.10 వేలకు ఒప్పందం జరిగిందని పేర్కొన్నారు. మొదటగా మూడు వేలు తీసుకున్న అనిల్ కుమార్ మిగతా ఏడు వేలు తీసుకుంటుండగా నిఘాతో బహిరంగంగా పట్టుకున్న ఏసీబీ అధికారులు తెలిపారు.అతనిపై తదుపరి చర్య లు చేపడుతున్నట్లు వారు తెలిపారు.

ప్రమాదంలో మహిళా సాఫ్ట్‌వేర్‌ దుర్మరణం...

Image
ప్రమాదంలో మహిళా సాఫ్ట్‌వేర్‌ దుర్మరణం VS9TV న్యూస్,హైదరాబాద్ : హైదరాబాద్,మణికొండలో కు మార్తెలను స్కూల్‌ బస్సు ఎక్కించి తిరిగి వస్తుండగా వెనక నుంచి వే గంగా దూసుకొచ్చిన ఓ ట్యాంకర్‌ స్కూటీని ఢీ కొట్టడంతో ఓ మహి ళా సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ దుర్మరణం పాలైన ఘటన రాయదుర్గం పోలీ స్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసు కుంది.సిఐ సీహెచ్‌.వెంకన్న తెలి పిన వివరాలు ఇలా ఉన్నాయి...ప్రకాశం జిల్లా,కందుకూరు మండలం,కొండముదుసు పా లెంకు చెందిన దంపతులు వెంకటేశ్వర్లు, ఇరువురి శాలిని(38) మణికొండలోని బీఆర్‌సీ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నారు.భార్యాభర్తలిద్దరు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లుగా పని చేస్తు న్నారు.మూడు రోజుల క్రితం పిల్లలతో కలిసి వైజాగ్‌ వెళ్లగా,వెంకటేశ్వర్లు విజయవాడలో ఆగిపోయారు.కుమార్తెలను తీసుకొని శాలిని గత సోమవారం రాత్రి మణికొండకు వచ్చిం ది.భారతీయ విద్యాభవన్‌లో పెద్ద కుమార్తె సుదీక్ష,9వ తరగతి,చిన్న కుమార్తె సహస్ర,4వ తరగతి చదువుతున్నట్లు పేర్కొన్నారు. స్కూల్‌ బస్సు వెళ్లిపోవడంతో ఇద్దరు కూతుళ్లను స్కూటీపై తీసుకెళ్లి ముందు స్టాప్‌లో బస్సు ఎక్కించింది.అనంతరం స్కూటీపై తిరిగి వస్తుం డగా మణికొండలోని సుందర్‌ గార్...

బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ నోటీసులు... విచారణకు హాజరైన ప్రకాష్ రాజ్...

Image
బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ నోటీసులు విచారణకు హాజరైన ప్రకాష్ రాజ్ VS9TV న్యూస్,హైదరాబాద్ :  బెట్టింగ్ యాప్స్ కేస్‌లో ఈడీ అధికారులు దూకుడు పెంచారు.బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన సినీసెలబ్రిటీలకు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.ఇందులో భాగంగానే నటుడు ప్రకాష్‌రాజ్‌కి ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు.ఈడీ అధికారుల నోటీసుల మేరకు బుధవారం ప్రకాష్‌రాజ్ విచారణకు హాజరయ్యారు.బెట్టింగ్ యాప్స్ కేస్‌ లో తెలంగాణ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ అధికారులు కేస్ న మోదు చేశారు.జంగిల్ రమ్మీ యాడ్‌లో నటించి ప్రమోట్ చేశారు ప్రకాష్‌రాజ్‌.ఈ యా డ్‌ని ప్రమోట్ చేయడంతోనే ప్రకాష్‌రాజ్‌ పేరుని నోటీసులో చేర్చారు ఈడీ అధికారులు.36 బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేసిన సినీసెలబ్రిటీలకు నోటీసులు ఇచ్చారు. విచారణకు హా జరు కావాలని ప్రకాష్‌రాజ్‌కు పది రోజుల క్రితం ఈడీ అధికారులు నోటీసులు పంపించా రు.సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడంతోనే ఎంతోమంది వీటికి అలవాటు పడి భారీగా నష్టపోయారని పోలీసులకు ఫిర్యాదులు వచ్చాయి.అలాగే పలువురు ఆత్మహత్య లకు కూడా పాల్పడ్డారు.ఫిర్యాదులు రావడంతో బెట్టింగ్ యాప్...

గొర్రెల స్కాం కేసులో ఈడీ దూకుడు... హైదరాబాద్‌లో 10చోట్ల సోదాలు...

Image
గొర్రెల స్కాం కేసులో ఈడీ దూకుడు హైదరాబాద్‌లో 10చోట్ల సోదాలు VS9TV న్యూస్,హైదరాబాద్:  గొర్రెల స్కాం కేసు విచారణలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దూకుడుగా ముందుకె ళ్తోంది.హైదరాబాద్‌లో 10చోట్ల ఈడీ దాడులు కొనసాగుతుండటం హాట్ టాపిక్‌గా మా రింది.సికింద్రాబాద్,బోయిన్ పల్లి,జూబ్లీహిల్స్‌ ప్రాంతాల్లో ఈడీ సోదాలు చేపట్టింది.బీఆ ర్ఎస్ ప్రభుత్వ హయాంలో గొర్రెల పంపిణీలో రూ.700 కోట్ల అవినీతి జరిగిందనే ఆరోప ణలతో గతంలో ఏసీబీ కేసు నమోదు చేసింది.అనంతరం ఈడీ రంగంలోకి దిగి ఏసీబీ న మోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేసింది.గొర్రెల కుంభకోణం కేసు లో ఈడీ విచారణను వేగవంతం చేసింది.ఈ స్కాం విలువ సుమారు రూ.700 కోట్ల వర కూ ఉంటుందని అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) దర్యాప్తులో వెల్లడైంది.ఈ కేసులో పెద్దఎ త్తున డబ్బు చేతులు మారడం,ఇతర రాష్ట్రాలకూ లింకులు ఉన్నాయనే ఆరోపణలు రావ డంతో ఈడీ రంగంలోకి దిగింది.అందుకే మనీ లాండరింగ్‌ కేసుగా ఈడీ విచారణకు స్వీ కరించింది.ఇప్పటికే ఈడీ అధికారులు గొర్రెల స్కీంకు సంబంధించిన పూర్తి వివరాలను క లెక్ట్ చేశారు.గొర్రెల పంపిణీ విధివిధానాలు,ప్రభుత్వ నిధుల చెల్లింపులకు సంబంధించిన...

పెళ్ళికి ముందు భార్య ప్రేమాయణం... ప్రియుడితో కలిసి చంపేస్తుందేమో అని భయంతో వదిలేసిన భర్త...

Image
పెళ్ళికి ముందు భార్య ప్రేమాయణం ప్రియుడితో కలిసి చంపేస్తుందేమో అని భయంతో వదిలేసిన భర్త మరోసారి దగ్గరై వాడుకొని వదిలేసిన ప్రియుడు VS9TV న్యూస్,వికారాబాద్ : వికారాబాద్ జిల్లా,తాండూరు మండలం,బెల్కటూరుకి చెందిన అక్షిత అనే యువతి,అదే గ్రామాని కి చెందిన సురేష్ అనే యువకు డు ఇద్దరూ ప్రేమించుకోగా...వీరి పెళ్లికి ఇరు కుటుంబాల పెద్దలు ని రాకరించారు.అక్షితకు కర్ణాటక కు చెందిన యువకుడితో వివా హం జరిపించారు.ప్రియుడు సు రేష్ నిత్యం ఫోన్ కాల్స్ చేస్తూ ఆమెను వేధింపులకు పాల్పడడం జరిగింది.భార్యకు కాల్స్ రావడం చూసి ఆరా తీసి పెళ్ళికి ముందు ప్రేమాయణం గురించి తెలుసుకున్న భర్త ప్రియు డితో,భార్యలు కలిసి భర్తలను చంపుతున్నారని భయపడి,అక్షితతో పెద్దల సమక్షంలో భర్త తెగదెంపులు చేసుకున్నాడు.తిరిగి గ్రామానికి వచ్చిన అక్షితను నేనున్నానంటూ మాయ మాటలు చెప్పి దగ్గరై,శారీరకంగా వాడుకొని ప్రియుడు సురేష్ మొహం తిప్పేశాడు.దీంతో పెళ్లి గురించి మాట్లాడే వరకు సురేష్ దూరం పెట్టడంతో,మోసపోయానని గ్రహించిన అ క్షిత పోలీసులను ఆశ్రయించింది.అక్షిత ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యా ప్తు ప్రారంభించారు.

ప్రభుత్వ పాఠశాలల్లోని సమస్యలను వెంటనే పరిష్కరించాలి...సిపిఎం డిమాండ్...

Image
ప్రభుత్వ పాఠశాలల్లోని సమస్యలను వెంటనే పరిష్కరించాలి సిపిఎం డిమాండ్ VS9TV న్యూస్,కల్లూరు : కల్లూరు అర్బన్,32వ వార్డు,ముజాఫర్ నగర్ లో ఉన్న జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠ శాలను సిపిఎం ప్రతినిధి బృందం పరిశీలించారు.ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు కె సుధాకరప్ప,నగర కమిటీ సభ్యులు యస్.హుస్సేన్ భాష మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ పాఠశాల తరహాలో ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేస్తామని నాలుగు రంగులు వేసి రంగుల ప్రపంచం చూపించడం తప్ప,ప్రభుత్వ పాఠశాలలో సమ స్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లు ఉండిపోయాయని వారు విమర్శించారు. ముజాఫర్ నగర్ హైస్కూల్లో 500 మంది విద్యార్థులకు తగ్గట్లు మరుగుదొడ్లు లేక విద్యార్థు లు ఆరుబయటకు వెళ్లాల్సి వస్తుందని,అందువల్ల విద్యార్థులు చాలా ఇబ్బందులకు గురవు తున్నారని తెలిపారు.క్లాస్ రూమ్ లలో ఫ్యాన్లు సరిగ్గా పనిచేయడం లేదన్నారు.పాఠాలు చెప్పే డిజిటల్ బోర్డుకు సరైన నెట్వర్క్ సౌకర్యం లేదని,ప్రధానంగా ఇంగ్లీష్,హిస్టరీ సబ్జెక్టు లకు సంబంధించి టెన్త్ క్లాస్ విద్యార్థులకు పూర్తిస్థాయిలో బుక్స్ అందలేదని బూట్లు ఇచ్చిన అవి అన్ సైజ్ ఉండడం వల్ల వెనక్కు పం...

ఆగస్ట్,11న జిల్లా స్థాయి యోగా టోర్నమెంట్ కమ్ సెలక్షన్...

Image
ఆగస్ట్,11న జిల్లా స్థాయి యోగా టోర్నమెంట్ కమ్ సెలక్షన్ VS9TV న్యూస్,కర్నూలు స్పోర్ట్స్ : ఆగస్ట్,11వ తేదీన కర్నూలు జిల్లా స్థాయి యోగా టోర్నమెంట్ కమ్ సెలక్షన్ ను కర్నూలు లోని అవుట్డోర్ స్టేడియం ఉన్న యోగ హాల్ నందు నిర్వహిస్తున్నట్లు కర్నూలు యోగ సం ఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అవినాష్ శెట్టి,ముని స్వామిలు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఎంపిక పోటీలను 8-10,10-12,12-14,14-16,16-18,18-21, 21-25,25-30,30-35, 35-45,45 సంవత్సరాల పైబడిన వారికి బాల బాలికల స్త్రీ,పురు షుల విభాగంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఎంపికైన క్రీడాకారులు ఆగస్టు చివరి వారం లో వెస్ట్ గోదావరి జిల్లా వేదికగా జరగబోయే 50వ రాష్ట్రస్థాయి సబ్ జూనియర్,జూని యర్స్,సీనియర్ బాలబాలికల విభాగంలో కర్నూలు జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహిస్తార న్నారు.ఎంపిక పోటీలకు హాజరయ్యే క్రీడాకారులు రూ.50 ప్రవేశస్తులతో నేరుగా హాజరు కావచ్చు అన్నారు.మరిన్ని వివరాలకు 7732089440 ఫోన్ నెంబర్ కు సంప్రదించాలని తెలిపారు.

ప్రభుత్వ పథకాల పేరిట సైబర్‌ నేరగాళ్ల మోసాలు...విక్రాంత్ పాటిల్,జిల్లా ఎస్పీ...

Image
ప్రభుత్వ పథకాల పేరిట సైబర్‌ నేరగాళ్ల మోసాలు సైబర్ నేరాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలి పథకాల పేరుతో వచ్చే తెలియని లింకులను క్లిక్‌ చేయవద్దు బ్యాంకు ఖాతాల ఓటిపిలు చెబితే మోసపోతారు...జాగ్రత్త! జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ VS9TV న్యూస్,కర్నూలు క్రైం: ప్రభుత్వ పథకాలైన పీఎం కిసాన్‌, ముద్ర లోన్స్‌,సూర్యఘర్‌,అమ్మవ డి వంటి పథకాల పేరుతో సైబ ర్‌ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతు న్నారని,ప్రజలు అప్రమత్తంగా ఉం డాలని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటి ల్ బుధవారం తెలిపారు.ఇది ప్ర భుత్వం ప్రారంభించిన కొత్త పథ కం.ఇప్పుడే దరఖాస్తు చేసుకోం డి.మీకు రూ.50వేల రాయితీ’ అంటూ ఆకర్షించి ఖాతాలను కొల్లగొడుతున్నారు.ఆయా పథకాలకు దరఖాస్తు చేసుకున్న వారిని ఎంచుకొని మోసాలకు పాల్పడుతున్నారని,ఇ లాంటి మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు.ఆయా పథకాల పేరుతో మొబైల్ కు వచ్చే తెలియని లింకులను క్లిక్‌ చేయవద్దన్నారు.ఓటీపీలు చెబితే మోసపోయే అవకాశం ఉంద ని హెచ్చరించారు.   జిల్లా ఎస్పీ సూచనలు : 1. అపరిచిత లింకులను నమ్మవద్దు.ప్రభుత్వ పథకాలకు సంబంధించిన దరఖాస్తుల కో సం అధికారిక వెబ్‌సైట్‌లను మాత్రమే ఉపయోగించాలి.  2. వ్యక్తిగత ...

ఆగస్ట్,2న నగరపాలక సర్వసభ్య సమావేశం...

Image
ఆగస్ట్,2న నగరపాలక సర్వసభ్య సమావేశం VS9TV న్యూస్,కర్నూలు కార్పోరేషన్ : ఆగస్ట్,2న నగరపాలక సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు నగరపాలక కమిషనర్ పి. విశ్వనాథ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.స్థానిక ఎస్బిఐ ఎంప్లాయిస్ కాలనీలోని న గరపాలక సమావేశ భవనంలో ఉదయం 11-00 గంటలకు సమావేశం ప్రారంభం అవు తుందని,మేయర్ బి.వై.రామయ్య,మంత్రి టీజీ భరత్,ఎంపీలు బస్తిపాటి నాగరాజు,బైరెడ్డి శబరి,ఎమ్మెల్యేలు గౌరు చరితరెడ్డి,బొగ్గుల దస్తగిరి,డిప్యూటీ మేయర్లు,స్టాండింగ్ కమిటీ సభ్యులు,వివిధ శాఖల అధికారులు హాజరవుతారని పేర్కొన్నారు.సమావేశంలో 19 అం శాల అజెండాపై చర్చించి నిర్ణయం తీసుకుంటారని కమిషనర్ వెల్లడించారు.

అక్కను చంపే ముందు రీల్స్ చేసిన రోహిత్... ఫేమస్‌ అవ్వాలంటే హత్యలు కూడా చేస్తారా?...

Image
అక్కను చంపే ముందు రీల్స్ చేసిన రోహిత్ ఫేమస్‌ అవ్వాలంటే హత్యలు కూడా చేస్తారా? అది కూడా సొంత వాళ్లకు చంపేందుకు కూడా వెనుకాడరా? షాద్‌నగర్‌ హత్య కేసులో సంచలనం VS9TV న్యూస్,షాద్ నగర్ : షాద్‌నగర్ పరువు హత్య కేసులో పక్కా ప్లాన్ ప్రకారమే అక్కను ఆమె తమ్ముడు రోహిత్‌ హత్య చేసినట్టు తెలుస్తోంది.అక్కను చంపే ముందు రీల్స్ చేశాడు రోహిత్‌.ఫేమస్ అవ్వా లి మామ,బాగా బతికి పేరు తెచ్చుకునే ఓపిక లేదు...బాగా చంపి ఫేమస్ అయ్యేదా అం టూ రీల్స్ చేశాడు.దీంతో హత్య చేసేందుకు ముందుగానే రోహిత్‌ ప్లాన్‌ చేసినట్టు తెలు స్తోంది.అక్క రుచిత వేరే వ్యక్తితో ఫోన్ మాట్లాడుతుందని రుచిత గొంతుకు వైర్ బిగించి హత్య చేశాడు రోహిత్. ఛార్జింగ్ వైర్‌ మెడకు బిగించి చంపేశాడు. హత్య తర్వాత తన కు ఏమీ తెలియనట్లు స్పృహ తప్పి పడిపోయిందని బంధువులకు ఫోన్ చేశాడు.విష యం తెలుసుకుని తండ్రి నిలదీయడంతో తానే హత్య చేసినట్టు రోహిత్ ఒప్పుకున్నాడు. ఈ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు తెలిపారు.ప్రేమ వ్యవహారంపై ఇం ట్లో తరచూ గొడవలు జరిగినట్లు తమకు సమాచారం ఉందన్నారు.వేరే యువకుడితో మాట్లాడొద్దని గతంలో అక్క రుచితను రోహిత్ చాలాసార్లు వారించినట్లు తెలుస్తోంది.

శంషాబాద్ సమీపంలోని సులోచన ఫార్మ్ గెస్ట్ హౌస్ లో సిట్ అధికారులు సోదాలు... 12బాక్సుల్లో ఉన్న రూ.11కోట్ల నగదును స్వాధీనం...

Image
శంషాబాద్ సమీపంలోని సులోచన ఫార్మ్ గెస్ట్ హౌస్ లో  సిట్ అధికారులు సోదాలు 12బాక్సుల్లో ఉన్న రూ.11కోట్ల నగదును స్వాధీనం VS9TV న్యూస్,హైదరాబాద్ : ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుడి సమాచారంతో రూ.11కోట్లు నగదు సిట్ బృందం స్వాధీనం చేసుకున్నారు.వివరాలు ఇలా ఉన్నాయి...హైదరాబాద్ నగరంలోని పది ప్రాం తాల్లో సిట్ బృందం సోదాలు జరుపుతోంది.ఈ నేపథ్యంలో  ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.సిట్ అధికారులు నిందితుల నివాసాలు,కార్యాల యాల్లో సోదాలు జరుపుతూ బుధవారం వేకువజామున భారీగా నగదును స్వాధీనం చే సుకున్నారు. ఈ కేసులో నిందితుడు రాజ్ కెసిరెడ్డి సూచనల మేరకు 12బాక్సుల్లో భద్రపరిచిన రూ. 11కోట్ల నగదును అధికారులు సీజ్ చేశారు.కేసులో ఏ40గా ఉన్న వరుణ్ పురుషోత్తం ఇచ్చిన సమాచారం ఆధారంగా శంషాబాద్ మండలంలోని కాచారం గ్రామంలో ఉన్న సులోచన ఫార్మ్ గెస్ట్ హౌస్‌లో సిట్ అధికారులు తనిఖీలు చేసి ఈ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఏ1 రాజ్ కెసిరెడ్డి ఆదేశాల మేరకు ఏ40 వరుణ్, ఏ12 చాణక్య ఈ రూ.1 1కోట్లు దాచినట్లు సిట్ విచారణ సందర్భంలో అంగీకరించారు.2024,జూన్‌లో ఈ మొ త్తం దాచినట్లుగా అధికా...

అనకాపల్లి జిల్లా,మాడుగులలో గిరినాగు పెట్టిన గుడ్లు...భయాందోళనతో పరుగులు తీసిన రైతులు...

Image
అనకాపల్లి జిల్లా,మాడుగులలో గిరినాగు పెట్టిన గుడ్లు భయాందోళనతో పరుగులు తీసిన రైతులు VS9TV న్యూస్,అనకాపల్లి : అనకాపల్లి జిల్లా,దేవరాపల్లి మండలం,వాలాబు గ్రామ శివారులో విషనాగు (గిరినాగు) పాము గుడ్లు పెట్టింది.గుడ్లు పెట్టిన స్థలాన్ని పశువులు మేపుతున్న రైతులు గుర్తించగా,పా ము వారిపై బుసలు కొడుతూ కాటు వేయబోయింది.భయంతో పారిపోయిన రైతులు ఈ విషయాన్ని అటవీశాఖకు సమాచారం అందించారు.

కుక్కకి రెసిడెన్స్ సర్టిఫికెట్...కలెక్టర్ సీరియస్...

Image
కుక్కకి రెసిడెన్స్ సర్టిఫికెట్...కలెక్టర్ సీరియస్ VS9TV న్యూస్,బిహార్:  పాట్నాలో ఒక కుక్కకి రెసిడెన్స్ సర్టిఫికెట్ ఇచ్చారు.ఆ కుక్క పేరును డాగ్ బాబు అని,దాని తండ్రి పేరును కుత్తా బాబు అని అలాగే కుక్క తల్లి పేరు కుటియా దేవి అని సర్టిఫికెట్లో రా శారు.ఈ రెసిడెన్స్ సర్టిఫికెట్ మసౌఝి జోనల్ ఆఫీస్ నుండి జారీ చేయగా,సర్టిఫికెట్లో కు క్క ఫోటో కూడా ఉంది.కుక్కకు సర్టిఫికెట్ జారీ చేయడాన్ని పాట్నా డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ త్యా గరాజన్ సీరియస్ గా తీసుకున్నారు. దీనిపై విచారణ చేపట్టామని...బాధ్యులైన అధికారు లను సస్పెండ్ చేస్తామని చెప్పారు.

75 ఇళ్ల గ్రామం...51మంది IAS,IPS లు...

Image
75 ఇళ్ల గ్రామం...51మంది IAS,IPS లు VS9TV న్యూస్,హైదరాబాద్ : ఉత్తరప్రదేశ్,జౌన్పూర్ జిల్లా,మాధోపట్టి అనే చిన్న గ్రామం ఉంది.ఈ గ్రామంలో కేవలం 75 ఇండ్లుంటాయి.కానీ ఆ ఊర్లో 51మంది ఐఏఎస్,ఐపీఎస్ ఆఫీసర్లు ఉంటారు.మాధో పట్టి గ్రామంలో ఎలాంటి కోచింగ్ సెంటర్లు లేకపోవడం. మాధోపట్టిలోని యువత శ్రద్ధ,క ఠిన శ్రమ,స్వీయ అధ్యయనంతో మాత్రమే ఈ విజయాలను సాధించారు.గ్రామంలోని యువతకు ప్రేరణగా నిలిచిన అధికారులు తమ విజయగాథలతో తరువాతి తరాలను ప్రో త్సహిస్తున్నారు.

ఫెడరల్ కోర్టు జడ్జిగా సరిత కోమటిరెడ్డి... నామినేట్ చేసిన ట్రంప్...

Image
ఫెడరల్ కోర్టు జడ్జిగా సరిత కోమటిరెడ్డి నామినేట్ చేసిన ట్రంప్ మరో ఇద్దరు భారతీయ అమెరికన్లకూ కీలక పదవులు VS9TV న్యూస్,వాషింగ్టన్ :  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రం ప్ తాజాగా ముగ్గురు భారతీయ అమెరికన్లను కీలక పదవులకు నా మినేట్ చేశారు.అందులో న్యూ యార్క్ లోని ఓ ఫెడరల్ కోర్టు జడ్జి పదవి కూడా ఉంది.'అమెరి కా డిస్ట్రిక్ట్ కోర్ట్ ఫర్ ది ఈస్టర్న్ డి స్ట్రిక్ట్ ఆఫ్ న్యూయార్క్'కు ప్రముఖ మహిళా న్యాయవాది సరిత కో మటిరెడ్డిని ట్రంప్ ప్రతిపాదించా రు.ఆమె నామినేషన్ ను గత సెనే ట్ కు సోమవారం పంపించారు.సరిత ప్రస్తుతం న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ అటార్నీ కా ర్యాలయంలో జనరల్ క్రైమ్స్ విభాగం డిప్యూటీ చీఫ్గా ఉన్నారు.ప్రతిష్ఠాత్మక కొలంబియా లా స్కూల్లో న్యాయశాస్త్ర పాఠాలను కూడా బోధిస్తుంటారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యా లు,నగదు అక్రమ చలామణీ నిరోధక సంస్థకు తాత్కాలిక డిప్యూటీ చీఫ్ గా సరిత 201 8,జూన్ నుంచి గత ఏడాది జనవరి వరకు ఉన్నారు.హార్వర్డ్ లా స్కూల్లో గ్రాడ్యుయేషన్ చేశారు. ప్రపంచ బ్యాంకులో రుణాలు అందించే విభా గమైన అంతర్జాతీయ పునర్నిర్మాణ, అభివృద్ధి బ్యాంకుకు అమెరికా ప్రతినిధిగా భారతీయ అమెరికన్ ...

తమిళనాడులో పరువు హత్య కలకలం... అక్కను ప్రేమించాడని హత్య చేసిన తమ్ముడు...

Image
తమిళనాడులో పరువు హత్య కలకలం అక్కను ప్రేమించాడని హత్య చేసిన తమ్ముడు VS9TV న్యూస్,తమిళనాడు : తమిళనాడులో పరువు హత్య కలకలం రేపింది.తిరునల్వేలిలో ఆదివారం పట్టపగలు 27 ఏళ్ల పాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ను దారుణంగా హతమార్చారు.సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ కవిన్‌ ఆసుపత్రి లో ఉండగానే దుండగుడు నరికి చంపేశాడు.పోలీసుల దర్యాప్తులో పరువు హత్యగా తే ల్చారు.అక్కను ప్రేమించాడని హత్య చేశాడు తమ్ముడు సుర్జిత్.సుర్జిత్‌ను పోలీసులు అదు పులోకి తీసుకున్నారు.నిందితుడు సూర్జిత్‌ తల్లిదండ్రులు ఇద్దరూ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ వాళ్లే కావడం గమనార్హం.కవిన్‌ దారుణ హత్య వెనుక అమ్మాయి సోదరుడితోపాటు,ఆమె తల్లిదండ్రుల హస్తం ఉందని బాధిత కుటుంబం ఆందోళనకు దిగింది.దీంతో...ఉన్నతాధి కారులు వెంటనే స్పందించారు.సూర్జిత్‌ తల్లిదండ్రులు ఇద్దిరినీ VRలో పెట్టారు.ఈ పరువు హత్య కేసులో కింది స్థాయి కులం వారనే కోణం కూడా ఉండడంతో అన్ని రకాలుగా ద ర్యాప్తు చేస్తున్నారు.సంఘటనా స్థలంలో సీసీటీవీ ఫుటేజ్‌ను స్వాధీనం చేసుకున్నారు. మృ తదేహాన్ని తిరునెల్వేలి ప్రభుత్వ ఆసుపత్రికి పోస్ట్‌మార్టం కోసం తరలించారు.వివరాలు ఇలా ఉన్నాయి...హత్యకు గురైన కవిన్‌ చెన్నైలో ...

భర్త నాలుక కొరికి,నమిలి మింగేసిన భార్య...

Image
భర్త నాలుక కొరికి,నమిలి మింగేసిన భార్య VS9TV న్యూస్,బీహార్ : బీహార్‌,గయాజిల్లాలోని ఖిజ్రాసరాయ్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన ఓ గ్రామంలో ఛోటే దాస్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు.అయితే అతడికి చాలా రోజుల క్రితమే వివాహం కాగా...వీరి కాపురం హాయిగానే సాగుతోంది.అయితే మొన్నటి వరకు ఇద్దరూ ప్రేమగానే ఉన్నా ఈ మధ్య కాలంలో వీరి మనస్పర్థలు వచ్చాయి.దీంతో తరచుగా గొడవలు పడుతు న్నారు.ఎప్పటిలాగే మంగళవారం రోజు కూడా వీరిద్దరి మధ్య గొడవ జరిగింది.ఇద్దరూ ఒకరినొకరు మాటా మాటా అనుకున్నారు.ఈక్రమంలోనే ఛోటే దాస్‌ భార్య తీవ్ర ఆగ్రహా నికి గురైంది.కోపంతో ఊగిపోతూ...భర్త నాలుకను తన నోటితో పట్టేసింది.పళ్లతో నా లుకను గట్టిగా కొరికేసింది.భర్త ఎంత వదిలించుకోవాలని చూసిన గట్టిగా పట్టుకున్న ఈ మె నాలుక పూర్తిగా తెగిపోయే వరకు ఆగలేదు.ఆపై అతడి నాలుక ఆమె నోట్లోకి రాగా... అతడి కళ్ల ముందే నమిలి మింగేసింది.భార్య నాలుక కొరికేయగానే...తీవ్ర రక్తస్రావం అ యింది.దీంతో ఛోటే దాస్ బయటకు పరుగులు పెట్టాడు.ఇంత జరుగుతున్నా...ఆస్పత్రి లో కూడా భార్యా,భర్తలు గొడవ పడుతూనే ఉన్నట్లు గ్రామస్థులు చెబుతున్నారు.

ప్రెస్ క్లబ్ ఏర్పాటు పట్ల సభ్యులకు అభినందనలు...ఎం.ఎ.గఫూర్,మాజీ ఎమ్మెల్యే,సిపిఎం మాజీ కేంద్ర కమిటీ సభ్యులు...

Image
ప్రెస్ క్లబ్ ఏర్పాటు పట్ల సభ్యులకు అభినందనలు ఎం.ఎ.గఫూర్,మాజీ ఎమ్మెల్యే, సిపిఎం మాజీ కేంద్ర కమిటీ సభ్యులు VS9TV న్యూస్,కర్నూలు ప్రతినిధి : కర్నూలు నగరంలో ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయడం అభినందనీయమని మాజీ శాసన సభ్యు లు,సిపిఎం మాజీ కేంద్ర కమిటీ సభ్యులు ఎం.ఎ.గఫూర్ సంతోషం వ్యక్తం చేశారు.బుధ వారం కలెక్టరేట్ లో ఓ పని నిమిత్తం ఎం.ఎ.గఫూర్ హాజరయ్యారు.ఈ సందర్భంగా కలెక్ట రేట్ ఆవరణంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు తోపాటు పలువురు సభ్యులు,మీడియా ప్రతినిధులు వారిని మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ నేపథ్యంలో కర్నూలు నగరంకు పాత్రికేయుల క ల సాకారం అయిందని,ప్రెస్ క్లబ్ కార్యాలయం ఏర్పాటుకు క్వార్టర్స్ కేటాయించినట్లు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు,సభ్యులు వివరించారు.ప్రెస్ క్లబ్ ను పరిశీలించన అనంతరం మాట్లాడారు .కర్నూలులో ఎన్నో సంవత్సరాలుగా ప్రెస్ క్లబ్ లేకపోవడం బాధాకరం అన్నారు.ఏది ఏ మైనా కర్నూలులో ప్రెస్ క్లబ్ ఏర్పాటుకు ప్రభుత్వ క్వార్టర్స్ కేటాయించిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ రంజిత్ భాషకు అభినందనలు తెలియచేశారు.ఈ ప్రభుత్వ గతంలో రాష్ట్ర రాజ ధాని సమయంలో ఏర్పాటు చేయడం జరిగింది.అయితే ప్రస్తుతం పలు ప్రభుత్వ క్వార్టర్స్ దుస్థ...

ఘనంగా ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్ పోర్ట్ వర్కర్స్( AIRTWF)జాతీయ మహాసభలు ప్రారంభం...హాజరైన రాయలసీమ జిల్లాల ప్రతినిధులు...

Image
ఘనంగా ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్ పోర్ట్ వర్కర్స్ ( AIRTWF) జాతీయ మహాసభలు ప్రారంభం హాజరైన రాయలసీమ జిల్లాల ప్రతినిధులు VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి : ఆటో,లారీ,ఇతర రవాణా రంగ కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాటాలు నిర్వహిస్తూ ఆ కార్మికులకు అండగా ఉన్న ఆల్ ఇండియా ట్రాన్స్ పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ (AIRTW F)కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో మంగళవారం ఘనంగా ప్రారంభం ప్రారంభ మయ్యాయి.ఈ మహాసభలు ఈ నెల 29వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జరుగుతాయి. మహాసభలలో రాయలసీమ జిల్లాలు అయిన కర్నూలు,నంద్యాల,అనంతపురం,సత్య సా యి,కడప,జిల్లా నుడి ప్రతినిదులు కె.ప్రభాకర్,పి.మహిమూద్,ఎల్లయ్య,లక్ష్మన్న,శ్రీనివాసు లు,రఫి,శ్రీనివాసరెడ్డి,ప్రతినిదులుగా వెళ్ళారు.మహాసభలకు సీఐటీయు అల్ ఇండియా ప్ర ధాన కార్యక్రదర్శి తపన్ సేన్ ప్రారంభ ఉపన్యాసం చేశారు.విదేశి ప్రతినిధులు,భారత దే శవ్యాప్తంగా ప్రతి నిధులు హాజరయ్యారు.

ఈనెల 31న ముత్తైదువులకు పసుపు పారాణి...

Image
ఈనెల 31న ముత్తైదువులకు పసుపు పారాణి VS9TV న్యూస్,కర్నూలు క్రైం : పవిత్ర శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని ఈ నెల 31న గురువారం దక్షిణ శిరిడి సాయి బాబా మందిరం,కర్నూలు నందు ఉదయం నుండి సాయంత్రం వరకు ముత్తైదువులకు పసుపు పారాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకు లు మహాబలేస్ మంగళవా రం ఒక ప్రకటనలో తెలిపారు.మాతృమూర్తులను లక్ష్మీ స్వరూపంగా భావించి పసుపు,కుం కుమ,ఫల,తాంబూలం,గాజులు మొదలైన మంగళ ద్రవ్యాలను ఉచితంగా అందించను న్నట్లు ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొనాలని వారు విజ్ఞప్తి చేశారు.

రాత్రి వేళ గస్తీ పటిష్టం...లాడ్జిలలో ఆకస్మిక తనిఖీలు...

Image
రాత్రి వేళ గస్తీ పటిష్టం...లాడ్జిలలో ఆకస్మిక తనిఖీలు VS9TV న్యూస్,కర్నూలు క్రైం : రాత్రి గస్తీని పటిష్టం చేసి నేరాల నియంత్రణకు కృషి చేయాలని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ పోలీసు అధికారులను ఆదేశించారు.జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కర్నూ లు పోలీసులు రాత్రి వేళల్లో గస్తీని పటిష్టం చేశారు. అర్ధరాత్రి దాటిన తర్వాత లాడ్జిలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.లాడ్జిలలో ఎవరైనా అనుమానస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.  అనుమానం వ్యక్త పరిచిన వారి వివరాలను ఆరా తీశారు.లాడ్జిలలో రాత్రి బస చేసే వ్య క్తుల గుర్తింపు కార్డులు తీసుకొని,వివరాలు నమోదు చేయాలన్నారు.పరిసరాలు స్పష్టం గా కన్పించేలా తప్పనిసరిగా సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని లాడ్జీల యజమా నులు పోలీసులకు సహకరించాలని సూచించారు.రాత్రి వేళల్లో ఎటువంటి నేరాలు జర గకుండా రాత్రి గస్తీని పటిష్ట చేశారు.