ప్రెస్ క్లబ్ ఏర్పాటు పట్ల సభ్యులకు అభినందనలు...ఎం.ఎ.గఫూర్,మాజీ ఎమ్మెల్యే,సిపిఎం మాజీ కేంద్ర కమిటీ సభ్యులు...
ప్రెస్ క్లబ్ ఏర్పాటు పట్ల సభ్యులకు అభినందనలుఎం.ఎ.గఫూర్,మాజీ ఎమ్మెల్యే,సిపిఎం మాజీ కేంద్ర కమిటీ సభ్యులు
కర్నూలు నగరంలో ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయడం అభినందనీయమని మాజీ శాసన సభ్యు లు,సిపిఎం మాజీ కేంద్ర కమిటీ సభ్యులు ఎం.ఎ.గఫూర్ సంతోషం వ్యక్తం చేశారు.బుధ వారం కలెక్టరేట్ లో ఓ పని నిమిత్తం ఎం.ఎ.గఫూర్ హాజరయ్యారు.ఈ సందర్భంగా కలెక్ట రేట్ ఆవరణంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు తోపాటు పలువురు సభ్యులు,మీడియా ప్రతినిధులు వారిని మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ నేపథ్యంలో కర్నూలు నగరంకు పాత్రికేయుల క ల సాకారం అయిందని,ప్రెస్ క్లబ్ కార్యాలయం ఏర్పాటుకు క్వార్టర్స్ కేటాయించినట్లు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు,సభ్యులు వివరించారు.ప్రెస్ క్లబ్ ను పరిశీలించన అనంతరం మాట్లాడారు .కర్నూలులో ఎన్నో సంవత్సరాలుగా ప్రెస్ క్లబ్ లేకపోవడం బాధాకరం అన్నారు.ఏది ఏ మైనా కర్నూలులో ప్రెస్ క్లబ్ ఏర్పాటుకు ప్రభుత్వ క్వార్టర్స్ కేటాయించిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ రంజిత్ భాషకు అభినందనలు తెలియచేశారు.ఈ ప్రభుత్వ గతంలో రాష్ట్ర రాజ ధాని సమయంలో ఏర్పాటు చేయడం జరిగింది.అయితే ప్రస్తుతం పలు ప్రభుత్వ క్వార్టర్స్ దుస్థితి అధ్వానంగా ఉన్నాయని,వాటిని పునః నిర్మాణం చేయాలనీ కోరారు.కర్నూలులో శాశ్వత ప్రెస్ క్లబ్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని,ప్రజల కోసం ఏర్పాటు అవు తున్న ప్రెస్ క్లబ్ ఉచితంగా ఇచ్చేందుకు యంత్రాంగం ప్రయత్నించాలని విజ్ఞప్తి చేశారు.ప్ర జా సంఘాలు,ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వానికి తీసుకొచ్చేందుకు ప్రెస్ క్ల బ్ ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.ఈ ప్రెస్ క్లబ్ ఏర్పాటుకు కృషిచేసిన అధ్య క్షులు,సభ్యులను ఆయన అభినందించారు.ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొత్తూ రు సత్యనారాయణ గుప్తా,సీనియర్ పాత్రికేయులు పెద్దయ్య,చిన్న రామాంజనేయులు,స త్యనారాయణ, ఫోటోగ్రాఫర్ కరణ్,తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment