శంషాబాద్ సమీపంలోని సులోచన ఫార్మ్ గెస్ట్ హౌస్ లో సిట్ అధికారులు సోదాలు... 12బాక్సుల్లో ఉన్న రూ.11కోట్ల నగదును స్వాధీనం...
శంషాబాద్ సమీపంలోని సులోచన ఫార్మ్ గెస్ట్ హౌస్ లో సిట్ అధికారులు సోదాలు12బాక్సుల్లో ఉన్న రూ.11కోట్ల నగదును స్వాధీనం
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుడి సమాచారంతో రూ.11కోట్లు నగదు సిట్ బృందం స్వాధీనం చేసుకున్నారు.వివరాలు ఇలా ఉన్నాయి...హైదరాబాద్ నగరంలోని పది ప్రాం తాల్లో సిట్ బృందం సోదాలు జరుపుతోంది.ఈ నేపథ్యంలో ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.సిట్ అధికారులు నిందితుల నివాసాలు,కార్యాల యాల్లో సోదాలు జరుపుతూ బుధవారం వేకువజామున భారీగా నగదును స్వాధీనం చే సుకున్నారు.
ఈ కేసులో నిందితుడు రాజ్ కెసిరెడ్డి సూచనల మేరకు 12బాక్సుల్లో భద్రపరిచిన రూ. 11కోట్ల నగదును అధికారులు సీజ్ చేశారు.కేసులో ఏ40గా ఉన్న వరుణ్ పురుషోత్తం ఇచ్చిన సమాచారం ఆధారంగా శంషాబాద్ మండలంలోని కాచారం గ్రామంలో ఉన్న సులోచన ఫార్మ్ గెస్ట్ హౌస్లో సిట్ అధికారులు తనిఖీలు చేసి ఈ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు.ఏ1 రాజ్ కెసిరెడ్డి ఆదేశాల మేరకు ఏ40 వరుణ్, ఏ12 చాణక్య ఈ రూ.1 1కోట్లు దాచినట్లు సిట్ విచారణ సందర్భంలో అంగీకరించారు.2024,జూన్లో ఈ మొ త్తం దాచినట్లుగా అధికారులు గుర్తించారు.నిందితుల సమాచారంతో సిట్ అధికారులు హైదరాబాద్ నగరంలో పదిప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు.
Comments
Post a Comment