ప్రమాదంలో మహిళా సాఫ్ట్వేర్ దుర్మరణం...
ప్రమాదంలో మహిళా సాఫ్ట్వేర్ దుర్మరణం
హైదరాబాద్,మణికొండలో కు మార్తెలను స్కూల్ బస్సు ఎక్కించి తిరిగి వస్తుండగా వెనక నుంచి వే గంగా దూసుకొచ్చిన ఓ ట్యాంకర్ స్కూటీని ఢీ కొట్టడంతో ఓ మహి ళా సాఫ్ట్వేర్ ఇంజనీర్ దుర్మరణం పాలైన ఘటన రాయదుర్గం పోలీ స్ స్టేషన్ పరిధిలో చోటు చేసు కుంది.సిఐ సీహెచ్.వెంకన్న తెలి పిన వివరాలు ఇలా ఉన్నాయి...ప్రకాశం జిల్లా,కందుకూరు మండలం,కొండముదుసు పా లెంకు చెందిన దంపతులు వెంకటేశ్వర్లు, ఇరువురి శాలిని(38) మణికొండలోని బీఆర్సీ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు.భార్యాభర్తలిద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పని చేస్తు న్నారు.మూడు రోజుల క్రితం పిల్లలతో కలిసి వైజాగ్ వెళ్లగా,వెంకటేశ్వర్లు విజయవాడలో ఆగిపోయారు.కుమార్తెలను తీసుకొని శాలిని గత సోమవారం రాత్రి మణికొండకు వచ్చిం ది.భారతీయ విద్యాభవన్లో పెద్ద కుమార్తె సుదీక్ష,9వ తరగతి,చిన్న కుమార్తె సహస్ర,4వ తరగతి చదువుతున్నట్లు పేర్కొన్నారు. స్కూల్ బస్సు వెళ్లిపోవడంతో ఇద్దరు కూతుళ్లను స్కూటీపై తీసుకెళ్లి ముందు స్టాప్లో బస్సు ఎక్కించింది.అనంతరం స్కూటీపై తిరిగి వస్తుం డగా మణికొండలోని సుందర్ గార్డెన్ ఎదురుగా వెనక నుంచి అతి వేగంగా వచ్చిన వాటర్ ట్యాంకర్ స్కూటీని ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగిందని అన్నారు. ప్రమాదంలో కిందపడి పోయిన శాలిని తల,శరీర భాగాలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెం దినట్లు చెప్పారు.డ్రైవర్ నిర్లక్ష్యంగా,అతి వేగంగా ట్యాంకర్ నడపడం వల్ల ప్రమాదం జరి గిందని మృతురాలి సోదరుడు లోకేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు.ఘటన జరి గిన రోడ్డులో సీసీ కెమెరా పుటేజీలను పోలీసులు సేకరిస్తున్నారు.ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు.ఈ మేరకు పోలీసులు కేసు న మోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Comments
Post a Comment