ప్రమాదంలో మహిళా సాఫ్ట్‌వేర్‌ దుర్మరణం...

ప్రమాదంలో మహిళా సాఫ్ట్‌వేర్‌ దుర్మరణం

VS9TV న్యూస్,హైదరాబాద్ :
హైదరాబాద్,మణికొండలో కు మార్తెలను స్కూల్‌ బస్సు ఎక్కించి తిరిగి వస్తుండగా వెనక నుంచి వే గంగా దూసుకొచ్చిన ఓ ట్యాంకర్‌ స్కూటీని ఢీ కొట్టడంతో ఓ మహి ళా సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ దుర్మరణం పాలైన ఘటన రాయదుర్గం పోలీ స్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసు కుంది.సిఐ సీహెచ్‌.వెంకన్న తెలి పిన వివరాలు ఇలా ఉన్నాయి...ప్రకాశం జిల్లా,కందుకూరు మండలం,కొండముదుసు పా లెంకు చెందిన దంపతులు వెంకటేశ్వర్లు, ఇరువురి శాలిని(38) మణికొండలోని బీఆర్‌సీ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నారు.భార్యాభర్తలిద్దరు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లుగా పని చేస్తు న్నారు.మూడు రోజుల క్రితం పిల్లలతో కలిసి వైజాగ్‌ వెళ్లగా,వెంకటేశ్వర్లు విజయవాడలో ఆగిపోయారు.కుమార్తెలను తీసుకొని శాలిని గత సోమవారం రాత్రి మణికొండకు వచ్చిం ది.భారతీయ విద్యాభవన్‌లో పెద్ద కుమార్తె సుదీక్ష,9వ తరగతి,చిన్న కుమార్తె సహస్ర,4వ తరగతి చదువుతున్నట్లు పేర్కొన్నారు. స్కూల్‌ బస్సు వెళ్లిపోవడంతో ఇద్దరు కూతుళ్లను స్కూటీపై తీసుకెళ్లి ముందు స్టాప్‌లో బస్సు ఎక్కించింది.అనంతరం స్కూటీపై తిరిగి వస్తుం డగా మణికొండలోని సుందర్‌ గార్డెన్‌ ఎదురుగా వెనక నుంచి అతి వేగంగా వచ్చిన వాటర్‌ ట్యాంకర్‌ స్కూటీని ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగిందని అన్నారు. ప్రమాదంలో కిందపడి పోయిన శాలిని తల,శరీర భాగాలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెం దినట్లు చెప్పారు.డ్రైవర్‌ నిర్లక్ష్యంగా,అతి వేగంగా ట్యాంకర్‌ నడపడం వల్ల ప్రమాదం జరి గిందని మృతురాలి సోదరుడు లోకేష్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు.ఘటన జరి గిన రోడ్డులో సీసీ కెమెరా పుటేజీలను పోలీసులు సేకరిస్తున్నారు.ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు.ఈ మేరకు పోలీసులు కేసు న మోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....