8వ తరగతి విద్యార్థినితో 40 ఏళ్ల వ్యక్తికి పెళ్లి...బాలిక ఫిర్యాదుతో బాలిక తల్లి,వరుడు, మధ్యవర్తి,వివాహం జరిపిన పూజారిపై కేసు నమోదు...
8వ తరగతి విద్యార్థినితో 40 ఏళ్ల వ్యక్తికి పెళ్లిబాలిక ఫిర్యాదుతో బాలిక తల్లి,వరుడు,మధ్యవర్తి,వివాహం జరిపిన పూజారిపై కేసు నమోదు.
రంగారెడ్డి జిల్లాల్లో బాల్య వివాహం కలకలం రేపింది.13 ఏళ్ల బాలికను 40 ఏళ్ల వ్యక్తి వి వాహం చేసుకున్నాడు.అయితే బాలిక తాను చదువుతున్న స్కూల్ ఉపాధ్యాయులకు ఈ విషయం తెలియజేయడంతో రెండు నెలల కిందట జరిగిన ఈ ఘటన వెలుగులోకి వచ్చిం ది.వివరాలు ఇలా ఉన్నాయి...రంగారెడ్డి జిల్లా,నందిగామకు ఓ మహిళ భర్త కొన్నేళ్ల కింద ట చనిపోయాడు.ఆమెకు అప్పటికే ఒక కొడుకు,కూతురు ఉన్నారు. ఆమె కూతురు (13) ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతుంది.ఆ మహిళ కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తుంది.అయితే కొన్ని నెలల కిందట కూతురికి పెళ్లి చేయాలని ఆమె భావించింది.కుటుంబ పోషణ భారం కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది.ఈ క్రమంలోనే ఓ మధ్యవర్తిని ఆశ్రయించింది.అయితే మధ్యవర్తి రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంకు చెం దిన ఓ 40 ఏళ్ల శ్రీనివాస్ గురించి చెప్పాడు.అతడికి ఆస్తి బాగా ఉందని తెలిపాడు.ఈ క్ర మంలోనే మే,28న ఓ గుడిలో బాలికకు 40ఏళ్ల వ్యక్తితో వివాహం జరిపించారు.అయితే బాలిక మైనర్ కావడం,ఆమె ఇష్టం లేకుండా పెళ్లి జరగడంతో ఈ విషయాన్ని స్కూల్ టీ చర్కు తెలియజేసింది.దీంతో వారు మండల అధికారులకు,పోలీసులకు సమాచారం ఇ చ్చారు.దీంతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. బాలిక తల్లి,పెళ్లికొడుకు శ్రీ నివాస్,మధ్యవర్తి,వివాహం జరిపించిన పూజారిపై బాల్య వివాహ నియంత్రణ చట్టం కిం ద (ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్,2006) పోలీసులు కేసు నమోదు చేశారు.అ నంతరం బాలికను రెస్క్యూ హోంకు తరలించారు.ఇక ఈ ఘటన స్థానికంగా కలకలం రే పింది.
Comments
Post a Comment