బ్యాంకులు పకడ్బందీ భద్రత ఏర్పాటు చేసుకోవాలి...జిల్లాలోని బ్యాంకర్లతో సమీక్ష... విక్రాంత్ పాటిల్,కర్నూలు జిల్లా ఎస్పీ...

బ్యాంకులు పకడ్బందీ భద్రత ఏర్పాటు చేసుకోవాలి
నేర నివారణే ప్రథమ లక్ష్యం
ఖాతాదారులను హెచ్చరిస్తూ సైబర్ మోసాలను తెలియజేయాలి
భద్రతా ప్రమాణాలపై జిల్లాలోని బ్యాంకర్లతో సమీక్ష
విక్రాంత్ పాటిల్,కర్నూలు జిల్లా ఎస్పీ

VS9TV న్యూస్,కర్నూలు క్రైం :
నేర నివారణే ప్రథమ లక్ష్యంగా కర్నూలు జిల్లాలోని అన్ని బ్యాంకులు పకడ్బందీ భద్రతను ఏర్పాటు చేసుకోవాలని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు.బ్యాంకుల భద్రతా ప్రమా ణాలపై జిల్లా ఎస్పీ జిల్లాలోని అన్ని బ్యాంకుల మేనేజర్లతో బుధవారం జిల్లా పోలీసు కా ర్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఇటీవల మ ధ్యప్రదేశ్,మహరాష్ట్ర,తమిళనాడు,హర్యానా వంటి పలు రాష్ట్రాలలో హైవే ప్రక్కన ఉన్న బ్యాంకుల్లో జరిగిన దొంగతనాలను గుర్తుచేశారు.అలాంటి సంఘటనలు జిల్లాలో జరగ కుండా బ్యాంకు అధికారులు పకడ్బందీగా భద్రతను ఏర్పాటు చేసుకోవాలన్నారు.ఈ సంథ ర్భంగా జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ...బ్యాంకు లోపల,బయట అన్ని ప్రదేశా ల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజా భద్రత చట్టం ప్రకారం మన్నిక కలిగిన సెన్సార్ సీసీ కెమెరాలు, బ్యాంకులలో దొంగలు పడిన వెంటనే అత్యవసర పరిస్థితుల్లో సెక్యూరిటీ అలారం మోగే విధంగా అందరూ అప్రమత్తం అయి బ్యాంకు వారికి మెసెజ్లు,అలర్ట్స్ వచ్చే విధంగా భధ్రత ను ఏర్పాటు చేసుకోవాలన్నారు.
ప్రతి బ్యాంకులో సెక్యూరిటీ గార్డులు ఉండే విధంగా చూసుకోవాలన్నారు.లారీ డ్రైవర్లు లా రీలలో కార్లను డెలివరీ చేసేందుకు ఇతర రాష్ట్రాల నుండి వచ్చి దొంగతనాలకు పాల్పడు తున్నారన్నారు.సెలవు రోజులలో రెక్కి చేస్తారన్నారు. కొందరి ఖాతాదారుల ఖాతాలలో అతి పెద్ద మొత్తాలలో లావాదేవీలు జరిగినప్పుడు బ్యాంకు అధికారులు అప్రమత్తంగా ఉం టూ సైబర్ నేరగాళ్ల గురించి ఖాతా దారులను అప్రమత్తం చేయాలన్నారు. ఓటీపీ ప్రాఢ్స్, ఎపికె ఫైల్స్, డిజిటల్ ప్రాఢ్స్,ఇన్వెస్టిమెంట్ ప్రాఢ్స్ గురించి ఖాతాదారులకు బ్యాంకులలో హెచ్చరిస్తూ సైబర్ మోసాల గురించి తెలియజేస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించా లన్నారు.జిల్లాలోని పోలీసు అధికారులందరూ బ్యాంకులను సందర్శించి సెక్యూరిటీ ప రంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి బ్యాంక్ అధికారులతో మాట్లాడాలని ఆదేశాలు జారీ చేసినట్లు ఎస్పీ తెలిపారు.ఈ కార్యక్రమంలో కర్నూలు డిఎస్పీ జె.బాబు ప్రసాద్,ఎస్బి ఐ మేనేజర్ అబ్దుల్ రావూఫ్,కరూర్ వైశ్య బ్యాంక్ పీరయ్య,స్పెషల్ బ్రాంచ్ సిఐ తేజమూ ర్తి,కర్నూలు పట్టణ సిఐలు రామయ్య నాయుడు,నాగరాజా రావు,శ్రీధర్,విక్రమ్ సింహా, చంద్రబాబు నాయుడు,మన్సురుద్దీన్,నాగశేఖర్,సైబర్ ల్యాబ్ సిఐ వేణుగోపాల్,ఎస్సై లు,సైబర్ ల్యాబ్ సిబ్బంది పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....