ప్రభుత్వ పథకాల పేరిట సైబర్ నేరగాళ్ల మోసాలు...విక్రాంత్ పాటిల్,జిల్లా ఎస్పీ...
ప్రభుత్వ పథకాల పేరిట సైబర్ నేరగాళ్ల మోసాలుసైబర్ నేరాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలిపథకాల పేరుతో వచ్చే తెలియని లింకులను క్లిక్ చేయవద్దుబ్యాంకు ఖాతాల ఓటిపిలు చెబితే మోసపోతారు...జాగ్రత్త!జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్
ప్రభుత్వ పథకాలైన పీఎం కిసాన్, ముద్ర లోన్స్,సూర్యఘర్,అమ్మవ డి వంటి పథకాల పేరుతో సైబ ర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతు న్నారని,ప్రజలు అప్రమత్తంగా ఉం డాలని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటి ల్ బుధవారం తెలిపారు.ఇది ప్ర భుత్వం ప్రారంభించిన కొత్త పథ కం.ఇప్పుడే దరఖాస్తు చేసుకోం డి.మీకు రూ.50వేల రాయితీ’ అంటూ ఆకర్షించి ఖాతాలను కొల్లగొడుతున్నారు.ఆయా పథకాలకు దరఖాస్తు చేసుకున్న వారిని ఎంచుకొని మోసాలకు పాల్పడుతున్నారని,ఇ లాంటి మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు.ఆయా పథకాల పేరుతో మొబైల్ కు వచ్చే తెలియని లింకులను క్లిక్ చేయవద్దన్నారు.ఓటీపీలు చెబితే మోసపోయే అవకాశం ఉంద ని హెచ్చరించారు.
జిల్లా ఎస్పీ సూచనలు :
1. అపరిచిత లింకులను నమ్మవద్దు.ప్రభుత్వ పథకాలకు సంబంధించిన దరఖాస్తుల కో సం అధికారిక వెబ్సైట్లను మాత్రమే ఉపయోగించాలి.
2. వ్యక్తిగత సమాచారం షేర్ చేయవద్దు.బ్యాంక్ ఖాతా వివరాలు,ఓటీపీ,పాస్వర్డ్లను ఎ వరి తోనూ పంచుకోవద్దు.
3. అపరిచిత కాల్స్ వస్తే 1930నంబరుకు కాల్ చేయాలి.అదేవిధంగా www.cyber crime.gov.inలో ఫిర్యాదు చేయాలి.
4.ఇలాంటి మోసాల గురించి కుటుంబసభ్యులు,స్నేహితులకు తెలియజేసి సైబర్ మోసాల బారిన పడకుండా అవగాహన పెంచాలి.
5. ప్రభుత్వ పథకాల సమాచారం కోసం www.gov.in,nic.in లాంటి అధికారిక డొమైన్లను మాత్రమే ఉపయోగించాలి.
Comments
Post a Comment