కొత్త బస్టాండ్ ప్రాంతంలో వేశ్యల వ్యాపారాన్ని అరికట్టండి...డివైఎఫ్ ఐ...
కొత్త బస్టాండ్ ప్రాంతంలో వేశ్యల వ్యాపారాన్ని అరికట్టండి...డివైఎఫ్ ఐ
కర్నూలు నగరం,కొత్త బస్టాండ్ ప్రాంతంలో జరుగుతున్న వేశ్యల వ్యాపారాన్ని అరికట్టాల ని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాఘవేంద్ర,అబ్దుల్లా జిల్లా ఉపాధ్యక్షులు హుస్సేన్ భాషా,సహాయ కార్యదర్శి మధు విజ్ఞప్తి చేశారు.గురువారం నాలుగవ పట్టణ సిఐ విక్రమ సింహను కలిసి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కర్నూలు కొత్తబస్టాండు సుందరయ్య సర్కిల్ వరకు వేశ్యలు వ్యాపారానికి కేంద్రంగా మార్చివేశా రని తెలియజేశారు.ఉదయం నుండి రాత్రి వరకు దాదాపు పదిమంది ఇక్కడే ఉంటున్నారని అ న్నారు.వారి వలన ఆధ్యా హాస్పిటల్ గాయత్రి హాస్పిటల్ నవయుగ హోటల్ మార్కెట్, యార్డు వివిధ ప్రజాసంఘాల కార్యాలయాలకు వస్తున్న మహిళలు చాలా ఇబ్బందులు ప డుతున్నారని అన్నారు.వేశ్యల కోసం వస్తున్న వారు ఏ మహిళలు కనబడిన వారు వెంట పడుతున్నారని,మహిళలు ఈ ప్రాంతంలో తిరగాలంటే భయపడుతున్న పరిస్థితి ఉంద న్నారు.వేశ్యలు మార్కెట్ కు వస్తున్న రైతులను వెంటపడి వేధిస్తున్నారని,వారి దగ్గర బల వంతంగా డబ్బులు గుంజుకుని వారి పైన దౌర్జన్యం చేస్తున్నారని పేర్కొన్నారు.రోడ్ల పైన తి రిగే విద్యార్థులు,మహిళలు ప్రజలందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉందని,వెంటనే వా రిపై చర్యలు తీసుకుని ఆ వ్యాపారాన్ని పూర్తిగా అరికట్టాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Post a Comment