తాగేందుకు బోరు నీళ్లు...అన్నంలో పురుగులు...గురుకుల పాఠశాల విద్యార్థుల పాదయాత్ర...
తాగేందుకు బోరు నీళ్లు...అన్నంలో పురుగులుగురుకుల పాఠశాల విద్యార్థుల పాదయాత్ర50రోజులుగా ఆందోళన చేస్తున్నా స్పందన కరువు రోడ్డెక్కిన విద్యార్థులుహాస్టల్కు అదనపు కలెక్టర్సమస్యలు పరిష్కరిస్తామని హామీ
సమస్యలు ఎవరూ పట్టించుకోవడం లేదని,తమ గోడును ఏకంగా కలెక్టర్కే చెప్పుకుం టామంటూ గురుకుల పాఠశాల విద్యార్థులు పాదయాత్రగా బయలుదేరారు.పోలీసులు న చ్చజెప్పినా ససేమిరా అన్న విద్యార్థులు అడుగు ముందుకే వేశారు.జోగుళాంబ గద్వాల జి ల్లా,ఉండవల్లి మండలం,పుల్లూరు గ్రామ శివారు అలంపూర్ చౌరస్తాలోని మహాత్మా జ్యో తిభాఫూలే బాలుర గురుకుల పాఠశాలను ఆరేళ్లుగా ఓ ప్రైవేటు భవనంలో కొనసాగిస్తు న్నారు.5 నుంచి 10వ తరగతి వరకు 480మంది,ఇంటర్లో 80మంది కలిపి మొత్తం 560 మంది ఇక్కడ విద్యనభ్యసిస్తున్నారు.తమకు కనీస సౌకర్యాలు కల్పించాలని 50 రోజులుగా మొత్తుకుంటున్నా ఎవరూ పట్టించుకోవడం లేదంటూ విద్యార్థులు ఆందోళన బాటపట్టారు.ఏకంగా జిల్లా కలెక్టర్ వద్దకు వెళ్లి తమ గోడును వెళ్లబోసుకుంటామంటూ తొమ్మిదవ,పదవ తరగతికి చెందిన 59మంది విద్యార్థులు రోడ్డెక్కారు.45కి.మీ.దూ రంలో ఉన్న కలెక్టరేట్కు పాదయాత్ర చేపట్టారు. పోలీసులు వచ్చి నచ్చజెప్పినా విద్యార్థు లు వినలేదు.సుమారు 9కి.మీ.వరకు వెళ్లారు.ఈ క్రమంలో విద్యార్థులు తమ సమస్యలపై ఏకరువు పెట్టారు.50రోజులుగా తాము బోరు నీరే తాగుతున్నామని,ఉపాధ్యాయులు మాత్రం ఫిల్టర్ నీళ్లు తాగుతున్నారని,తమకు సరిపడా మరుగుదొడ్లు కూడా లేవని,దీంతో బహిర్భూమికి బయటకు వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.ఉన్న 16 మరుగు దొడ్లను మరమ్మతు పేరిట భవన యజమాని మూసివేయించారని ఆరోపించారు.ఈ మధ్య తాము తింటున్న అన్నంలో పురుగులు వస్తున్నాయని చెప్పినా...పట్టించుకోవడం లేదని వాపోయారు.మళ్లీ జోక్యం చేసుకున్న ఉండవల్లి,మానవపాడు ఎస్సైలు శేఖర్, చంద్రకాంత్...మరికొంతమంది పోలీసులు కలిసి...ఇటిక్యాలపల్లి స్టేజీ వద్ద విద్యార్థులను సముదాయించారు.మీ సమస్యలు వినేందుకు జిల్లా అధికారులే మీ వద్దకు వచ్చేలా ఏర్పా ట్లు చేస్తామని పోలీసు అధికారులు హామీ ఇచ్చి అతి కష్టంమీద వారిని ఓ డీసీఎంలో ఎ క్కించి తిరిగి పాఠశాలకు తీసుకొచ్చారు.విషయం తెలిసిన అడిషనల్ కలెక్టర్ నర్సింగరా వు హాస్టల్కు చేరుకుని విద్యార్థుల సమస్యలపై ఆరా తీశారు.యుద్ధప్రాతిపదికన 30మరు గుదొడ్లు నిర్మిస్తామని,తాగునీటి వసతి కల్పిస్తామని,నాణ్యమైన బియ్యంతో భోజనం అం దిస్తామని,విద్యార్థుల సమస్యలు వినేందుకు ఫిర్యాదుల పెట్టె ఏర్పాటు చేస్తామని హామీ ఇ చ్చారు.
Comments
Post a Comment