ఫెడరల్ కోర్టు జడ్జిగా సరిత కోమటిరెడ్డి... నామినేట్ చేసిన ట్రంప్...
ఫెడరల్ కోర్టు జడ్జిగా సరిత కోమటిరెడ్డినామినేట్ చేసిన ట్రంప్మరో ఇద్దరు భారతీయ అమెరికన్లకూ కీలక పదవులు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రం ప్ తాజాగా ముగ్గురు భారతీయ అమెరికన్లను కీలక పదవులకు నా మినేట్ చేశారు.అందులో న్యూ యార్క్ లోని ఓ ఫెడరల్ కోర్టు జడ్జి పదవి కూడా ఉంది.'అమెరి కా డిస్ట్రిక్ట్ కోర్ట్ ఫర్ ది ఈస్టర్న్ డి స్ట్రిక్ట్ ఆఫ్ న్యూయార్క్'కు ప్రముఖ మహిళా న్యాయవాది సరిత కో మటిరెడ్డిని ట్రంప్ ప్రతిపాదించా రు.ఆమె నామినేషన్ ను గత సెనే ట్ కు సోమవారం పంపించారు.సరిత ప్రస్తుతం న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ అటార్నీ కా ర్యాలయంలో జనరల్ క్రైమ్స్ విభాగం డిప్యూటీ చీఫ్గా ఉన్నారు.ప్రతిష్ఠాత్మక కొలంబియా లా స్కూల్లో న్యాయశాస్త్ర పాఠాలను కూడా బోధిస్తుంటారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యా లు,నగదు అక్రమ చలామణీ నిరోధక సంస్థకు తాత్కాలిక డిప్యూటీ చీఫ్ గా సరిత 201 8,జూన్ నుంచి గత ఏడాది జనవరి వరకు ఉన్నారు.హార్వర్డ్ లా స్కూల్లో గ్రాడ్యుయేషన్ చేశారు.ప్రపంచ బ్యాంకులో రుణాలు అందించే విభా గమైన అంతర్జాతీయ పునర్నిర్మాణ, అభివృద్ధి బ్యాంకుకు అమెరికా ప్రతినిధిగా భారతీయ అమెరికన్ న్యాయవాది అశోక్ మైఖే ల్ ఇంట్ ట్రంప్ నామినేట్ చేశారు.పారిస్ కేంద్రంగా పనిచేసే ఆర్థిక సహకార,అభివృద్ధి సంస్థ (ఓఈసీడీ)కు తన రాయసాగా భారతీయ అమెరికన్ సీనియర్ దౌత్యవేత్త మనీషా సింగ్ ను ట్రంప్ నామినేట్ చేశారు.
Comments
Post a Comment