సమస్యల పరిష్కారం కోసం ఆగస్ట్,2న కలెక్టరేట్ ఎదుట ధర్నా...ఫ్యాప్టో...
సమస్యల పరిష్కారం కోసం ఆగస్ట్,
2న కలెక్టరేట్ ఎదుట ధర్నా...ఫ్యాప్టో
రాష్ట్రంలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కొరకు రాష్ట్ర ఫ్యాప్టో ఆ ధ్వర్యంలో ఆగస్ట్,2వ తేదీన అన్ని జిల్లాల కలెక్టరేట్ ఎదుట ధర్నా చేయాలని నిర్ణయం తీ సుకోవడం జరిగింది.దానికి అనుగుణంగా బుధవారం కర్నూలు నగరంలో సలాం ఖాన్ భవనంలో కర్నూలు జిల్లా ఫ్యాప్టో చైర్మన్ సేవా లాల్ నాయక్ (ఆప్టా)అధ్యక్షతన కర్నూలు జిల్లా ఫ్యాప్టో సన్నాహక సమావేశం జరిగింది.సమావేశానికి రాష్ట్ర ఫ్యాప్టో కో చైర్మన్ క ర్నూలు జిల్లా ఫ్యాప్టో ఇంచార్జి కాకి ప్రకాష్ రావు,ఫ్యాప్టో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జి. హృదయ రాజులు హాజరయ్యారు.ఈ సందర్బంగా కాకి ప్రకాష్ రావు మాట్లాడుతూ రాష్ట్రం లో ప్రభుత్వం అధికారంలో వచ్చి సంవత్సరం దాటిన ఉద్యోగ,ఉపాధ్యాయులకు రావాల్సి న అర్ధిక అంశాలపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు.కొత్తగా ప్రమోషన్,బదలీ పొందిన ఉపాధ్యాయులకు రెండు నెలలుగా జీతాలు లేవు.ఈ విషయంలో చర్యలు తీసు కోవాలని అధికారులను కోరిన వారిలో నిర్లక్ష్యంగా ఉన్నారన్నారు.ఈ నిర్లక్ష్యం పోవాలి అంటే జిల్లా వ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో తరలి రావాలని అన్నారు. హృదయ రాజు మాట్లాడుతూ బోధనకు సమయం ఇవ్వకుండా బోధనేతర కార్యక్రమాల కు ప్రాధాన్యత ఇచ్చే విధానంలో అధికారుల ఆదేశాలు వస్తున్నాయి.బోధనకు సమయం ఇ వ్వండి అని ఉపాధ్యాయులు అడగ వలసిన పరిస్థితి ఏర్పడింది.పెండింగ్ బకాయిలు పి.ఆ ర్.సి కమిటీ,ఐ ఆర్ ప్రకటన ఇవ్వాలనే డిమాండ్ లు నెరవేరాలి.కావున ప్రతి ఒక్కరు నిరస న కార్యక్రమానికి తరలిరావాలని పిలుపు ఇచ్చారు.అనంతరం సెక్రటరీ జనరల్ జి.భాస్కర్ (బిటిఎ)కార్యదర్శి నివేదికను సమర్పించారు.ఈ సమావేశంలో యుటిఎఫ్ కర్నూలు జి ల్లా అధ్యక్షులు రవి కుమార్,ప్రధాన కార్యదర్శి నవీన్ పాటిల్,ఎస్ టియు జిల్లా అధ్యక్షులు గోకారి,ప్రధాన కార్యదర్శి జనార్ధన్,ఎపిటిఎఫ్ 1938 జిల్లా ప్రధాన కార్యదర్శి మరియా నందం,ఆప్టా జిల్లా అధ్యక్షులు మధు సూదన్ రెడ్డి,ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా ప్ర ధాన కార్యదర్శి నారాయణ,డిటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గట్టు తిమ్మప్ప,బిటిఎ జిల్లా ప్ర ధాన కార్యదర్శి నందీశ్వరుడు,ఇతర నాయకులు పాల్గొన్నారు.
Comments
Post a Comment