ప్రభుత్వ పాఠశాలల్లోని సమస్యలను వెంటనే పరిష్కరించాలి...సిపిఎం డిమాండ్...

ప్రభుత్వ పాఠశాలల్లోని సమస్యలను వెంటనే పరిష్కరించాలి
సిపిఎం డిమాండ్

VS9TV న్యూస్,కల్లూరు :
కల్లూరు అర్బన్,32వ వార్డు,ముజాఫర్ నగర్ లో ఉన్న జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠ శాలను సిపిఎం ప్రతినిధి బృందం పరిశీలించారు.ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు కె సుధాకరప్ప,నగర కమిటీ సభ్యులు యస్.హుస్సేన్ భాష మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ పాఠశాల తరహాలో ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేస్తామని నాలుగు రంగులు వేసి రంగుల ప్రపంచం చూపించడం తప్ప,ప్రభుత్వ పాఠశాలలో సమ స్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లు ఉండిపోయాయని వారు విమర్శించారు. ముజాఫర్ నగర్ హైస్కూల్లో 500 మంది విద్యార్థులకు తగ్గట్లు మరుగుదొడ్లు లేక విద్యార్థు లు ఆరుబయటకు వెళ్లాల్సి వస్తుందని,అందువల్ల విద్యార్థులు చాలా ఇబ్బందులకు గురవు తున్నారని తెలిపారు.క్లాస్ రూమ్ లలో ఫ్యాన్లు సరిగ్గా పనిచేయడం లేదన్నారు.పాఠాలు చెప్పే డిజిటల్ బోర్డుకు సరైన నెట్వర్క్ సౌకర్యం లేదని,ప్రధానంగా ఇంగ్లీష్,హిస్టరీ సబ్జెక్టు లకు సంబంధించి టెన్త్ క్లాస్ విద్యార్థులకు పూర్తిస్థాయిలో బుక్స్ అందలేదని బూట్లు ఇచ్చిన అవి అన్ సైజ్ ఉండడం వల్ల వెనక్కు పంపామని వారు పేర్కొన్నారు.విద్యార్థులు తమ సమ స్యలను సిపిఎం పార్టీ బృందం దృష్టికి తీసుకువచ్చారని పేర్కొన్నారు. ప్రధానంగా కల్లూ రు,ముజఫర్ నగర్,పందిపాడు,లక్ష్మిపురం తదితర కాలనీలలో చదివే విద్యార్థులు టెన్త్ క్లా స్ తర్వాత ఇంటర్ చదువుకోవడానికి 10కిలోమీటర్లు దూరంలో ఉన్న కోల్స్ కాలేజీ సె యింట్ జోసెఫ్ కాలేజీ ఉస్మానియా కాలేజీలకు వెళ్లాల్సి వస్తుందని,అందువల్ల ముజఫర్ న గర్ లో ఒకేషనల్ జూనియర్ కాలేజ్ ఏర్పాటు చేస్తే విద్యార్థుల భవిష్యత్తుకు ఉపయోగ ప డుతుందని వారు తెలిపారు.కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రభుత్వ పాఠశాలలో వి ద్యార్థులు ఎదుర్కొంటున్న టువంటి సమస్యలను పరిష్కరించి,ముజఫర్ నగర్లో ఒకేషనల్ జూనియర్ కాలేజ్ ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు.జూనియర్ కాలేజీకి తగి న రూములు కూడా ఉన్నాయని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక సిపిఎం కార్య కర్తలు కె.సురేష్,మునిస్వామి,జె.రాజు,యం.మహేష్,పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....