రాత్రి వేళ గస్తీ పటిష్టం...లాడ్జిలలో ఆకస్మిక తనిఖీలు...
రాత్రి వేళ గస్తీ పటిష్టం...లాడ్జిలలో ఆకస్మిక తనిఖీలు
రాత్రి గస్తీని పటిష్టం చేసి నేరాల నియంత్రణకు కృషి చేయాలని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ పోలీసు అధికారులను ఆదేశించారు.జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కర్నూ లు పోలీసులు రాత్రి వేళల్లో గస్తీని పటిష్టం చేశారు. అర్ధరాత్రి దాటిన తర్వాత లాడ్జిలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.లాడ్జిలలో ఎవరైనా అనుమానస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
అనుమానం వ్యక్త పరిచిన వారి వివరాలను ఆరా తీశారు.లాడ్జిలలో రాత్రి బస చేసే వ్య క్తుల గుర్తింపు కార్డులు తీసుకొని,వివరాలు నమోదు చేయాలన్నారు.పరిసరాలు స్పష్టం గా కన్పించేలా తప్పనిసరిగా సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని లాడ్జీల యజమా నులు పోలీసులకు సహకరించాలని సూచించారు.రాత్రి వేళల్లో ఎటువంటి నేరాలు జర గకుండా రాత్రి గస్తీని పటిష్ట చేశారు.
Comments
Post a Comment