సామాజిక సేవకు గౌరవం...సిఐ శేషయ్యకు డాక్టరేట్ ప్రధానం...
సామాజిక సేవకు గౌరవం...సిఐ శేషయ్యకు డాక్టరేట్ ప్రధానం
ఎస్సైగా పోలీసుశాఖలో చేరినప్పటి నుండి ఎన్నో సామాజిక సేవలు చేసినందుకుగాను క ర్నూలు త్రీ టౌన్ సిఐ శేషయ్యకు అరుదైన గౌరవం దక్కింది. ఆయనకు డాక్టరేట్ ప్రధానం చేశారు.ఈ నేపథ్యంలో గురువారం ఢిల్లీలోని హోటల్ అశోక్ కన్వెక్షన్ హాల్ లో హెచ్ డి ఎసి ప్రతినిధులు సిఈఓ కవితా బజాజ్ చేతుల మీదుగా కర్నూలు త్రీ టౌన్ సిఐ శేషయ్యకి గౌరవ డాక్టరేట్ ను ప్రధానం చేశారు.ఈ కార్యక్రమంలో వివిధ దేశాల వారు హాజరయ్యా రు.ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ...గౌరవ డాక్టరేట్ రావడం పట్ల ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నామన్నారు.అంతేకాకుండా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు.సమా జంలో ప్రతి ఒక్కరు సామాజిక సేవలో పాల్గొనాలని సిఐ పిలుపునిచ్చారు.కర్నూలు త్రీ టౌన్ సిఐ శేషయ్యను జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్,అడిషనల్ ఎస్పీలు,డిఎస్పీలు,సిఐలు,బంధు వులు,శ్రేయోభిలాషులు అభినందనలు తెలిపారు.
Comments
Post a Comment