తమిళనాడులో సంచలనం...కొత్త పార్టీ పెట్టిన చిన్నమ్మ...
తమిళనాడులో సంచలనం...కొత్త పార్టీ పెట్టిన చిన్నమ్మ
తమిళనాడు ఎన్నికలకు కొన్ని నెలల ముందు అన్నా డీఎంకే బహిష్కృత నాయకురాలు శ శికళ సంచలన రాజకీయ ప్రకటన చేశారు.ఆమె జయలలిత (అమ్మ),ఎంజీఆర్,అన్నా ఆ దర్శ సూత్రాలతో కొత్త పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.మౌనంగా ఉంటూ ప్రజ లకు న్యాయం చేయలేనని ఆమె స్పష్టం చేశారు.జయలలిత జ యంతి సందర్భంగా రామ నాథపురంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో తమ నూతన పార్టీకి సంబంధించిన జెం డాను ఆవిష్కరించారు.ఈ మేరకు అన్నాడీఎంకేపై శశికళ తీవ్రంగా మండి పడ్డారు.జైలు నుండి విడుదలయ్యాక తనను మళ్లీ అరెస్టు చేయాలని అన్నాడీఎంకే ప్రయత్నిం చిందన్నా రు."పార్టీ పతనమవుతోంది.ఈపీఎస్ (ఎడప్పాడి పళనిస్వామి)కి కార్యకర్తలపై శ్రద్ధ లేదు" అని తెలిపారు.ఈపీఎస్ "స్వార్థపరుడని,తన గురించే చూసుకుంటాడని"శశికళ కీలక వి మర్శలు చేశారు.అయితే శశికళకు 2027 వరకు ఎన్నికలలో పోటీ చేయకుండా నిషే ధం ఉంది.జయలలితతో పాటు ఆస్తుల కేసులో శిక్ష పడగా,నాలుగు సంవత్సరాల జైలు అనంతరం 2021లో విడుదలయ్యారు 2016 డిసెంబర్లో జయలలిత మరణాంతరం అ న్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు.అయితే తాజాగా చెన్నైలో మ ద్దతుదారులతో సమావేశం తరువాతే ఆమె ఈ రాజకీయ నిర్ణయం ప్రకటించారు.ఆమె ప్ర కటన ఈపీఎస్కు ప్రత్యక్ష సవాల్ గా నిలిచింది.అన్నాడీఎంకే "పది రెట్లకుపైగా" ఓడిపో యినా,ప్రస్తుత డీఎంకే ప్రభుత్వం ప్రజల ను దోచుకుంటోందని ఆరోపించారు శశికళ."జ యలలిత పాలనలోని అన్నాడీఎంకే చేసిన మంచి పనులు తమిళనాడు ప్రజలు మర్చిపో లేరు" అని ఆమె స్పష్టం చేశారు.కొత్తగా పార్టీ ప్రారంభిం చడానికి ఇదే సరైన సమయమ ని శశికళ పేర్కొ న్నారు.
Comments
Post a Comment