నీటి వ్యవస్థను సమర్థవంతంగా నిర్వర్తించాలి... లీకేజీలు గుర్తించి వెంటనే మరమ్మత్తులు చేపట్టాలి... ప్రతిరోజు తాగునీటి నాణ్యతలను తనిఖీ చేయాలి... నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్...

నీటి వ్యవస్థను సమర్థవంతంగా నిర్వర్తించాలి
లీకేజీలు గుర్తించి వెంటనే మరమ్మత్తులు చేపట్టాలి
ప్రతిరోజు తాగునీటి నాణ్యతలను తనిఖీ చేయాలి
నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్

VS9TV న్యూస్,కర్నూలు కార్పోరేషన్ :
తాగునీటి వ్యవస్థను సమర్థవంతంగా నిర్వ హించడానికి ఇంజినీరింగ్ విభాగ అధికారులు, సచివాలయ,తాగునీటి సరఫరా విభాగ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని నగరపా లక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ సూచించారు.గురువారం ఆయన క్యాంపు కార్యాల యంలో ఇంజినీరింగ్ విభాగ అధికారులతో పాటు జూమ్ ద్వారా అమినిటీస్ కార్యదర్శుల తో తాగునీటి సరఫరాపై సమీక్ష నిర్వహించారు.నగర ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అం దించడంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు ఇవ్వ కూడదని స్పష్టం చేశారు.అతిసారం ప్రబల కుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని,ప్రతి రోజు ఉదయం అన్ని సచివాలయాల పరిధి లో అమినిటీస్ కార్యదర్శులు,తాగునీటి సరఫరా సిబ్బంది సంయుక్తంగా క్లోరిన్ పరీక్షలు నిర్వహించాలని సూచించారు.ప్రతి 15 రోజులకు ఒకసారి నీటి ట్యాంకులను శుభ్రప ర చాలని,ఆర్‌సి రిజిస్టర్‌ను తప్పనిసరిగా నిర్వహిం చాలని ఆదేశించారు.పైప్‌లైన్ లీకేజీలను గుర్తించి వెంటనే మరమ్మత్తులు చేపట్టాలన్నారు.డ్రైనేజీ కాలువల్లో ఉన్న పైప్‌లైన్ల తొలగిం పులో జాప్యంపై అసహనం వ్యక్తం చేశారు.గృహాల వద్ద సైతం డ్రైనేజీ కాలువల్లో పైప్‌లైన్ లేకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.ప్రజల నుండి ఫిర్యాదులు,పత్రిక ల్లో వార్తలు వచ్చేంత వరకు వేచి ఉండకుండా సమస్యలను సకాలంలో పరిష్కరించాలని ఆదేశించారు.ప్రతి రోజు ప్రజల్లో తిరిగితేనే సమస్యలు స్పష్టంగా తెలుసుకుంటామని,ఏ ఈ లు,డిఈలు అమినిటీస్ కార్యదర్శులతో కలిసి ఉదయం క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూ చించారు.తాగునీటి కొళాయి చార్జీల వసూళ్లను వేగవంతం చేయాలని,నిధుల లభ్యతను బట్టి గుత్తేదారులకు బిల్లులు మంజూరు చేయాల్సి ఉంటుందని తెలిపారు.
ఈ సమావేశంలో ఎస్ఈ రమణ మూర్తి,ఎంఈలు మనోహర్ రెడ్డి,గిరిరాజ్,డిఈఈలు ప వన్ కుమార్ రెడ్డి,నరేష్,క్రిష్ణలత,శ్రీనివాసన్,సూపరింటెండెంట్ మంజూర్ బాష,ఏఈలు జ నార్ధన్,ప్రవీణ్ కుమార్ రెడ్డి,వైష్ణవి,ఖాసీం,మహేష్,తదితరులు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....