నీటి వ్యవస్థను సమర్థవంతంగా నిర్వర్తించాలి... లీకేజీలు గుర్తించి వెంటనే మరమ్మత్తులు చేపట్టాలి... ప్రతిరోజు తాగునీటి నాణ్యతలను తనిఖీ చేయాలి... నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్...
నీటి వ్యవస్థను సమర్థవంతంగా నిర్వర్తించాలిలీకేజీలు గుర్తించి వెంటనే మరమ్మత్తులు చేపట్టాలిప్రతిరోజు తాగునీటి నాణ్యతలను తనిఖీ చేయాలినగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్
తాగునీటి వ్యవస్థను సమర్థవంతంగా నిర్వ హించడానికి ఇంజినీరింగ్ విభాగ అధికారులు, సచివాలయ,తాగునీటి సరఫరా విభాగ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని నగరపా లక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ సూచించారు.గురువారం ఆయన క్యాంపు కార్యాల యంలో ఇంజినీరింగ్ విభాగ అధికారులతో పాటు జూమ్ ద్వారా అమినిటీస్ కార్యదర్శుల తో తాగునీటి సరఫరాపై సమీక్ష నిర్వహించారు.నగర ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అం దించడంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు ఇవ్వ కూడదని స్పష్టం చేశారు.అతిసారం ప్రబల కుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని,ప్రతి రోజు ఉదయం అన్ని సచివాలయాల పరిధి లో అమినిటీస్ కార్యదర్శులు,తాగునీటి సరఫరా సిబ్బంది సంయుక్తంగా క్లోరిన్ పరీక్షలు నిర్వహించాలని సూచించారు.ప్రతి 15 రోజులకు ఒకసారి నీటి ట్యాంకులను శుభ్రప ర చాలని,ఆర్సి రిజిస్టర్ను తప్పనిసరిగా నిర్వహిం చాలని ఆదేశించారు.పైప్లైన్ లీకేజీలను గుర్తించి వెంటనే మరమ్మత్తులు చేపట్టాలన్నారు.డ్రైనేజీ కాలువల్లో ఉన్న పైప్లైన్ల తొలగిం పులో జాప్యంపై అసహనం వ్యక్తం చేశారు.గృహాల వద్ద సైతం డ్రైనేజీ కాలువల్లో పైప్లైన్ లేకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.ప్రజల నుండి ఫిర్యాదులు,పత్రిక ల్లో వార్తలు వచ్చేంత వరకు వేచి ఉండకుండా సమస్యలను సకాలంలో పరిష్కరించాలని ఆదేశించారు.ప్రతి రోజు ప్రజల్లో తిరిగితేనే సమస్యలు స్పష్టంగా తెలుసుకుంటామని,ఏ ఈ లు,డిఈలు అమినిటీస్ కార్యదర్శులతో కలిసి ఉదయం క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూ చించారు.తాగునీటి కొళాయి చార్జీల వసూళ్లను వేగవంతం చేయాలని,నిధుల లభ్యతను బట్టి గుత్తేదారులకు బిల్లులు మంజూరు చేయాల్సి ఉంటుందని తెలిపారు.
Comments
Post a Comment