హైకోర్టులో జర్నలిస్టులకు భారీ ఊరట...
హైకోర్టులో జర్నలిస్టులకు భారీ ఊరట
తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ,అక్రిడిటేషన్ కార్డుల నిబంధనల మా ర్పులపై తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ దా ఖలు చేసిన పిటిషన్ను గురు వారం హైకోర్టు విచారించింది.ఈ సందర్భంగా ప్రస్తుత అక్రిడిటేషన్ కార్డుల గడువును 20 26,ఏప్రిల్,30 వరకు కొనసాగించాలని ఆదేశించింది.ఈ పిటిషన్ లో,జీఓ 252,సవరిం చిన జీఓ 103 వల్ల జర్నలి స్టుల వృత్తి కార్యకలాపాలు,స దుపాయాలపై ప్రతికూల ప్రభా వం పడుతుందని ఫెడరేషన్ పేర్కొంది.పిటిషనర్ తరఫున ప్రముఖ న్యాయ వాది అడ్వొకే ట్ బర్కత్ అలీ ఖాన్ వాదనలు వినిపించారు.విచారణ సందర్భంగా స్పెషల్ అడ్వకేట్ జ న రల్ కోర్టుకు వివరణ ఇస్తూ,జర్నలిస్టుల వృత్తి కార్య కలాపాలకు ఆటంకం కలగకుండా ఉం డేందుకు తాత్కాలికంగా రెండు నెలల పాటు అక్రిడిటేషన్ కార్డుల గడువు పొడిగిస్తున్నట్లు తెలిపారు.
న్యాయం సాధించే వరకు పోరాటం ఆగదు :
ప్రభుత్వ వాదనలను రికార్డులోకి తీసుకున్న హైకోర్టు,ప్రస్తుత అక్రిడిటేషన్ కార్డులు 2026, ఏప్రిల్,30 వరకు చెల్లుబాటు అవుతాయని స్పష్టం చేసింది.అలాగే,జీఓ 252,సవరించిన జీఓ 103పై లేవనెత్తిన అభ్యంతరాలపై ప్రభుత్వం పూర్తిస్థాయి వివరణ సమర్పించాలని ఆ దేశించింది.తదుపరి విచారణను నాలుగు వారాల తర్వాతకు వాయిదా వేసింది.ఈ మ ధ్యంతర ఉత్తర్వులతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అక్రెడిటేషన్ జర్నలిస్టులు ప్రభుత్వ కార్యక్రమా లు,సౌకర్యాలను ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగించవచ్చని పేర్కొంది.తెలం గాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ సయ్యద్ ఘౌస్ ముహియుద్దీన్ అక్రిడిటేషన్ కార్డుల గడువు పొడగింపును స్వాగతిస్తూ,ఇది తాత్కాలిక ఊరట మాత్రమేన ని,జర్నలిస్టులకు న్యాయం సాధించే వరకు పోరాటం కొనసాగుతుందని తెలిపారు.
Comments
Post a Comment