హత్య కేసులో నలుగురు ముద్దాయిలు అరెస్ట్... కర్నూలు డీఎస్పీ జె.బాబు ప్రసాద్...
హత్య కేసులో నలుగురు ముద్దాయిల అరెస్ట్కర్నూలు డీఎస్పీ జె.బాబు ప్రసాద్
కర్నూలు నగరం,పాతబస్తీ,అనిల్ బార్ ప్రాంతంలో ఈ నెల 22వ తేదీన హత్య కేసులో ముద్దాయిలను అరెస్ట్ చేసి,ఆయుధాలు స్వాదీనం చేసుకున్నట్లు కర్నూలు డిఎస్పీ జె.బాబు ప్రసాద్ పేర్కొన్నారు.ఈ మేరకు గురువారం డిఎస్పీ కార్యాలయంలో ముద్దా యిల వివ రాలు వెల్లడించారు.22వ తేదీన రాత్రి సుమారు 10:00 గంటలకు పాత బస్టాండ్,అనిల్ బార్ దగ్గర పిర్యాది మారుతి పిర్యాది బాబాయి విజయ్,ముద్దాయిలు మద్యం త్రాగి ఉండి, పిర్యాది బాబాయి విజయ్ ని మద్యం తీసుకొనిరమ్మంటే మాట వినలేదని గొడవ పడినట్లు చెప్పారు.ఆ విషయంలో కక్ష పెంచుకొని ముద్దాయిలు నలుగురు ఖండేరి లోని ITI కాలే జీ దగ్గరకి ఆటోలో వెళ్ళి,పిర్యాది,పిర్యాది బాబాయి విజయ్ తో గొడవపడి కత్తులు,కర్రల తో దాడి చేస్తుండగా,ఆ విషయం తెలుసుకున్న మృతుడు అమరచింతల మనోహర్ అ క్కడికి వెళ్ళడం జరిగింది.అయితే ముద్దాయిలు అతనిని కొట్టి,ఎడమ వైపు మెడపై కత్తితో పొడవగా మనోహర్ అక్కడి కింద పడిపోయాడు.దీంతో బందువులు చికిత్స నిమిత్తం ప్ర భుత్వ సర్వజన వైద్యాశాలకు తరలించారు.డాక్టర్లు పరిశీలించి మనోహర్ అప్పటికే మృ తి చెందాడని పేర్కొన్నారు.అమరచింతల మారుతి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి వి చారణ చెప్పడం జరిగింది.
విచారణలో ముద్దాయిలు కర్నూలు నగరం,బండిమెట్టకు చెందిన తెలుగు నగేష్ (24),తె లుగు రాజు (36),తెలుగు ఈరన్న (47),ఖండెరీ వీధికి చెందిన ఎరుకలి రాముడు @ మూగేన్న(46)లను కర్నూలు ఒకటవ పట్టణ పోలీసు సిఐ,ఎస్సై చంద్ర,ఖాన్,సిబ్బంది జో హారాపురం కరెంట్ సబ్ స్టేషన్ వద్ద ముద్దాయిలను అరెస్ట్ చేసి వారిన వద్ద నుండి హత్య నేరానికి ఉపయోగించిన ఆటో,రక్తపు మరకలు కలిగిన రెండు కత్తులు,నకులు (పంచ్)ను సీజ్ చేసి అరెస్ట్ చేశారు.అనంతరం ముద్దాయిలను కోర్టు ముందు హాజరు పరిచారు.
Comments
Post a Comment