సీనియర్ జర్నలిస్ట్ ఎస్.జేమ్స్ ఆనందరావు మృతి జర్నలిస్ట్ సమాజానికి తీరనిలోటు...సంతాపసభలో వక్తలు...
సీనియర్ జర్నలిస్ట్ ఎస్.జేమ్స్ ఆనందరావు మృతి జర్నలిస్ట్ సమాజానికి తీరనిలోటుసంతాపసభలో వక్తలు
సీనియర్ జర్నలిస్ట్ జేమ్స్ మృతి జర్నలిస్ట్ సమాజానికి తీరనిలోటు అని సంతాపసభలో వ క్తలు అభిప్రాయపడ్డారు.మంగళవారం కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం,సమాచార శాఖ భవన్ ప్రాంగణంలో సీనియర్ జర్నలిస్ట్,నిత్యభాను,స్వచ్ ప్రభ పత్రికల ఎడిటర్,యు నైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (యుజెఎఫ్) కల్లూరు మండల నాయకులు ఎస్.జేమ్స్ ఆనంద రా వు మృతి సందర్బంగా యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (యుజెఎఫ్) జిల్లా కమిటీ అధ్యక్ష,కార్య దర్శులు గిలిగిత్త విజయ్ కుమార్,యు.రాజశేఖర్ ఆధ్వర్యంలో సంతాప సభ ఏర్పాటుచే శారు.
కార్యక్రమానికి వ్యవస్థాపక అధ్యక్షులు నీలం సత్యనారాయణ,గౌరవధ్యక్షులు పి.యూసుఫ్ ఖాన్,నాయకులు వి.విజయ్ కుమార్,నగర కమిటీ అధ్యక్షులు పి.నాగేందృడు,సివిఆర్ న్యూస్ ప్రతినిధి ఇస్మాయిల్,బిఆర్ కె న్యూస్ ప్రతినిధి బసవరాజు,ఆంధ్రప్రభ ప్రతినిధి సా యి కుమార్ నాయుడులు హాజరై ముందుగా జేమ్స్ ఆనందరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి సంతాపం తెలియచేశారు.అనంతరం వారు మాట్లాడుతూ సీని యర్ జర్నలిస్ట్ గా జేమ్స్ సమాజం కోసం చిత్త శుద్ధితో పని చేశాడని కొనియాడారు. అ యన భౌతికంగా సమాజంలో లేకపోయినా ఆయన కలం మాత్రం సమాజ అభివృద్ధికి కృషి చేస్తూనే ఉంటుందని అన్నారు.తోటి జర్నలిస్ట్ ల సమస్య పరిష్కారానికి నిరంతరం పాటుపడే నాయకుడుగా కల్లూరు మండలంలో కీర్తి ఘడించాడని చెప్పారు.ఆయన ఆశ య సాధన కోసం ప్రతి జర్నలిస్ట్ పాటుపడాలని కోరారు.జేమ్స్ ఆనందరావు కుటుంబాని కి యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (యుజెఎఫ్)తో పాటుగా కర్నూలు జర్నలిస్ట్ సమాజం అం డగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (యుజె ఎఫ్) జిల్లా నాయకులు మల్లికార్జున,దామోదరం సంజీవయ్య,మధు,కిషోర్ రెడ్డి,శేఖర్,ల క్ష్మి నారాయణ,నజీర్ బాషా,సురేష్,ఇతర జర్నలిస్ట్ లు హుసేన్,సురేష్,కెమెరామెన్ రాజు, సురేష్,తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment