ఘనంగా 12 వ మఠాధిపతిగా శ్రీ శ్రీ శ్రీ వీరధర్మజ వెంకటాద్రి స్వాములు వారి పట్టాభిషేకం మహోత్సవ వేడుకలు...
ఘనంగా 12వ మఠాధిపతిగా శ్రీ శ్రీ శ్రీ వీరధర్మజ వెంకటాద్రి స్వాములు వారి పట్టాభిషేకం మహోత్సవ వేడుకలుహాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్సన్ కమ్మరి పార్వతమ్మ
కడప జిల్లా బ్రహ్మంగారిమఠంలో శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి 12వ మఠాధిపతిగా శ్రీశ్రీశ్రీ వీరధర్మజ వెంకటాద్రి స్వాములు వారి పట్టాభిషేకం మహోత్స వ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా వేడుకలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్సన్ కమ్మరి పార్వత మ్మ హాజరయ్యారు.అనంతరం విశ్వకర్మ అన్నదాన సత్రం నందు మన విశ్వబ్రాహ్మణ సంఘీ యులు,పలు విశ్వ బ్రాహ్మణ సంఘ నాయకులతో చర్చించి అన్ని సంఘాలు కలిపి ఒకే ఏ కీకృత సంఘంగా ఏర్పాటు చేసుకోవడానికి మన విశ్వబ్రాహ్మణ పెద్దలు తీర్మానం చేయ డం జరిగింది.
ఈ కార్యక్రమంలో తెలంగాణ తొలి శాసన సభాపతి,తెలంగాణ శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు సిరికొండ మధు సూదనాచారి,సీనియర్ న్యాయవాది పేరు సోమల గురుప్ర సాద్ ఆచార్య,అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ క్రైమ్ బ్రాంచ్ హైదరాబాద్ కే.ఎం.కిరణ్ కు మార్,ఏపీ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్లు కుర్లపల్లి రంగాచారి,వడ్ల శ్రీనివాస్,స్వామి వారి భక్తులు విశ్వబ్రాహ్మణ సోదర,సోదరీమణులు పాల్గొన్నారు.
Comments
Post a Comment