తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం...మీడియా అకాడమీ చైర్మన్ పదవీకాలం పొడిగింపు...
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయంమీడియా అకాడమీ చైర్మన్ పదవీకాలం పొడిగింపు
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.మీడియా అకాడమీ చైర్మన్గా వ్యవ హరిస్తున్న సీనియర్ జర్నలిస్ట్ కె.శ్రీనివాస్ రెడ్డి పదవీ కాలాన్ని మరో రెండేళ్ల పాటు పొడి గిస్తూ ఇవాళ అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి.రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చాక,2024,ఫిబ్రవరి 26న రెండేళ్ల కాలానికిగాను తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్గా కె.శ్రీనివాస్ రెడ్డి నియమితులైన విషయం తెలిసిందే.కాగా,జర్నలిజం రంగంలో సుదీర్ఘ అనుభవం ఉన్న శ్రీనివాస్ రెడ్డి,జర్నలిస్టుల సంక్షేమం కోసం చేస్తున్న విశేష కృషిని ప్రభుత్వం గుర్తించి ఆయన పదవీ కాలాన్ని పొడిగించింది.తాజా ఉత్తర్వుల ప్రకారం,ఆ యన మరో రెండేళ్ల పాటు తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్గా కొనసాగనున్నారు.జ ర్నలిస్టులకు అక్రిడిటేషన్లు,ఇళ్ల స్థలాలు,హెల్త్ కార్డులు,ఇతర సంక్షేమ పథకాల అమలులో శ్రీనివాస్ రెడ్డి కీలక పాత్ర పోషించనున్నారు.
Comments
Post a Comment