చౌరస్తా బైపాస్ విస్తరణ వేగవంతం...నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్...
చౌరస్తా బైపాస్ విస్తరణ వేగవంతంనగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్
కర్నూలు నగరంలోని చౌరస్తా బైపాస్ రహదారి విస్తరణ పనులను వేగవంతం చేసి ఆర్టీసీ బస్సుల రాకపోకలకు సౌలభ్యం కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు నగరపాలక సం స్థ కమిషనర్ పి.విశ్వనాథ్ తెలిపారు.నగరంలోని బళ్ళారి చౌరస్తా బైపాస్ వద్ద మలుపు ప్రాంతంలో ఉన్న మరో రెండు షాపులను తొలగించి రహదారి విస్తరణ పనులు చేపట్టను న్నట్లు వెల్లడించారు.మంగళవారం ఆయన సంబంధిత ప్రాంతాన్ని ప్రత్యక్షంగా పరిశీలిం చి అధికారులకు దిశానిర్దేశం చేశారు.పోలీస్ శాఖ అనుమతులు పొందిన అనంతరం తొ లగింపు చర్యలు చేపట్టి రహదారి పనులను త్వరితగతిన పూర్తి చేయనున్నట్లు స్పష్టం చే శారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ...నూతనంగా నిర్మించిన బైపాస్ వద్ద ఆర్టీసీ బస్సులు సులభంగా తిరుగుటకు మలుపు ప్రాంతంలో అడ్డంకులుగా ఉన్న నిర్మాణాలను తొలగించ డం అవసరమని తెలిపారు.ప్రజలకు ఇబ్బందులు కలగకుండా,ట్రాఫిక్ సాఫీగా సాగేందుకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.అదేవిధంగా మద్దూర్ నగర్ కారికతీయ పాఠశాల వెనుకనున్న మున్సిపల్ విద్యానవనం (పింగళి సూరన తెలుగు తోట)ను పరిశీ లించారు.పార్కు అభివృద్ధి భాగంగా నడకబాట ఏర్పాటు,జిమ్ పరికరాల స్థాపన వంటి చ ర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎస్.ఈ.రమణమూర్తి,ఇంచార్జీ సిటి ప్లానర్ వై.వెంకటరమణ,ఎం.ఈ.మనోహర్ రెడ్డి,డిఈఈ పవన్ కుమార్ రెడ్డి,బిల్డింగ్ ఇన్ స్పెక్టర్ ది వాకర్,తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment