హత్య కేసులో ముద్దాయికి జీవిత ఖైదు...
హత్య కేసులో ముద్దాయికి జీవిత ఖైదు
కర్నూలు,ఉలిందకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన హత్య కేసులో నిందితుడు బో య గిడ్డయ్య @ సంతెన్నకు జీవిత ఖైదు శిక్ష విధించినట్లు కర్నూలు ఒకటవ అదనపు జి ల్లా & సెషన్స్ న్యాయ మూర్తి పి.కమలదేవి తెలియజేశారు.ఈ మేరకు గురువారం నింది తుడు వివరాలు వెల్లడించారు.ఉలిందకొండ పి.ఎస్.క్రైమ్ నెం.76/2016, సెక్షన్లు 302, 201,379 r/w 109 ఐపీసీ ప్రకారం నమోదు చేయబడిన కేసులో,ఫిర్యాదుదారుడు ముల్లా ముర్తు జావలి (40),కర్నూలు జిల్లా,కల్లూరు మండలం,ఉలిందకొండ గ్రామంకు చెందిన వ్యక్తి.అయితే గూడూరు గ్రామానికి చెందిన ఎనిమిది సంవత్సరాల బాలిక హత్య కు గురైన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.దర్యాప్తులో నింది తులు కర్నూలు జిల్లా,కల్లూరు మండలం,ఎర్రకత్వ గ్రామానికి చెందిన బోయ గిడ్డయ్య @ సంతెన్న(60),గూడూరు మండ లం,గ్రామానికి చెందిన బోయ తలారి రంగడు (35)ల పై దర్యాప్తు పూర్తిచేసి కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేయగా,కేసు విచారణ చేపట్టారు.ఈ నే పథ్యంలో కర్నూలు 1వ అదనపు జిల్లా & సెషన్స్ న్యాయమూర్తి పి.కమల దేవి గురువా రం తీర్పు వెలువరించారు.నిందితుడు బోయ గిడ్డయ్య @ సంతెన్నకు సంబంధిత నేరం లో దోషిగా నిర్ధారించి,జీవిత ఖైదు శిక్షతో పాటు రూ.7,000 జరిమానా విధించారు. జ రిమానా చెల్లించని పక్షంలో అదనంగా 2 నెలల 15 రోజుల పా టు జైలు శిక్ష ఉంటుం ది.నిందితుడు బోయ తలారి రంగడును సాక్ష్యాల లోపం కారణంగా విముక్తి కల్పించారు. ఈ కేసును సమర్థవంతంగా దర్యాప్తు చేసి,నిందితుడికి శిక్షపడేలా అప్పటి కర్నూలు రూరల్ సిఐ నాగరాజు యాదవ్ కృషి చేశారు.ముద్దాయికి శిక్ష పడుటకు కృషి చేసిన క ర్నూలు రూరల్ సి.ఐ.ఎం.చం ద్రబాబు నాయుడు,ఉలిందకొండ ఎస్సై ధనుంజయ,కోర్టు కానిస్టేబుల్ లను కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ అభినందించారు.
Comments
Post a Comment