37వ వార్డులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ...
37వ వార్డులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ
కల్లూరు మండలం,37 వ వార్డు వెంకటేశ్వర స్వామి దేవాలయం పక్క వీధిలో పేదల సేవలో ఎన్టీఆర్ భరో సా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు.కా ర్యక్రమానికి గౌరు దంపతుల తనయుడు యువ నా యకులు గౌరు జనార్ధన్ రెడ్డి,ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్సన్ కమ్మరి పార్వత మ్మలు హాజరై ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేశారు.అదేవిదంగా ప్రజా సమస్యలు,మౌలిక సదుపాయాలు,ప్రభుత్వ పనితీరు వంటి అంశాలపై ప్రజలను అడిగి తెలుసుకోవడం జరిగింది.ఈ కార్యక్ర మంలో క్లస్టర్ ఇన్చార్జి జనార్ధన్ ఆచారి, 37వ వార్డు ఇన్చార్జి సుతారు రాఘవేంద్ర,41వ వార్డు ఇన్చార్జి నా గేశ్వరరావు,సీనియర్ నాయకులు,కార్యకర్తలు,అభి మానులు,తదితరులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
Comments
Post a Comment