పోస్టుమార్టం నివేదిక కోసం లంచం డిమాండ్ చేసిన హోం గార్డ్ ను ఎసిబి పట్టివేత...
పోస్టుమార్టం నివేదిక కోసం లంచం డిమాండ్ చేసిన హోం గార్డ్ ను ఎసిబి పట్టివేత
మల్కాజిగిరి జిల్లా,కీసరలో లంచం వ్యవహారం వెలుగుచూసింది.పోస్ట్మార్టం నివేదిక ఇప్పిస్తానని చెప్పి డబ్బులు డిమాండ్ చేసిన హోంగార్డ్ నగే ష్ను అవినీ తి నిరోధక శాఖ అధికారులు రంగంలోకి దిగి పట్టుకు న్నారు.వివరాల్లోకి వెళ్తే...తోటకూరు మహేశ్ నాలుగు నెలల క్రితం మృతి చెం దాడు.కుటుంబ సభ్యులు పో స్ట్ మార్టం నివేదిక కో సం నగేష్ను సంప్రదించారు.ఈ క్రమంలో గాంధీ ఆస్పత్రిలో పరిచయం ఉన్న సందీప్ పేరును ప్రస్తావిస్తూ రిపోర్ట్ కావాలంటే రూ.2 లక్షలు ఇ వ్వాలని నగేష్ డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉ న్నాయి.చివరకు మృతుడి మేనల్లుడు శరత్ తో చ ర్చించి రూ.40వేలకు ఒప్పందం కుదుర్చుకు న్నాడు. దీంతో బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించా రు.అధికారులు పన్నిన ఉచ్చులో భాగంగా మొదట రూ.5 వేలు తీసుకున్న నగేష్, రెండో విడతగా రూ.35 వేలు స్వీకరిస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డా డు.పట్టుకున్న డబ్బులను స్వాధీనం చేసుకున్న అధి కారులు,నగేష్పై కేసు నమోదు చేసి తదుపరి చర్య లు ప్రారంభించారు.ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
Comments
Post a Comment