కల్తీ పాలతో నలుగురు మృతి...వెలుగులోకి సంచలన విషయాలు...
కల్తీ పాలతో నలుగురు మృతివెలుగులోకి సంచలన విషయాలు
రాజమండ్రిలో చోటు చేసుకున్న కల్తీ పాలు విషాదానికి సంబంధించి సంచలన విషయా లు వెలుగులోకి వస్తున్నాయి.నలుగురు మృతి చెందగా,మరో 8 మంది కిడ్నీ సమస్యలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న ఘటనకు కారణమైన పాలల్లో ఇథిలీన్ గ్లైకాల్ కలిసిం దని అధికారుల విచారణలో నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తుంది.నేడు ఫోరెనిక్స్ నివేదికలు వస్తే అధికారికంగా నిర్ధారణ అయ్యే ఛాన్స్ ఉంది.తూర్పు గోదావరి జిల్లా,కోరుకొండ మండలం,నరసాపురంకు చెందిన గణేష్ అనధికారికంగా నిర్వహిస్తున్న వరలక్ష్మీ డెయిరీ లో,పాలు కల్తీ జరిగినట్లు అధికారులు గుర్తించారు.డెయిరీలోని రిఫ్రిజిరేటర్ లో కూలెంట్ గా వినియోగించే ఇథిలీన్ గ్లైకాల్ ఈ నెల 15వ తేదీన లీకై,ఒక పాల క్యాన్లో కలిసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.అదే రోజు సరఫరా చేసిన పాలు వినియోగించిన కుటుం బాల్లో తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తాయి.దీంతో రాజమండ్రిలోని చౌడేశ్వరి నగ ర్,స్వ రూప్ నగర్ ప్రాంతాలకు చెందిన నాలుగు కుటుంబాల్లో 12మంది,అనూరియా సమస్య తో ఆసుపత్రుల్లో చేరారు.కాగా,ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా,8 మందికి చికి త్స అందిస్తున్నారు.వీరిలో ముగ్గురు చిన్నారులు ఉండగా,ఒక చిన్నారి మరో ఇద్దరు వృద్ధు ల పరిస్థితి విషమంగా ఉంది.కాగా పాలల్లో కలిసిన ఇథిలీన్ గ్లైకాల్ సాధారణంగా రిఫ్రిజిరే టర్ లలో కూలెంట్గా ఉపయోగిస్తారు.ఇది శరీరంలోకి వెళ్లినప్పుడు తీవ్రమైన విష ప్రభా వం చూపి కిడ్నీలను దెబ్బతీస్తుంది.అధిక మోతాదులో తీసుకుంటే మూత్రపిండాల కరాబ్ అ యి,మెదడు దెబ్బతినడం,ఆకస్మికంగా చనిపోయే ప్రమాదం ఉంటుంది.బాధితుల్లో కనిపిం చిన లక్షణాలు ఈ రసాయన ప్రభావంతో సరిపోయినట్లు వైద్యులు పేర్కొంటున్నారు.ఇ క,పాలు,పెరుగు నమూనాలను సేకరించి సెంట్రల్ ఫోరెనిక్స్ సైన్స్ ల్యాబ్ కు,స్టేట్ ఫోరె న్సిక్ సైన్స్ ల్యాబ్ లకు ఇప్పటికే అధికారులు పంపించారు.కాగా,వందలాది మంది రక్త న మూనాలు సేకరించగా,ఫోరెన్సిక్ రిపోర్ట్స్ నేడు రానున్నాయి.అధికారిక నివేదికలతో కల్తీ పాల వ్యవహారంపై పూర్తి స్థాయిలో నిర్ధారణ కానుంది.
Comments
Post a Comment