తూర్పుగోదావరి జిల్లాలో పరువు హత్య...
తూర్పుగోదావరి జిల్లాలో పరువు హత్య
తూర్పుగోదావరి జిల్లా,మండపేట నియోజక వర్గం,ద్వారపూడి గ్రామంలో హత్యా సంఘటన చోటుచేసుకుంది.వివరాలు ఇలా ఉన్నాయి...
మృతుడు పోలిపల్లి సూర్యప్రకాశ్ (41),ఆయన విల్లి సంధ్య (40).సంధ్య ప్రస్తుతం రాయవరం డిప్యూటీ తహసీల్దార్గా పనిచేస్తున్నారు.వీరిద్దరూ గత రెండు సంవత్సరాలుగా పరస్పరం ప్రేమించుకున్నారు.ఈ నెల 26వ తేదీన అన్నవరం దేవస్థానంలో వివాహం చేసుకున్నట్లు సమాచారం.ఈ వివాహంపై అభ్యంత రం వ్యక్తం చేసిన యువతి కుటుంబ సభ్యులు, సుమారు రాత్రి 11:30 గంటల సమయంలో పెళ్లి కొడుకు ఇంటికి వెళ్లి అతి కిరాతకంగా రాళ్లతో దాడి చేయడంతో పోలిపల్లి సూర్యప్రకాశ్ తీవ్ర గాయాలకు గురై అక్కడికక్కడే మృతి చెందారు.సమాచారం తెలి సిన వెంటనే మండపేట రూరల్ ఎస్సై వి.కిషోర్,సీఐ పి.దొరరాజు సిబ్బందితో ఘటనా స్థలం చేరుకుని ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించి నట్లు తెలిపారు.ఈ దర్యాప్తులో ఈస్ట్ జోన్ డీఎస్పీ విద్యా కూడా సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృ తదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుప త్రికి తరలించామని,దర్యాప్తు అనంతరం పూర్తి వివ రాలు తెలియజేస్తామని సీఐ పి.దొరరాజు పేర్కొన్నా రు.
Comments
Post a Comment