కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై దాడి చేసిన బిజెపి గుండాలను వెంటనే అరెస్టు చేసి జిల్లా ఎస్పీ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి...మాజీ ఎమ్మెల్సీ ఎం.సుధాకర్ బాబు...
కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై దాడి చేసిన బిజెపి గుండాలను వెంటనే అరెస్టు చేసి జిల్లా ఎస్పీ
ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి
మాజీ ఎమ్మెల్సీ ఎం.సుధాకర్ బాబు
కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై దాడి చేసిన బిజెపి గుండాలను వెంటనే అరెస్టు చేసి కర్నూలు జిల్లా ఎస్పీ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని మాజీ ఎమ్మెల్సీ,ఏఐసీసీ సభ్యులు ఎం సుధాకర్ బాబు డిమాండ్ చేశారు.శనివారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి సుధాకర్ బాబు పత్రికా ప్రకటన విడుదల చేస్తూ కర్నూలు జిల్లా ఎస్పీకి విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. కర్నూలు జిల్లా చరిత్రలో ఏరోజు ఒక పార్టీ ఆఫీస్ పై మరో పార్టీ దాడికి వెళ్లినట్టు కర్నూలు చరిత్రలో లేదని,కానీ బిజెపి పార్టీ గుండాలు కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పైన దాడి చేసి విధ్వం సం సృష్టించి గేట్లు విరగొట్టి,ఫ్లెక్సీలు చింపివేసి విధ్వంశం చేస్తే వారిని ఎందుకు అరెస్టు చేయలే దని జిల్లా ఎస్పీని ప్రశ్నించారు.మీరు మీడియా, పేపర్లలలో చూసివుంటారని,పేపర్లలో వచ్చిన దానికి ప్రతిష్పందన ఉండాలి కదా.ఎవరు ఏమి చేశారు అన్నది.ఢిల్లీలో జరిగిన ఏఐ సమ్మిట్ లో నిరసన తెలిపిన యూత్ కాంగ్రెస్ వారిని అరెస్టు చేసి రిమాండ్ లో ఉంచారు.వారిలో ఒకరు దొర కలేదని పోలీసులు హిమాచల్ ప్రదేశ్ కు వెళ్లి అరె స్టు చేసి తీసుకొచ్చారు.పోలీస్ వారు అంత నిబ ద్ధత చూపించినప్పుడు కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై దాడి చేసి విధ్వంసం సృచిం చిన వారిపైన ఎందుకు అంత ప్రేమ చూపిస్తున్నా రు.మీరు వారిని అరెస్టు చేయాలి కదా అదే మా కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తే కేసులు పెట్టి అరె స్టులు చేయకుండా ఉంటారా అని సుధాకర్ బా బు ప్రశ్నించారు.కచ్చితంగా ఇలాంటి దాడులకు విధ్వంసం సృటించిన బిజెపి గుండాలను వెంటనే అరెస్టు చేయాలి.ఈ మతతత్వ ఉన్మాదులను వదిలేస్తే దేశ ఉనికికే ప్రమాదం అని వారు విమర్శించారు.అలాంటి వారిని వెంటనే అరెస్టు చేయాలని,లేనిపక్షంలో కలెక్టరేట్ ఎదుటగాని, రెండవ పట్టణ పోలిస్టేషన్ ఎదుటగాని ప్రత్యక్ష ధర్నా నిర్వహించాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐ ఎన్ టి యు సి ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ ఖాద్రి బాషా, ఐఎన్టీ యసీ జిల్లా అధ్యక్షులు బి బతుకన్న,ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు ఎన్సీ బజారన్న,మైనార్టీ సెల్ జిల్లా చైర్మన్ షేక్ ఖాజా హుస్సేన్,ఐ ఎన్ టి యు సి సిటీ అధ్యక్షులు రేపల్లె ప్రతాప్, తదితరులు పా ల్గొన్నారు.
Comments
Post a Comment