కువైట్లోని భారతీయులకు రాయబార కార్యాలయం కీలక సూచనలు...అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి...
కువైట్లోని భారతీయులకు రాయబార కార్యాలయం కీలక సూచనలు
అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి
కువైట్ సిటీ,ప్రాంతీయంగా నెలకొన్న ప్రస్తుత భ ద్రతా పరిస్థితుల నేపథ్యంలో కువైట్లో నివ సిస్తున్న భారతీయ పౌరులందరూ అప్రమత్తంగా ఉండాలని భారత రాయబార కార్యాలయం (Indian Embassy) ఒక ప్రకటన విడుదల చే సింది.తాజా పరిణామాలను గమనిస్తూ,తగు జాగ్రత్తలు పాటించాలని సూచించింది.
ముఖ్యమైన మార్గదర్శకాలు :
అప్రమత్తత అవసరం : ప్రతి ఒక్కరూ అప్రమత్తం గా ఉండాలి.స్థానిక భద్రతా నిబంధనలను, మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలి.వార్తలను గమనించండి : కువైట్ ప్రభుత్వం చేసే అధికారిక ప్రకటనలను, వార్తా మాధ్యమాలను ఎప్పటికప్పుడు ఫాలో అవ్వాలని రాయబార కార్యాలయం కోరింది.
సాధారణ సేవలు : ఎంబసీ కార్యకలాపాలు యధావిధిగా కొనసాగుతాయని,తదుపరి అప్డేట్స్ కోసం వేచి ఉండాలని స్పష్టం చేసింది.
సహాయం కోసం సంప్రదించండి :
భారతీయులకు ఏదైనా సందేహాలున్నా లేదా అత్యవసర సహాయం కావాలన్నా ఈ క్రింది మార్గాల ద్వారా ఎంబసీని సంప్రదించవచ్చు :
హెల్ప్లైన్ నంబర్: +965 65501946
ఈమెయిల్: community.kuwait@mea.gov.in~
Comments
Post a Comment