రూ.22 లక్షలు విలువజేసే 730కేజీల గంజాయి పట్టివేత...బి.నాగేశ్వర నాయక్,దేవరపల్లి సీఐ...

రూ.22 లక్షలు విలువజేసే 730కేజీల గంజాయి పట్టివేత
బి.నాగేశ్వర నాయక్,దేవరపల్లి సీఐ 

VS9TV న్యూస్,తూర్పు గోదావరి :

లారీలో అక్రమంగా రవాణా చేస్తున్న 730కేజీల గంజాయిని తూర్పు గోదావరి జిల్లా,దే వరపల్లి మండలం, యర్నగూడెంలో పోలీసులు పట్టుకున్నారు.స్వాధీనం చేసుకున్న గం జాయి విలువ సుమారు రూ 22 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.ఇందుకు సం బంధించి దేవరపల్లి సీఐ బీ నాగేశ్వర నాయక్ మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం... హైదరాబాద్ కు చెందిన కర్రే శ్రీశైలం‌ (ఏపీ 16 టీఎక్స్ 5319) లారీలో ఒడిస్సా మల్కా న్ గిరి ప్రాంతానికి వెళ్ళి గంజాయి తీసుకుని హైదరాబాదులో నర్సిరెడ్డి,యాదయ్యలకు రవాణా చేస్తే ఎక్కువ మొత్తంలో డబ్బులు ఇస్తామని ఆశ చూపారు.దీంతో శ్రీశైలం మల్కా న్ గిరి వెళ్ళి గంజాయిని‌ తన లారీ సీక్రెట్ కాబిన్ లో నింపుకున్నాడు. తెలంగాణాకు రవా ణా చేయటానికి హైవే మార్గంలో దేవరపల్లి మీదుగా వెళుతుండగా డైమండ్ జంక్షన్ దాటి న తరువాత గోల్డెన్ ఫిష్ ధాబా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఈ అక్రమ గంజాయి ర వాణా గుట్టు బయటపడింది.గోల్డెన్ ఫిష్ ధాబా దగ్గర హైవే రోడ్డులో బైక్ ను లారీ ఢీకొ ట్టింది.ఈ ప్రమాదంలో బైక్ పై వెళుతున్న జంట అక్కడికక్కడే మృతిచెందారు.దీంతో లారీ డ్రైవర్ శ్రీశైలం (ముద్దాయి) లారీతో సహా కొవ్వూరు నుంచి నల్లజర్ల పోవు ఎన్హెచ్ 16 స ర్వీసు రోడ్డు పక్కన యర్నగూడెం గ్రామ శివార్లలో ఇటుకల బట్టి వద్ద ఎవరికీ కనబడ కుండా లారీని పార్క్ చేశాడు. తమకు అందిన సమాచారం మేరకు గంజాయితో ఉన్న లారీని స్వాధీనం చేసుకుని,ముద్దాయిని అరెస్టు చేసినట్టు సీఐ నాగేశ్వర నాయక్ తెలిపా రు.ఈ కేసులో హైదరాబాదుకు చెందిన నర్సిరెడ్డి,యాదయ్యలను అరెస్టు చేయాల్సి ఉం దన్నారు.లారీలో ఉన్న 18 గంజాయి మూటలు (730 కేజీలు),లారీ,ఒక సెల్ ఫోన్,వె య్యి రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్టు సీఐ తెలిపారు.ముద్దాయిని జ్యుడీషియ ల్ రిమాండ్ నిమిత్తం కొవ్వూరు కోర్డుకు తరలించామన్నారు.ఈ కేసులో ప్రతిభ కనపర చిన దేవరపల్లి ఎస్సై హెచ్.సి.వీ చక్రవర్తి,వి.చంద్రశేఖర్,ఆరగవీ రమణ,షేక్ సలీం,పి.రా మారావులను జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ప్రత్యేకంగా అభినందించారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....