ప్రతి పౌరుడు రాజ్యాంగంపై అవగాహన పెంచుకోవాలి...పౌరుల హక్కులు రాజ్యాంగం ద్వారానే కాపాడబడుతాయి...డాక్టర్ వి.బ్రహ్మారెడ్డి,జన విజ్ఞాన వేదిక వ్యవస్థాపక సభ్యులు...
ప్రతి పౌరుడు రాజ్యాంగంపై అవగాహన పెంచుకోవాలిపౌరుల హక్కులు రాజ్యాంగం ద్వారానే కాపాడబడుతాయిజె.వి.వి కార్యకర్తలు సామాజిక అంశాలు, శాస్ర్తీయ దృష్టితో పరిష్కారాల కోసం ప్రయత్నం చేయాలిడాక్టర్ వి.బ్రహ్మారెడ్డి,జన విజ్ఞాన వేదిక వ్యవస్థాపక సభ్యులు
VS9TV న్యూస్,కర్నూలు హాస్పిటల్ :
ప్రతి పౌరుడు రాజ్యాంగంపై అవగాహన పెంచుకోవాలని,పౌరుల హక్కులు రాజ్యాంగం ద్వారానే కాపాడబడుతాయని,ఇందుకోసం జన విజ్ఞాన వేదిక (జె.వి.వి) కార్యకర్తలు సా మాజిక అంశాలు,శాస్ర్తీయ దృష్టితో పరిష్కారాల కోసం ప్రయత్నం చేయాలని జన విజ్ఞా న వేదిక వ్యవస్థాపక సభ్యులు డాక్టర్ వి బ్రహ్మారెడ్డి అన్నారు.శుక్రవారం స్థానిక బిర్లా కాం పౌండ్ యందు వివిధ జిల్లాల నుండి వచ్చిన వేదిక కార్యకర్తలకు మూడు రోజుల రాష్ట్ర స్థా యి శిక్షణా కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ వేదిక కార్యకర్తలకు శాస్త్రీయ దృక్పథం అవసరమని అందుకే మూడు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అ ని తెలిపారు.జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు బర్మా సురేష్ కుమార్ మాట్లాడుతూ వేదిక విద్య,ఆరోగ్యం,పర్యావరణం,మహిళా సాధికారత మూఢనమ్మకాల లాంటి అంశాలపై ప నిచేస్తుందని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందుస్తే రాష్ట్ర స్థాయిలో అన్ని జిల్లాల్లో జెవివి జిల్లా, మండల కమిటీలు పై రంగాల్లో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.గత 30 సం..లుగా అక్షరాస్యత,పొదుపు,విద్య,ఆరోగ్య రంగాల్లో రాష్ట్ర ప్రభు త్వాలతో కలిసి పనిచేసినట్లు చెప్పారు.విద్యార్థుల్లో విద్యార్థి విజ్ఞాన వేదిక లని ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో జన విద్యార్థి నాయకులు కృష్ణాజీ,మహ మ్మమద్ మియ్య, శ్రీనివాసులు,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపాల్ నాయక్,నాయకులు రమ ణయ్య,సుజాత,మీనా,శాంతి,చక్రపాణి,డా.కోటేశ్వర రావు,శ్రీను,వెంకటరమణా రెడ్డి,సు ధాకర్,హరేరామ్,తదితరులు పాల్గొన్నారు.

Comments
Post a Comment