జగన్నాథ గట్టుపై ప్రభుత్వ భూములు పరిశీలన...పి.రంజిత్ బాషా,జిల్లా కలెక్టర్...
జగన్నాథ గట్టుపై ప్రభుత్వ భూములు పరిశీలనపి.రంజిత్ బాషా,జిల్లాకలెక్టర్ ..
VS9TV న్యూస్,కర్నూలు కలెక్టరేట్ :
కర్నూలు నగర శివారులోని జగన్నాథగట్టు వద్ద వివిధ సంస్థల ఏర్పాటుకు కేటాయించిన ప్రభుత్వ భూములను,అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను గురువారం జిల్లా కలెక్టర్ పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జగన్నాథ గట్టు వద్ద టిడ్ కో గృహాలకు, క్లస్టర్ యూనివర్సిటీ,ఐఐటీడిఎమ్ కు,ఇతర సంస్థల కోసం కేటాయించిన భూములను ప రిశీలించారు.మ్యాపుల ద్వారా వివరాలను అడిగి తెలుసుకున్నారు.వివిధ సంస్థల ఏర్పా టుకు కేటాయించిన భూములకు సంబంధించి సమగ్రమైన వివరాలతో నివేదిక అందచే యాలని కలెక్టర్ ఆర్డీఓ,తహసీల్దార్లను ఆదేశించారు.
సిల్వర్ జూబ్లీ క్లస్టర్ యూనివర్సిటీకి సంబంధించి నిర్మాణ పనులకు పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేసేందుకు ని ధుల విడుదలకు చర్యలు తీసుకోవాలని సంబంధిత ఈఈ కలెక్టర్ దృష్టికి తీసుకొని రాగా,మరొక సారి డిఓ లెటర్ సి ద్ధం చేసి పంపాలని కలెక్టర్ సిల్వర్ జూబ్లీ క్లస్టర్ ఈఈ ను ఆదేశించారు.అనంతరం కర్నూలు నగర శివారులోని జగ న్నాథగట్టు,రూపాల సంగమేశ్వర స్వామి ఆలయం,దర్గాల ను కలెక్టర్ దర్శించుకొన్నారు.ఇలాంటి టూరిస్ట్ ప్రదేశాల ను ప్రజలకు తెలియచేసే విధంగా పెద్ద ఎత్తున పబ్లిసిటీ చేయాలని కలెక్టర్ కర్నూలు ఆర్డీఓను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో కర్నూలు ఆర్డీఓ సందీప్,క్లస్టర్ యూనివర్సిటీ రి జిస్ట్రార్ వెంకటేశ్వర్లు,కల్లూరు తహసిల్దార్ ఆంజనేయులు,కర్నూలు మండల తహసిల్దార్ ర మేష్,క్లస్టర్ యూనివర్సిటీ ఈఈ లక్ష్మీ నారాయణ, తదితరులు పాల్గొన్నారు.

Comments
Post a Comment