నకిలీ ఫోన్ పే యాప్ తో ఘరానా మోసం...స్కానర్ ద్వారా డబ్బులు తీసుకునేవారు తమ అకౌంట్ తప్పకుండా చెక్ చేసుకోవాలి...
నకిలీ ఫోన్ పే యాప్ తో ఘరానా మోసంస్కానర్ ద్వారా డబ్బులు తీసుకునేవారు తమ అకౌంట్ తప్పకుండా చెక్ చేసుకోవాలి
VS9TV న్యూస్,మంచిర్యాల క్రైం :
మంచిర్యాల జిల్లా,మందమర్రి పట్టణంలో ఘరానా మోసం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిం ది.పూర్తి వివరాల్లోకి వెళితే....కొన్ని నెలల క్రితం మందమర్రి పాత బస్టాండులో ఒక వ్యక్తి సూపర్ మార్కెట్లోకి వచ్చే నిత్యవసర సరుకులను కొనడం జరిగింది.బిల్లు రూ.1000 రూ పాయలు కాగా సరుకులు కొన్న వ్యక్తి ఫోన్ పే స్కానర్ ద్వారా పే చేసినట్లు,తన ఖాతా లో నుండి డబ్బులు కట్టయినట్టు ఆ సూపర్ మార్కెట్ యజమానికి చూపించాడు. సరుకు లు తీసుకెళ్లాడు.కొంత సమయం తర్వాత యజమానికి అనుమానం వచ్చి తన అకౌంట్లో చెక్ చేసుకోగా సూపర్ మార్కెట్ యాజమాని ఖాతాలోకి డబ్బులు రాకపోయేసరికి తను నకిలీ కేటుగాళ్ల వలలో పడి మోసపోయినానని గ్రహించారు.చుట్టు ప్రక్కల స్థానికులకు విషయం తెలిస్తే షాపు పరువు పోతుందన్న భయంతో యజమాని కొన్ని నెలల వరకు ఎవరికీ విషయాన్ని తెలియని ఇవ్వకపోవడంతో విషయం ఆలస్యంగా బయటకు వచ్చిం ది.అధికారులు ప్రజలకు పదేపదే ఈ నకిలీ ఫోన్ పే యాప్,సైబర్ మోసాలకు పాల్పడు తున్న కేటుగాళ్ల వలలో పడకుండా జాగ్రత్తలు వహించాలని హెచ్చరిస్తూనే ఉన్నారు.మం దమర్రి పట్టణంలో నకిలీ ఫోన్ పే మోసాలకు పలుపడుతున్న కేటుగాళ్ల వలలో పడకుండా వ్యాపారస్తులు,తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఎవరైనా ఇలాంటి మోసాలకు పాల్పడితే పోలీస్ అధికారులకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచిస్తున్నారు. వ్యాపారస్తు లు,చిరు వ్యాపారులు,ప్రతి ఒక్కరు తస్మాత్ జాగ్రత్త.

Comments
Post a Comment