ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు రెండవ గేట్ ఓపెన్...ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకే...ఆస్పత్రిలో పార్కింగ్ స్థలాలు గుర్తింపు...డా.కె.వెంకటేశ్వర్లు,ఆసుపత్రి సూపరింటెండెంట్...
ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు రెండవ గేట్ ఓపెన్ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకే... ఆస్పత్రిలో పార్కింగ్ స్థలాలు గుర్తింపుడా.కె.వెంకటేశ్వర్లు,ఆసుపత్రి సూపరింటెండెంట్
VS9TV న్యూస్,కర్నూలు హాస్పిటల్ :
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఆస్పత్రికి చికిత్స నిమిత్తం వచ్చే రోగులు...ఎటువం టి ఇబ్బంది పడరాదన్న సదుద్దేశంతో ఆస్పత్రి రెండవ గేట్ ను ఓపెన్ చేస్తున్నామని,దీంతో కొంత ట్రాఫిక్ సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉందని ,ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.కె.వెంకటేశ్వర్లు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.రోగులకు వేగంగా...మెరుగైన వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో సోమవారం నుంచి ఆస్పత్రి రెండవ గేట్ ( ఇన్) ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.ఆస్పత్రిలో పార్కింగ్ స్థలాలు లేక కొన్నేళ్లుగా రోగులు...వైద్య సిబ్బంది ఇబ్బంది పడుతున్నారని,ఇక నుంచి పార్కింగ్ సమస్య తలెత్త కూడదని పార్కింగ్ స్థలాలను కూడా గుర్తించామని,వాటిని అభివృద్ధి చేసిన తరువాత అందుబాటులోకి తీసు కొస్తామని వెల్లడించారు.రోగికి ఐడీ కార్డు...వివిధ వ్యాధుల నిమిత్తం వచ్చే రోగులకు ఆ యుష్మాన్ భారత్ హెల్త్ ఐడి కార్డ్, ఆధార్ కార్డు లింక్ అయినా ఫోన్ వారి వెంట తీసుకు రావాలని అన్నారు. ఆసుపత్రికి వచ్చిన యుహెచ్ ఐడి నెంబర్ ద్వారా వారి హెల్త్ రికార్డు పర్మినెంట్ గా ఐడి ద్వారా వారికి ట్రీట్మెంట్ త్వరగా అందుతుందని అన్నారు.ప్రజలను మీడి యా ద్వారా ప్రజలను కోరారు.రోగికి వచ్చిన వ్యాధి...చికిత్స వివరాలు...రక్త,యూరిన్ ప రీక్షలు తదితర అంశాలను ఆన్లైన్లో నమోదయితాయని అన్నారు.దీంతో సదరు రోగి ఏ ప్ర భుత్వ,ప్రైవేట్ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం వెళ్లినా యుహెచ్ ఐడి ఐడీ కార్డు నెంబరు ద్వారా కంప్యూటర్లో వివరాలు ఉంటాయని చెప్పారు.ప్రతి పీహెచ్ సిలో కూడా ఐడీ కార్డును రూ పొందిస్తారని,అక్కడికి వెళ్లి కార్డు తయారు చేయించుకుంటే మేలని, ఇక్కడికి వచ్చి ఇబ్బం ది పడరాదని వారు తెలిపారు.

Comments
Post a Comment